బ్లాక్ మెయిల్ రాజకీయాలు : రైతులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ధీక్ష‌

బ్లాక్

మధ్యప్రదేశ్ లో రైతుల న్యాయమైన డిమాండ్ లను పట్టించుకోకుండా... ఆందోళనలు చేస్తున్న రైతులను పట్టించుకోకుండా... ఆరెస్సెస్ అనుబంద సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా రైతుల్లో చీలికకు ప్రయత్నించి... రైతులను మభ్యపెట్టడం సాధ్యం కాకపోవడంతో వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టన పెట్టుకొని... అయినా రైతుల ఆందోళనలు ఆగకపోవడంతో ఇప్పుడు బ్లాక్మెయిల్ కు సిద్దపడ్డారు.

రైతులకు వ్యతిరేకంగా ఏకంగా ముఖ్యమంత్రే నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు.మంద్‌సౌర్‌ లో రైతుల ఆందోళనలు ఆగకపోవడంతో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు ( రైతులు లొంగిపోయే వరకు) తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. భోపాల్‌లోని దసరా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. తమ డిమాండ్ల గురించి తనతో చర్చించాలని ప్రజలను ఆహ్వానించారు. ʹప్రతి ఒక్కరు వచ్చి వారి సమస్యల గురించి నాతో చర్చించాలని కోరుతున్నాను. నేను నిరాహారదీక్ష చేపడతాను. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానʹని చౌహాన్‌ చెప్పారు.

మంద్‌సౌర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా సీఎం చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు.
అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తమను బ్లాక్ మెయిల్ చేయడమేనని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ నేతలు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోగా తమకు వ్యతిరేకంగా ధీక్షలు చేయడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రతీఘాతక ఉద్యమాలు చేయడం పాలకులకు కొత్తేమీ కాదు. వాటిని ఓడించడం ప్రజలకూ కొత్తకాదు. రీసెంట్ ఉదహరణ ధర్నా చౌక్ గుర్తుంది కదా !

Keywords : madhya pradesh, Shivraj Singh Chouhan Fast, farmers, Mandsaur
(2024-03-22 06:43:13)



No. of visitors : 795

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


బ్లాక్