చెప్పులుకుట్టుకునే వాళ్ళు పెండ్లి ఊరేగింపులు తీస్తారా - మనువాద హూంకరింపు
ʹʹఇది మా మనువు రాజ్యం... వేల ఏండ్లుగా మాదే రాజ్యం.... పార్టీ ఏదైనా పరిపాలించవచ్చుగాక అందరూ మా కనుసన్నలలో డ్యాన్స్ చేయాల్సిన వాళ్ళే... పాయఖానాలు సాఫ్ చేసే వాళ్ళు... చెప్పులు కుట్టే వాళ్ళు... ఈ దేశంలో దళితులు... మా ముందు నడవడమే గొప్ప అట్లాంటిది. పెండ్లి ఊరేగింపులు తీస్తారా... అందులోనూ లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ఊరేగింపులాʹʹ
అది రాజస్తాన్ లోని చురు జిల్లా గుండూసూర్ గ్రామం. అక్కడ దళిత గూడెం బుధవారం పొద్దటినుండి విజయ్ కుమార్ అనే దళిత యువకుడి పెండ్లి పనుల్లో హడావుడిగా ఉంది. వాళ్ళకు ఉన్నంతలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రందాకా ఆ లౌడ్ స్పీకర్లలో వస్తున్న పాటలకు పిల్లలు పెద్దలు డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. గూడానికి దూరంగా ఉన్న ఆ గ్రామపు రాజ్ పుత్ లకు వీళ్ళ లౌడ్ స్పీకర్ పాటలు కడుపు మండిస్తున్నాయి. సాయంత్రానికి ఆ మంట పెరిగింది. ఆ మనువాదుల కడుపు మంట తెలియని దళితులు సాయంత్రం పెండ్లి కొడుకు విజయ కుమార్ ను తీసుకొని స్త్రీలు , పురుషులు ఊరేగింపుగా దేవలయానికి బయలుదేరారు. వాళ్ళతోపాటు లౌడ్ స్పీకర్లను తీసుకెళ్ళారు. ఊరేగింపు వెళ్తుండగానే వీళ్ళపై దాడి జరిగింది.
ఆ ఊరేగింపులో పాల్గొన్న పెండ్లి కొడుకు విజయ్ కుమార్ చిన్నాన్న రాం నివాస్ మీడియాతో మాట్లాడుతూ
ʹʹబుధవారం సాయంత్రం 5.30 ప్రాంతంలో మేము దేవాలయానికి వెళ్తున్నాం. మేము వెళ్ళే తోవలో కొన్ని రాజ్ పుత్ ల ఇండ్లున్నాయి. వాళ్ళు ఇండ్లలోంచి బైటికొచ్చి ʹఆ డీజే మ్యూజిక్ ను ఆపండిʹ అని బూతులు తిట్టారు. లౌడ్ స్పీకర్ ఆపరేటర్ ను కొట్టి లౌడ్ స్పీకర్ ను బంజేశారు...
ʹతుమ్ భాంగీ, జూతా ఖానే వాలే కైసే భారాత్ నికల్ రహే హో డీజే కే సాత్ʹ ( మోరీలు సాప్ చేసే వాళ్ళు, చెప్పు దెబ్బలు తినెటోళ్ళు మ్యూజిక్ పెట్టుకొని పెండ్లి ఊరేగింపు తీయడానికి ఎంత ధైర్యం? ) .. అని బూతులు తిట్టారు...
పెండ్లి ఊరేగింపు వెనక్కి తిరగ్గానే రాజ్ పుత్ లు మా ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అనేక రకాలుగా వేధించారు. అడ్డుకున్న మగవాళ్ళను కట్టేలతో దుర్మార్గంగా కొట్టారు. ఆడవాళ్ళ శరీరంపై ఉన్న బంగారు నగలను దోచుకున్నారు. మా అందరి దగ్గర మొబైల్ ఫోన్లను గుంజుకున్నారు. పెండ్లికొడుకుపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ʹదుల్హేకో పకడో జ్యాదా దుల్హా బన్ రహా హై ʹ అంటూ అతని కోసం వెతికారు. అయితే అప్పటికే కొందరు యువకులు రక్షించి అక్కడి నుండి సేఫ్ గా తీసుకెళ్ళారు.ʹʹ
రాజ్ పుత్ ల దాడిలో పది మంది దళిత స్త్రీ పురుషులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి జగదీష్ సింగ్, రాజేందర్ సింగ్, గోపాల్ సింగ్, బన్నా సింగ్ అనే నలుగురు రాజ్ పుత్ లను అరెస్టు చేశారు.
హర్యాణాలో గుర్రమెక్కినందుకు మరో దాడి
హర్యానా చార్కి దాద్రి జిల్లాలోని సంజర్వాస్ .గ్రామానికి చెందిన సుమన్తో వివాహ వేడుక జరగాల్సిన క్రమంలో వరుడు సంజరు తన బంధువులతో కలిసి బారాత్తో పెండ్లికూతురి ఇంటివద్దకు చేరుకోగానే అగ్రవర్ణానికి చెందిన రాజ్పుట్ వర్గీయులు ఊరేగింపుపై దాడికి తెగబడ్డారు.గుర్రంపై ఊరేగే సంప్రదాయం దళితులు పాటించరాదని అంటూ దళితుడిని చితకబాదారు.దీంతో దళితులు,రాజ్పుట్ వర్గీయుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.రెచ్చిపోయిన అగ్రవర్ణాలకు చెందిన రాజ్పుట్లు వరుడిపై,ఆయన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి దిగారు. దాడిని అడ్డుకున్న పెండ్లి కుమార్తె బంధువులు సతేందర్,అనిల్,హర్పాల్లపైనా దురుసుగా ప్రవర్తించారు.దాడిలో గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దాడి అనంతరం రాజ్పుత్లు పరారవగా,బాధితుల ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేశారు. అగ్రవర్ణాల దాడిలో పెండ్లి కుమారుడికి స్వల్పగాయాలయ్యాయని,ఏమైనా పెండ్లి తంతు ప్రశాంతంగా ముగిసేలా బలగాలను మోహరించామని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని,ఇప్పటివరకూ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
అరెస్టైన వాళ్ళు కొద్ది రోజుల్లో బెయిల్ పై బైటికి వస్తారు.. మరి కొద్ది రోజుల్లో నిర్దోషులుగా నిరూపించబడతారు.... ఐదు వేల ఏండ్లుగా నడుస్తున్న ఈ దోపిడి మను రాజ్యం, హిందుత్వ అగ్రకుల ఉన్మాదం మాత్రం దళితులపై, ఆదివాసులపై, ముస్లింలపై, స్త్రీలపై , బలహీన వర్గాలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు చేస్తూ కొనసాగుతూనే ఉంటుంది. రోహిత్ వేములలు, మధుకర్ లు, నజీబ్ లు, అఖ్లాక్ లు, పెహ్లూ ఖాన్ లు బలవుతూనే ఉంటారు. సాయిబాబాలు, హేమ్ మిశ్రాలు విజయ్ టీర్కి , మహేష్ టీర్కిలు, రవి బల్లా, చిక్కుడు ప్రభాకర్, దుడ్డు ప్రభాకర్, దుర్గా ప్రసాద్ వంటి వాళ్ళు జైళ్ళలో మగ్గుతూనే ఉంటారు. ఎదిరించే వాళ్ళపై దేశద్రోహ ముద్రలు వేస్తూ... ఎన్ కౌంటర్ హత్యలు చేస్తూ మనువు మనపై నాట్యం చేస్తూనే ఉంటాడు.
Keywords : rajastan, hindutva, rss, dalits, police, haryana
(2024-03-14 18:38:01)
No. of visitors : 1470
Suggested Posts
| Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ womenA shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms.... |
| ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు - పరారైన శివసేన మూకపంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా... |
| గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన... |
| గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. |
| చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ.... |
| నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతిమధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి.... |
| ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా..... |
| వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు.... |
| ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు.... |
| హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేతవాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చదువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు.... |