include 'men';
?>
పాలకుల క్రూరత్వం: గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులపై కాల్పులు,ఐదుగురు మృతి !
తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని, రుణాలు మాఫీ చేయాలని రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే పోలీసులు కాల్పులు జరపలేదని నిరసనకారులే కాల్పులు జరిపారని అందువల్లే రైతులు మరణించారనే బరితెగింపు వాదనకు దిగారు పోలీసు అధికారులు. పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని హోం మంత్రి కూడా పోలీసుల వాదనలకు వంత పాడారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లేక , చేసిన రుణాలు కట్టుకోలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ʹరాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ʹ అనే సంస్థ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు మాందసోర్లో గత ఆరు రోజులుగా రైతులు ఆందోళన దీక్షలు చేపట్టారు. మంగళవారంనాడు వేలాది రైతులు, మహిళలు రోడ్లమీదకు వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ʹʹఈ ప్రదర్శన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వ కూడదని కంకణం కట్టుకున్న ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ నిరసన ప్రదర్శనపై ముందుగా లాఠీ చార్జ్ నిర్వహించిన పోలీసులు హఠాత్తుగా కాల్పులకు తెగించారుʹ అని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు శివకుమార్ శర్మ ఆరోపించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు రైతులు అక్కడికక్కడే మరణించారు వందలాది మంది రైతులు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు ముందుగా రైతుల ఆందోళనలకు మద్దతునిచ్చిన ఆరెస్సెస్ అనుబంద ʹభారతీయ కిసాన్ సంఘ్ʹ ప్రభుత్వం ఆదేశాలకు అణుగుణంగా రైతులలో చీలిక తేవడానికి ప్రయత్నించిందని, మధ్యలోనే ఆందోళనలు విరమించినట్టు ప్రకటించి తమకు ద్రోహం చేసిందని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. దాంతో ఇప్పటి వరకు బీకేఎస్ తో ఉన్న రైతులు కూడా రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకత్వంలో ఆందోళనలు కొనసాగించారు. దీంతో రైతుల ఆందోళనలను అణిచివేయడానికి ప్రభుత్వానికి ఆరెస్సెస్ కూడా అండగా నిలిచి ఈ కాల్పులకు ప్రోత్సహించిందని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ ఆరోపించింది
ఇదిలా ఉండగా రైతులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. పోలీసుల దుర్మార్గానికి నిరసనగా రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది.
మరో వైపు సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలు ప్రచారంలోకి రాకుండా ప్రభుత్వం మాందసోర్, రత్లాం, ఉజ్జెయిన్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే హోంమంత్రి మాత్రం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయలేదని చెప్పారు.
Keywords : farmers, madhya pradesh, dead, remunerative prices, loan waiver, police, firing
(2024-03-26 15:57:06)
No. of visitors : 1982
Suggested Posts
| బంద్ సక్సెస్... కలెక్టర్ ను తరిమికొట్టిన రైతులు... పోలీసు వాహనాలు దగ్దంమధ్యప్రదేశ్ లో పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతుల మృతిని నిరసిస్తూ ఇవ్వాళ్ళ చేపట్టిన మాందా సౌర్ జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్ జరగకుండా వేలాది పోలీసు బలగాలు మోహరించినప్పటికీ ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. |
| ఎంపీలో రైతులపై కొనసాగుతున్నఅణిచివేత... మేధాపాట్కర్, అగ్నివేశ్, యోగేంద్ర యాదవ్ అరెస్టుమధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులపై యుద్దంప్రకటించింది. తమ సమస్యల పరిష్కారంకోసం ఉద్యమించిన రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతులను బలితీసుకున్న ప్రభుత్వం కసి ఇంకా తీరలేదు. మాందసౌర్ ప్రాంతంలో రైతులపై... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..