ఇంక్విలాబ్ జిందాబాద్ !
ʹతరగతి గదుల నుంచి నిష్క్రమిస్తున్న ʹచరిత్రʹ పార్లమెంటు కెక్కడం మంచిదే అయినా ఆ చర్చ భగత్సింగ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు, ఆయన కలలుగన్న సమాజం తదితరాల పై సాగాలని..ʹ ఆశించినప్పుడు ఆయన అవగాహనపై, విప్లవ ఆచరణపై మరింతగా దృష్టి పెట్టాలి. భగత్సింగ్ను బ్రిటిష్ వసవాదులు ఉరితీయాలని సంకల్పించుకోవడానికి ప్రధానమైన కారణం ʹఆయన రూపొందుతున్న లెనిన్ʹ అని గుర్తించి భయపడడమేనని అన్నాడు బిపిన్ చంద్ర.
అయితే భగత్సింగ్ను విప్లవకారుడుగా గుర్తించడానికి పాలకులయిన వలసవాదులకు సరే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకన్నిటికీ ఏదో ఒక అభ్యంతరముండింది. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో, కార్మిక కర్షక రాజ్యస్థాపన కోసం ఆయన పంజాబ్ మొదలు ఉత్తరప్రదేశ్ వరకు ఏర్పాటు చేసిన కిర్తి కిసాన్ పార్టీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, నవజవాన్ భారత్ సభ ఎంచుకున్న ఆశయాలు, మార్గం చూసినా ఆనాటి రాజకీయ పార్టీలకు దేనికీ ఆమోదయోగ్యమైనవి కాదు. 1936 కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెహ్రూ ఆయన అనుయాయులు భగత్సింగ్ ఆదర్శాన్ని, త్యాగాన్ని కొనియాడినట్లు కనిపించినా నెహ్రూపై, కాంగ్రెస్ పార్టీపై గాంధీకున్న పట్టువల్ల వాళ్ల సమర్థనకు పరిమితులేర్పడినాయి. పైగా గాంధీ ఎంచుకున్న అహింసామార్గం, సామరస్య ధోరణి, కాంగ్రెస్ పార్టీ పథ నిర్దేశాలయ్యాయి.
భగత్సింగ్, సహచర విప్లవకారుల పోరాటాల నాటికే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినా - అది కార్మికవర్గ పార్టీగా వర్గ పోరాటాన్ని నిర్వహించవలసిందే అయినా ఆయన మార్గాన్ని వాళ్లు అనుసరించనూ లేదు. ఆయనను తమలోకి ఆహ్వానించనూ లేదు. లాహోర్, కాకోరీ కుట్ర కేసుల్లో ముద్దాయిగా ఉన్న వాళ్లలో విజయకుమార్ సిన్హా, శివకుమార్ మిశ్రా ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరినా - ఈ రెండు పంథాలు విడివిడిగానే మునుసాగాయి. ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. బిపిన్ చంద్ర ఈ కమ్యూనిస్టు సంప్రదాయానికి, అవగాహనకు చెందినవాడు. కనుక వలస పాలకులకు, గాంధీకే కాదు 1951 నాటికి కమ్యూనిస్టు పార్టీకి కూడా భగత్సింగ్ను ఆయన విప్లవ లక్ష్యంతో పంథాతో స్వీకరించి సమర్థించడానికి పరిమితులేర్పడినాయి. వలసవాద చరిత్రకు బదులుగా ʹజాతీయోద్యమ చరిత్రʹగా భారతదేశ చరిత్ర రచన అప్పగించబడిన బిపిన్ చంద్ర వంటి వాళ్లకు కూడా అందుకే భగత్సింగ్ విప్లవ టెరరిస్టుగా కనిపించాడు. ఆ తర్వాత కాలంలో ఆయనను ʹసామ్యవాద విప్లవకారుడుʹగా పేర్కొన్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీకయినా, బిపిన్ చంద్రకయినా సామ్యవాద విప్లవానికి వర్గపోరాటం అనివార్యమన్న అవగాహన పట్ల విశ్వాసం పోయింది. పార్లమెంటరీ రాజకీయాల ఊబిలో కూరుకుపోయారు. తాము 1946-51లో ఉజ్వల రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించాము - అని గత ఘన చరిత్రగా చెప్పుకోవడానికి తప్ప కమ్యూనిస్టు పార్టీ ఆ పంథా నుంచి వైదొలగింది. నెహ్రూ అనుకూల పార్టీగానే కాదు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని బపరిచే దాకా ఆ కుటుంబాల ఫెలో ట్రావలర్ గా మారింది. (సాధారణంగా నెహ్రూ, కృష్ణమీనన్ వంటి వాళ్లను ఫెలో ట్రావెలర్స్ అంటారు గానీ వాళ్లు పాలకులుగా చిరకాలం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్లను బపరచిన కమ్యూనిస్టును ఫెలో ట్రావెలర్స్ అనడమే సబబుగా ఉంటుంది.)
బిపిన్ చంద్ర మొదలైన మార్క్సిస్టు చరిత్రకారుల కృషి పట్ల పూర్తి గౌరవంతోనే వాళ్ల చరిత్ర రచనకున్న ఈ పరిమితిని కూడా అర్థం చేసుకోవాలి. భగత్సింగ్పై ప్రత్యేకించి కృషి చేసిన వారిలో బిపిన్ చంద్ర, ప్రొఫెసర్ చమన్లాల్ను మించిన వాళ్లు ఎవరూ ఉండకపోవచ్చు. ఒక కోణంలో మహమ్మదలీ జిన్నా, ఎజినూరానీు ఉండవచ్చు. కాని భగత్సింగ్ను విప్లవకారుడుగా ʹరూపొందుతున్న లెనిన్ʹగా చరిత్రలో నమోదు చేయడానికి ఆయన విప్లవ హృదయాన్ని వర్తమానంలో ఆవిష్కరించే ప్రాపంచిక దృక్పథం చరిత్రకారులకుండాలి. భగత్సింగ్పై అధ్యయనం, పరిశోధన చేసేవారికుండాలి. చరిత్ర అంటే ʹవర్తమానంలో గతం భవిష్యత్తుతో చేసే సంభాషణʹ అనే ఇ.ఎచ్.కార్ నిర్వచనానికి అర్థం అదే.
ʹప్రజ కర్ణాటక చరిత్రʹను పునర్ నిర్మించే క్రమంలో స్వయంగా విప్లవకారుడు అమరుడు సాకేత రాజన్ అటువంటి చరిత్ర రచనకు ప్రయత్నం చేశాడు. రెండు బృహత్ సంపుటాలు వెలువడి ప్రామాణిక కృషిగా గుర్తింపబడింది. సాకేత రాజన్ వంటి వేలాది విప్లవకారుటను బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్న ఆయా ప్రభుత్వాలలోని పాలకుకు, విప్లవకారులను టెరరిస్టులుగా, దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్గా పేర్కొంటున్న బిజెపికి భగత్సింగ్ మీద ఇంత ప్రేమ కలగడం చారిత్రక అవకాశవాదం కాకమరేమిటి?
భగత్సింగ్ ఇంక్విలాబ్కు ` వందేమాతరమ్, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్ బాంబ్ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ్ని ఎలా అయ్యానుʹ అనే పరిణామంగానీ, ఆయన ఎంచుకున్న విప్లవ మార్గం గానీ బిజెపికి జీర్ణమయ్యే విషయాలేనా? పుట్టుక వల్లనే హిందువు కాని భగత్సింగ్ చైతన్యం వల్ల విప్లవకారుడయ్యాడు. హిందూ జాతీయవాదాన్ని భారత జాతివాదంగా భిన్న విశ్వాసాల ప్రజలపై రుద్దుతున్న బిజెపి భగత్సింగ్ భుజం మీద తుపాకి పెట్టి బిపిన్ చంద్ర వంటి లౌకిక ప్రజాస్వామిక, ప్రగతివాద చరిత్రకారులను, నెహ్రూ అనుయాయులను, కమ్యూనిస్టులను మాత్రమే కాదు విప్లవకారులను కూడా కాల్చదలుచుకున్నది. రోహిత్ వేముల, అంబేడ్కర్ అసోసియేషన్ మొదలు కన్హయ్య కుమార్ వంటి ఎఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు, ఉమర్ ఖలీద్, అనిర్బన్ వంటి విప్లవ విద్యార్థులు దేశద్రోహులుగా, యాంటీ నేషనల్స్గా, టెరరిస్టులుగా కనిపిస్తున్న సంఘ్పరివార్కు భగత్సింగ్ను విప్లవ టెరరిస్టు అనడం అభ్యంతరకరం కావడం అవకాశవాదం తప్ప మరేమీ కాదు. ముస్లింగా పుట్టడమే టెరరిజంగా, మావోయిజం అంటే దేశద్రోహంగా చిత్రిస్తున్న హిందుత్వ శక్తులకు మావోయిస్టులకు వేగుచుక్క అయిన భగత్సింగ్ మీద ప్రేమ కలగడానికి మించిన ద్వంద్వనీతి మరేముంటుంది?
( 2016 లో వరవరరావు రాసిన వ్యాసం )
Keywords : bhagat singh, revolution, varavararao, maoists, bjp, hindutva
(2024-03-22 17:48:11)
No. of visitors : 2782
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |