పెరేడ్ గ్రౌండ్స్ రక్షించాలని స్థానికుల ఉద్యమం..వీళ్ళకు పోటీగా ప్రభుత్వం ఎవరిని దించుతుందో ?

పెరేడ్

వీళ్ళు నిజంగానే స్థానికులు... వీళ్ళు ఏ ʹముఠాʹ ల అనుచరులూ కాదు...ఎక్కడెక్కడినుండో దిగిమతి చేయబడ్డ భక్తజన‌మూ కాదు.... మారు వేశాల్లో ప్లకార్డులు పట్టుకున్న పోలీసులు కూడా కాదు. వీళ్ళు స్వచ్చంగా స్థానికులే. పొద్దున్నే వాకింగ్ కు వచ్చే వాళ్ళు... స్పోర్ట్స్ పర్సన్స్... హైదరాబాద్ పొల్యూషన్ భరించలేక పొద్దున్నే ఇక్కడికొచ్చి కొద్దిగానైనా మంచి గాలి పీల్చేవాళ్ళు....

తెలంగాణ సచివాలయాన్ని పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై స్థానికుల్లో నిరసన వ్యక్తం అవుతోంది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న 12 ఎకరాల స్థలంలో ప్రతీ నిత్యం దాదాపు రెండు వేల మందికి పైగా వాకర్స్, క్రీడాకారులు, స్థానికులు ఈ పరేడ్ గ్రౌండ్ స్థలాన్ని వినియోగించుకుంటారు. అంతే కాకుండా సికింద్రబాద్‌లో ఉన్న ఈ ఏకైక మైదానమే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే రోజు జండా ఆవిష్కరణకు ఉపయోగిస్తారు. అలాంటి స్థలంలో సచివాలయం నిర్మిస్తే.. వీఐపీల రాకపోకలు పెరగడమే కాకుండా, ఈ మార్గమంతా ఇరుకుగా తయారవుతుందని స్థానికులు వాదిస్తున్నారు. ఇటీవల ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్ స్థానికులకు ఇబ్బందిగా ఉందని.. ప్రభుత్వం అక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నించడంతో టీజేఏసీ, ప్రజాసంఘాలు పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ వంటి స్థలాన్ని పూర్తిగా స్వాదీనం చేసుకొని సచివాలయం నిర్మించడం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు.

పరేడ్ గ్రౌండ్స్‌ను వాడుకునే స్థానికులు, జాగర్స్, క్రీడాకారులు, కంటోన్మెంట్ ప్రాంత వాసులు ఇక్కడి స్థలంలో అత్యధిక భాగం తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి ఆర్మీ ఒప్పుకోవడాన్ని నిరసిస్తున్నారు. దీంతో పోరాటం మరింత తీవ్రతరం చేయాలని స్థానికులు భావిస్తున్నారు.
ʹసేవ్ పరేడ్ గ్రౌండ్స్ʹ పేరుతో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. శనివారంనాడు మానవహారం నిర్మించి నిరసన తెలిపారు.

ఇందిరా పార్క్ దగ్గర ధర్నాల వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ప్రభుత్వానికి పెరేడ్ గ్రౌండ్స్ స్థానికులు గుర్తురాలేదా ?
ʹటీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రజావినియోగ స్థలాలపై కన్నేసింది..? అసలు ఆర్మీని అడగటానికి ముందే ప్రభుత్వం స్థానికుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదుʹ అని వందన సిన్హా అనే స్థానికురాలు విమర్శించారు. ఇక్కడ రెగ్యులర్ వాకింగ్‌కు వచ్చే శెట్టి అనే వ్యక్తి మాట్లాడుతూ.. ఇప్పటికే నగరంలో ప్రభుత్వ స్థలాలు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. సిటీ మొత్తంలో మిగిలిన ఏకైక ఓపెన్ ప్లేస్ పరేడ్ గ్రౌండ్ మాత్రమే. ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వం తీసేసుకుంటే.. నగరంలో ఖాళీ స్థలాలే లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విభాగాలకు సరిపోయిన సెక్రెటేరియట్.. ఇప్పుడు కేవలం తెలంగాణకు ఎందుకు సరిపోట్లేదు..? ప్రభుత్వం అక్కడ ఏపీ ఖాళీ చేసిన భవనాలను వాడుకోవచ్చు కదా.. అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని.. పరేడ్ గ్రౌండ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయం నిర్మించుకోవడానికి అనుమతించబోమని స్థానికులు చెబుతున్నారు.
ఇక పెరేడ్ గ్రౌండ్స్ లోకి సచివాలయం మార్చాలని లేదంటే బంగారు తెలంగాణ సాధించడం కష్టమని, ఈ మార్పును అడ్డుకునే వాళ్ళు తెలంగాణ ద్రోహులని నినదిస్తూ, ప్లకార్డులు చూపిస్తూ ప్రాయోజిత ఉద్యమం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి

Keywords : save Parade Ground, Hyderabad, KCR government, Secunderabad, health enthusiasts, sportspersons, secretariat
(2024-03-18 20:01:33)



No. of visitors : 1649

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పెరేడ్