include 'men';
?>
యాభై వసంతాల అజేయశక్తి నక్సల్బరీ - బహిరంగ సభ
నక్సల్బరీ పోరాటం మొదలై 50 ఏండ్లు అయిన సందర్భంగా విప్లవ రచయితల సంఘం శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో సభ నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా విరసం ప్రచురించిన కరపత్రం పూర్తి పాఠం...
నక్సల్బరీ పోరాటం మొదలై ఈ ఏడాది మే 25కు యాభై ఏళ్లు, నక్సల్బరీ ఒక ఊరు కాదు. ఒక ఘటన కాదు, ఆధునిక భారత దేశ చరిత్రను గుణాత్మకంగా మార్చివేసిన ఒక పోరాట పంథా, మార్క్సిజాన్ని కేవలం అధ్యయన శాస్త్రంగా కాక వర్గపోరాట ఆచరణ సిద్ధాంతంగా ఈ దేశ ప్రజలకు అందించిన ప్రజాయుద్ధ పంథా అది ఆ మార్గంలో దేశవ్యాప్తంగా మూడు తరాల ప్రజలు ఎన్నో పోరాట వెల్లువలను సృష్టించారు. అసాధారణ త్యాగాలు చేశారు. యాభై వసంతాలనే కాదు, ముసురుకొచ్చిన శిశిరాలనూ అనుభవించి తిరిగి మోడువారిన కొమ్మలపై లేలేత ఎర్ర చిగుళ్లను మొలిపించారు. పూచిన పూలెన్ని రాలిపోయినా వేల వేల వసంతాలను పూయించారు. త్యాగానికి, ధిక్కారానికి ప్రతీక కావడం నక్సల్బరీ మొట్ట మొదటి విశిష్ట లక్షణం. నక్సల్బరీ ఏకీ రాస్త అనే నినాదం ఇవాళ నక్సల్బరీయే ఏకైక ప్రజా ప్రత్యామ్నాయమని రుజువు కావడం దాని మరో అద్భుత లక్షణం.
అయితే ఈ అర్థ శతాబ్దంలో ఇంకా ఎంతో సాధించవలసి ఉండిందని, విప్లవ విజయానికి చేరువ కావాల్సి ఉండిందని ఆశించడంలో తప్పు లేదు. 20వ శతాబ్ది విప్లవాలతో పోల్చితే తప్పక ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నక్సల్బరీ పోరాటం ముందు ఉన్న మాట వాస్తవమే. కానీ గత విప్లవాలతో పోల్చితే నక్సలరీకి తనదే అయిన చారిత్రక, రాజకీయార్దిక ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. నక్సల్బరీ చైనా మహత్తరశ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ శిశువు అయినప్పటికీ సోవియట్ యూనియన్ సోషల్ సామ్రాజ్య వాదాన్ని ఆ తర్వాత చైనా రివిజనిజాన్ని అధిగమిస్తూ మొత్తంగానే సోషలిస్టు శిబిరం కూలిపోయిన తరుణంలో లేచి నిలబడి కొనసాగుతున్నపోరాటం. అంతేగాక స్వతహాగా నక్సల్బరీ పోరాటమే ఆరంభం నుంచీ తీవ్రమైన అంతర్గత నిర్మాణ, రాజకీయ సంక్షోభాలకు పదే పదే లోనవుతూ, అధిగమిస్తూ కొనసాగుతున్న పోరాటం. అలాగే ఆది నుంచీ రాజ్యహింసకు తీవ్రంగా నష్టపోతూ, కూలిపోతూ తిరిగి కూడగట్టుకుంటూ మును ముందుకు సాగుతున్న పోరాటం.
నక్సల్బరీ సాధించిన విజయాలను, అపజయాలను, దాని ముందున్న బృహత్తర లక్ష్యాలను కూడా ఈ వాస్తవ చరిత్ర నుంచి చూడాలి. ఈ యాభై ఏళ్లలో కైవసం చేసుకున్న ప్రపంచాలున్నాయి. కోల్పోయిన కోటలూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యనే యాభై ఏళ్ల కింద ఈ దేశ ప్రజలకు పరిచయమైన నక్సల్బరీ పోరాట పంథా మార్క్సిస్టు, లెనినిస్టు ఉద్యమంగా, మావోయిస్టు ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ యాభై ఏళ్లలో నక్సల్బరీ ప్రత్యక్ష పరోక్ష ప్రభావంలో సాగిన ఎన్నో ప్రజా సంచలనాలు ఉన్నాయి. మొత్తంగానే వ్యవస్థ సంక్షోభంలోంచి వాటికవిగా పెల్లుబికిన ఆందోళనలూ ఉన్నాయి. సారాంశంలో వ్యవస్థపై తీవ్ర నిరసనను, అసమ్మతిని ప్రదర్శించిన చైతన్య రూపాలవి. సమాజ ప్రజాస్వామికీకరణలో భాగమయ్యాయి. కానీ ఒక క్రమంలో అవన్నీ తమ పాత్ర ముగించుకొని వ్యవస్థలో కలిసిపోయాయి. రాజ్యంలో అంతో ఇంతో చోటు సంపాదించుకొని పాలకవర్గాలతో సహజీవనం చేస్తున్నాయి. కానీ నక్సల్బరీ మార్గంలో సాగుతున్న మావోయిస్టు ఉద్యమం మాత్రమే వ్యవస్థపై రాజీలేని పోరాటం చేస్తున్నది. మౌలికమైన ఉత్పత్తి సంబంధాల మార్పు దగ్గరి నుంచి సమాజంలోని అన్ని వ్యవస్థల సమూల మార్పు లక్ష్యంగా పోరాడుతున్నది. పోరాట శక్తి అనే మాటకు నక్సల్బరీ మాత్రమే తిరుగులేని ఉదాహరణగా నిలబడింది. అందువల్లే అది ఇవాళ దండకారణ్యంలో బీజరూప ప్రజారాజ్యాధికారాన్ని ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను, విప్లవ ప్రజాస్వామిక జీవన సంస్కృతిని పాదుకొల్పింది.
మానవ జాతి చరిత్రకు సోషలిజమే ప్రత్యామ్నాయమని చాటి చెప్పే చారిత్రక విశ్లేషణకు ప్రపంచంలోనే ఇవాళ నక్సల్బరీ పంథా ఒక ఆచరణాత్మక విశ్వాసాన్ని అందిస్తున్నది. చరిత్రలో ప్రజలు సాధించిన పారిస్ కమ్యూన్, బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం, శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవాల వారసత్వంలో నక్సల్బరీ పంథాను ఎత్తిపట్టవలసి ఉన్నది. సోషలిజమే ప్రత్యామ్నాయమనే నినాదంతో విప్లవ రచయితల సంఘం యాభై వసంతాల నక్సల్బరీకి జేజేలు పలుకుతూ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడులో నక్సల్బరీ వార్షికోత్సవ సభ నిర్వహిస్తోంది. కా, లెనిన్ జయంతి, సీపీఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినాన యాభై వసంతాల నక్సల్బరీ కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. అందునా నక్సల్బరీ పంథాను కొనసాగించిన శ్రీకాకుళ పోరాట నాయకులు తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి వంటి అమరులు ఎందరో పుట్టిన బొడ్డపాడులో ఈ సభ జరపడానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1967 అక్టోబర్ 31న కా, కోరన్న మంగన్నల అమరత్వంతో శ్రీకాకుళ ప్రజలు నక్సల్బరీ పంథాను స్వీకరించారు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం దెబ్బతిన్నాక తిరిగి 1980లలో పునర్నిర్మాణ ప్రయత్నాలు మొదలై ఇవాళ ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతమంతా విప్లవోద్యమం ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగుతున్నది. దండకారణ్యంలో వలె బీజరూప ప్రజా రాజ్యాధికారం, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా స్థాపించడానికి ప్రయత్నిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడటానికి, అన్ని రూపాల్లో దోపిడీ హింసలను నిర్మూలించడానికి పోరాడుతున్నది.
ఈ దేశ ప్రజల ముందు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం నక్సల్బరీ. అది భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, దళారీ పెట్టబడికి, తరతరాల కుల పీడనకు, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నది. వేలాది మంది ప్రజల రక్తతర్పణ, జెయిలు నిర్బంధాలు, దారుణమైన హింసల మధ్య సాగుతున్న నక్సల్బరీ పంథాను ఎలుగెత్తి చాటడానికి విరసం ఈ సభ నిర్వహిస్తోంది. అందరూ రావాలని ఆహ్వానిస్తోంది.
సభ
ఏప్రెల్ 22, 2017, ఉదయం 10 గంటల నుండి...
బొడ్డపాడు, పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా
అధ్యక్షత : వరలక్ష్మి
వక్తలు ; కాశిం , వరవరరావు, పాణి
- విప్లవ రచయితల సంఘం
Keywords : naksalbari, maoists, srikakulam, bengal, charumujumdar
(2024-03-19 06:28:32)
No. of visitors : 1853
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..