ధర్నా చౌక్ లో డ్రామాలు.. భజన మీడియా బాజాలు

ధర్నా

మానాయకుడు కేసీఆర్ చాలా తెలివైనవాడు...ఆయన మాట్లాడితే ఎంతటివారైనా కన్విన్స్ కావాల్సిందే... అతని ఎత్తుగడల ముందు ఎంతటివారైనా చిత్తుకావాల్సిందే... ఇవి ఆయన‌ అనుచరుల నమ్మకం. అందులో కొంత నిజము‍ందని చాలా మంది ఒప్పుకుంటారు. అయితే ఆకలి మంటల ముందు, హక్కుల పోరాటాల‌ ముందు గారడీ విద్యలు పని చేయవన్నది కూడా నిజం. ప్రత్యేక తెలంగాణ పోరాటం కూడా దాన్నే రుజువు చేసింది.

ఇవ్వాళ్ళ పొద్దుటినుండి అనేక కుట్రలు పన్ని, రక్తి కట్టించే డ్రామాలు ఆడి, చివరకు ధర్నా చౌక్ ని రణరంగం చేసి, నెత్తుర్లు పారించి కూడా విజయం సాధించలేక చతికిలపడ్డ తర్వాత వారి భక్త జనం సోషల్ మీడియాలో ఓ కొత్త పల్లవిని అందుకున్నారు. ʹఅసలు ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుండి తీసేస్తామని మా నాయకుడు ఎప్పుడన్నారూ...ʹ అని సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు.
ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకువెళ్ళిన సంఘటనపై తెలంగాణ సమాజమంతా భగ్గుమనగానే ప్లేటు పిరాయిస్తారు. వాళ్ళ దేవుడు అధికారులమీద మండిపడ్డాడని, భగ్గుమన్నాడని, సీరియస్ అయ్యాడని, ఆవేశం పట్ట లేక బిజ్జలదేవుడు గోడలు బద్దలు కొట్టాడని... ఇలాంటి ఏవేవో కథనాలు వండి వార్చడానికి భజన మీడియా సిద్దంగా ఉంటుంది. అప్పటిదాకా.. ఈ దుర్మార్గాన్ని సమర్ధించలేక, అట్లని తమ దేవుడిని ఏమీ అనలేక , ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎడ్డి మొఖం ఏస్కొని కూచున్న అమాయక భక్తులు భజన మీడియా కథనాలతో తేరుకొని ఆ వార్తలకు మరికొంత మసాలా జోడించి ఇక సోషల్ మీడియాపై పడతారు.

ఇక ఇవ్వాళ్ళ ధర్నా చౌక్ దగ్గర జరిగిన సంఘటన‌లపై ప్రధాన మీడియా ( ఒక HMTV, 10TV మినహాయింపు ) ఒక వైపు సోషల్ మీడియా ఒక వైపుగా చీలి పోయింది. అబద్దాలు ప్రచారం చేయడంలో టీవీ ఛానల్లు పడ్డ పోటీ చూస్తే జర్నలిస్టునైనందుకు సిగ్గనిపించింది. ప్రత్యేక తెలంగాణ పోరాట కాలంలో జరిగినట్టుగానే మక్కీకి మక్కీ సఁఘటనలు జరిగాయి.

సకల జనుల సమ్మె సందర్భంగా స్కూల్స్ మూసివేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వాళ్ళైన విద్యార్థుల తల్లితండ్రులు కూడా స్కూల్స్ మూసివేయాలని కోరుకున్నరు. తెలంగాణ యాజమాన్యాల్లో పని చేసే స్కూల్స్ కూడా బంద్ జేసిన్రు. అప్పుడే ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమం ఒకటి ప్రారంభమైంది. విద్యార్థుల తల్లి తండ్రుల పేరుతో ఓ అరాచక గుంపును ఆర్గనైజ్ చేసిన ప్రభుత్వం సకలజనుల సమ్మెకు పోటీగా నిలబెట్టింది. బలవంతంగా స్కూల్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమ కారుల మీద దాడులు చేశారు. అలా పోటీ ఉద్యమ‍ంలో ఉన్న వాళ్ళంతా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వాళ్ళే. అలా గుమిగూడిన ఓ పది మందిని హైలెట్ చేస్తూ మీడియా మొత్తం ప్రచారం హోరెత్తించింది. విద్యార్థులు, వారి తల్లితండ్రులు సకలజనుల సమ్మెను వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారులు దౌర్జన్యం చేస్తున్నారని రోజులతరబడి మీడియా ప్రచారం చేసింది. అప్పుడు కూడా సోషల్ మీడియానే తెలంగాణ ప్రజలవైపు, సకలజనుల సమ్మెకు మద్దతుగా నిలబడింది.

ఇవ్వాళ్ళ అదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు కాంగ్రెస్, టీడీపీ చేసిన పని ఇవ్వాళ్ళ టీఆరెస్ చేసింది. పోలీసులతో చేయి‍ంచింది. సివిల్ డ్రస్ లో ఓ మహిళా సీఐ నాయకత్వంలో పది మంది మహిళా కానిస్టేబుళ్ళు, ఎల్బీనగర్ సహా ఎక్కడెక్కడినుంచో వచ్చిన టీఆరెస్ కార్యకర్తలు స్థానికుల పేరుతో ధర్నా చౌక్ ను ఇందిరా పార్క్ నుండి తీసివేయాలని ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేశారని HMTV, 10TV బయట పెట్టాయి. ధర్నా చౌక్ పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమంపై దాడి చేయడం కోసం తెల్లవారుజామునుంచే కుట్ర మొదలు పెట్టారు. ఇవ్వాళ్ళ ముందు ధర్నా మొదలుపెట్టింది డ్రామారాయుళ్ళే. ఆ తర్వాత వచ్చిన వచ్చిన వామపక్షాల, జేఏసీ, ప్రజాఫ్రంట్, వివిధ విద్యార్థి సంఘాల కార్యకర్తలపై దాడికి దిగారు. ఘర్షణ వాతావరణం సృష్టించి పోలీసు లాఠీ చార్జ్ చేయాలన్న వాళ్ళ ప్లాన్ లో సక్సెస్ అయ్యారు. నిరసనకారుల నెత్తురు కండ్ల చూడాలన్న వాళ్ళ కోరిక నెరవేరింది. కానీ ధర్నా చౌక్ ను రక్షించాలన్న ప్రజాస్వామిక ఉద్యమాన్ని ఫెయిల్ చేయలేకపోయారు. అందుకే కాబోలు ʹఇందిరా పార్క్ నుండి ధర్నా చౌక్ ను తీసివేస్తానని కేసీఆర్ ఎప్పుడు చెప్పాడుʹ అని ప్రచారం మొదలు పెట్టారు.

Keywords : dharnachowk, kodandaram, kcr, police lathicharge,
(2024-03-23 20:46:59)



No. of visitors : 1270

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ధర్నా