ముమ్మరమ‌వుతున్న‌ సైనిక దాడులు ‍- ఎధిరిస్తూ..కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ..సాగుతున్న‌ మావోయిస్టు పార్టీ

ముమ్మరమ‌వుతున్న‌

మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా గ్రీన్ హంట్ ఆపరేషన్ చేపట్టి ఆదివాసీ ప్రాంతాల మీద తీవ్రమైన దాడులు చేస్తున్న‌కేంధ్రప్రభుత్వం ఛత్తీస్‌ఘడ్‌ సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో 25 మంది సీఆర్‌పీఏఫ్‌ జవానుల మృతి తరువాత హోంశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించి మావోయిస్టులపై మరింత పెద్ద ఎత్తున దాడికి ప్రణాలికలు సిద్దం సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్, ఏవోబీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న వేలాది పోలీసు బలగాలకు తోడు కోబ్రా దళాలను రంగంలోకి దించిన కేంధ్రప్రభుత్వం హెలీ కాప్టర్ల ద్వారా ఏరియల్ సర్వేలు ప్రారంబించింది. రెండు రోజులుగా ఏవోబీలోని పాత్రోపుట్టు, జొంతిరి, డకొడ్‌పొదర్ల, కోసంపుట్టు, జోడిగుమ్మ, పట్నాపడాల్‌పుట్టు తదితర ప్రాంతాల్లో పోలీసులు హెలికాఫ్టర్ సర్వే నిర్వహిస్తున్నారు. లక్ష్యాల‌ను ఎంపిక చేసుకొని హెలికాప్టర్ల ద్వారా కోబ్రా దళాలను చేరేవేసే ప్లాన్లు వేస్తున్నారు పోలీసులు. మరోవైపు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు అదనంగా మరో మూడు వేల సెల్‌టవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు వేలాది పోలీసు బలగాలు చత్తీస్గడ్, ఏవోబీ ప్రాంతాల్లో చేస్తున్న దాడిని తిప్పికొడుతూ, ఆత్మరక్షణ చేసుకుంటూనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంధ్ర ప్రభుత్వం ఇప్పుడు చేయబోతున్న దాడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్దమౌతో‍ంది. ఉన్న ప్రాంతాల్లో తమ పట్టును కొనసాగిస్తూనే కొత్త ప్రాంతాలకు విస్తరి‍చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
కేరళ, తమిళనాడు, కర్నాటక లలో వేనాడ్, ముత్తుమల, బండిపూర్, కొజిక్కోడ్, మల్లపురం, గుడలూర్, పాలక్కడ్, కోయంబత్తూరు లలోని నూతన ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ వారాహిని, కబానీ, నడుకానీ , భవానీ దళాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నూతన ప్రాంతాలకు దాదాపు 100 మంది కార్యకర్తలను పంపినట్టు సమాచారం. మరో వైపు వెస్ట్ బెంగాల్ ‍జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాలు, ఒడిశా, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాలు, చత్తీస్ గర్, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాల్లోని నూతన ప్రాంతాలకు ఉద్యమ నిర్మాణం కొరకు మావోయిస్టు పార్టీ తమ క్యాడర్ ను పంపినట్టు సమాచారం.

మరోవైపు కేంధ్ర దాడిని ముందుగానే ఊహించిన మావోయిస్టు పార్టీ ఆ దాడిని ఎదుర్కునేందుకు నెల రోజులుగా చత్తీస్ గడ్ లో తమ క్యాడర్ కు సైనిక శిక్షణ ఇస్తోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఆ పత్రిక కథనం ప్రకారం ఏవోబీ, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి మావోయిస్టు దళ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రామ్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో అగ్రనాయకుల మృతితో ఏవోబీలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కోరుకొండ, గాలికొండ ఏరియా కమిటీలలో నాయకులున్నా దళ సభ్యులు లేకపోవడంతో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో దళాల్లో కొత్తగా చేరిన ఆదివాసీ యువకులతోపాటు.. ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఛత్తీ్‌సగఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నాయకత్వం కమాండో శిక్షణ ఇస్తోంది. సభ్యులకు శిక్షణనిచ్చి ఏవోబీతోపాటు ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఉద్యమాన్ని ఉదృతం చేయాలని మావోయిస్టు నేతలు భావిస్తున్నారు.

పోలీస్‌ బలగాలపై మావోయిస్టులు ఎక్కువగా ల్యాండ్‌మైన్స్‌, క్లైమోర్‌మైన్స్‌, కుక్కర్‌మైన్స్‌, ప్రెషర్‌మైన్స్‌ వాడుతుండేవి. ఇప్పుడు గెరిల్లా ఆర్మీ.. బాణం బాంబులను తయారుచేసింది. రాకెట్‌ లాంచర్‌ తరహాలో బాణాలకు ప్రెజర్‌ బాంబులు అమర్చి కూంబింగ్‌ చేస్తున్న పోలీసులపైకి ప్రయోగిస్తోంది. మార్చి 11న ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా కొత్తచెరువులో కూంబింగ్‌ చేస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై వీటినే ప్రయోగించింది. ఈ ఘటనలో 12 మంది జవాన్లు మృతిచెందారు. ఇటీవల బూర్కాపాల్‌లో ఇదే తరహాలో దాడిలో 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాణం బాంబులు ప్రయోగం విజయవంతం కావడంతో వీటిని ప్రయోగించడంలో కూడా ఆ శిక్షణా శిబిరంలో దళ సభ్యులకు శిక్షణ ఇస్తున్నారని తెలిసింది.

Keywords : chattisgarh, kerala, maharashtra, madhyapradesh, tamilnadu, karnataka, maoists, police
(2024-04-03 20:54:58)



No. of visitors : 2290

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముమ్మరమ‌వుతున్న‌