రండి "వసంత కుమారి"తో మాట కలుపుదాం....!!

రండి


"పుట్టింది ఒక చోట...తిరిగింది మరో చోట...విప్లవ ప్రభుత్వాన్ని నిర్మించిందీ ఇంకో చోట" అని ʹచే గువేరాʹగురించి తరచూ అనుకునే మాటలు ఇవి. ఈ మాటలు సరిగ్గ సరిపోతాయి ఢిల్లీ ప్రొఫెసర్ డా.జి.ఎన్. సాయిబాబాకు...! "చే గువేరా" ఎలాగైతే పుట్టిన మూడవ ఏటనే ఆస్తమా వ్యాధి మూలంగా నిత్యం మృత్యువుతో పోరాటం చేశాడో ఇతను కూడా నాలుగు సంవత్సరాల వయసులో సోకిన పోలియోను లెక్కచేయకుండానే "సమాజ మార్పు కోసం" నిత్యం పాటుపడుతున్నాడు.

పుట్టిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అయినా తిరగని ప్రాంతం అంటూ లేదు .ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వైకల్యాన్ని సహితం లెక్కచేయకుండా అక్కడికి వెళ్లీ ఆ అన్యాయాన్ని నిలదీశాడు. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావొచ్చు..దళిత, ఆదివాసుల హక్కుల పోరాటం కావొచ్చు. మహిళా ఉద్యమం కావొచ్చు. . ʹఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ʹకు వ్యతిరేకంగా కావొచ్చూ ,సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటంలో కావొచ్చూ అన్నీంటా అయన ముందున్నాడు. ఒక వైపు యూనివర్శిటీ అధ్యాపకునిగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ఎక్కడా ఆయన తన లక్ష్యాన్ని మరవలేదు...!

ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌లలో ఉన్న ఖనిజసంపదపై కన్నేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని అడ్డువచ్చిన అక్కడి ఆదివాసీలను మావోయిస్టులనే పేరుతో చంపేస్తుంటే ఆ దారుణాలను సాయిబాబా ప్రపంచం ముందుకు తెచ్చారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అందుకే రాజ్యం ఆయనపై కక్ష గట్టి. అక్రమ కేసులు బనాయించీ అరెస్టు చేసి "అండసెల్ లో బందీగా" ఉంచింది...!

"నిషేధిత సంస్థల సభ్యులతో సంబంధాలు ఉన్నాయన్నంత మాత్రాన ఎవ్వరూ నేరస్తులు కారని" సర్వోన్నత న్యాయస్థానం తీర్పుఇచ్చినా కూడా పాలక ప్రభుత్వాలు మాత్రం డా. జి.ఎన్. సాయిబాబకూ "మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న" ఆరోపణలపై ఆయన్ని 2014లో అరెస్టు చేశారు. అకస్మాత్తుగా ఇంటిమీద పడిన పోలీసులు ఇంటినంతా శోధించి, లాప్ టాప్, విలువైన పరిశోధన పత్రాలనూ తీసుకెళ్ళారు. రోజు రోజుకు జైల్లో ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళణ రావడంతో బెయిల్‌ మీద కొన్ని నెలలు విడుదల చేశారు. బెయిల్‌ పీరియడ్‌ ముగిసిన తరువాత లొంగిపోయిన ఆయనకు ఊహించని రీతిలో గడ్చిరోలీ సెషన్స్‌కోర్టు "జీవిత ఖైదు" శిక్ష విధించి నాగపూర్‌లోని అండాసెల్‌లో ఉంచారు. భారత దేశ చరిత్రలో ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై ఇప్పటివరకూ పెట్టని విధంగా ఏ తప్పు చేయకపోయినా ʹఅన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ (యుఎపిఎ)ʹ కింద అన్ని సెక్షన్లను చేర్చి మరీ ఆయన మీద కేసు నమోదుచేశారు.

జీవితఖైదు వేసిన చాల కాలం వరకు కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని చూడడానికి పోలీసులు అనుమతించలేదు. రక్తపోటుకు, గుండెలోని ఇన్ఫెక్షన్‌కు, చేతులు, వెన్నెముక సమస్యలకు ఆయన మందులు వాడుతున్నారు. ఆ మందులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. కానీ జైలులో ఉన్నప్పుడు ఆయనకు మందులు అనుమతించకపోవడంతో ఎడమచేతి నరాలు, కండరాలు బాగా దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు చేతుల మీదే ఆధారపడిన ఆయనకు ఇప్పుడు ఎడమచేయి కూడా పూర్తిగా దెబ్బతిన్నడంతో ఆయన శారీరక పరిస్థితి మరింత దిగజారింది. దీంతోపాటూ ఆర్థికంగా కూడా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశారు. డా. సాయిబాబా గారు సస్పెండ్‌ అయినప్పటి నుంచి సగం జీతమే ఇస్తున్నారు. సెంట్రల్‌ గవర్నమెంట్‌ సర్వీసు రూల్స్‌ ప్రకారం సస్పెండయినపుడు ఉద్యోగికి మొత్తం జీతంలో 75% వేతనం చట్టబద్ధంగా ఇవ్వాలి. కానీ అదీ ఇవ్వడం లేదు. దీనికి తోడు యూనివర్సిటీ క్వార్టర్స్‌ను బలవంతంగా ఖాళీ చేయించారు.

సాయిబాబా బాల్య స్నేహితురాలిగా...ప్రేమకు శారీర‌క లోపం అడ్డంకి కాదని "మహోన్నత ఆశయం"కోసం అతడితో జీవితాన్ని పెనవేసుకున్న "వసంత కుమారి" ఇవాళ "సహచరుడి" విడుదల‌ కోసం జీవన్మరణ పోరాటం కొనసాగిస్తుంది. నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబా ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారడంతో ఆయనను కాపాడండీ అంటూ "జాతీయ మానవ హక్కుల కమిటీకీ", "జాతీయ వైకల్య హక్కుల వేదిక" కూ కూడా మొరపట్టుకుంది. ఆయనకు మెరుగైన వైధ్యం కోసం హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించడానికి వీలుగా "చర్లపల్లి హై సెక్యూరిటీ జైలు"కు తరలించేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని అందరికీ విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రాంతంలో పుట్టకపోయినప్పటికీ...ఎన్నో ఏళ్లుగా మనలో ఒకడిగా కలిసిపోయి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి...ఇక్కడి ఉద్యమాల్లో ఒకడిగా కలిసిపోయిన సాయిబాబాని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ...తన సహచరుడి విడుదల కొసం పోరాడుతున్న "వసంత కుమారి" మనతో చర్చించడానికీ, సంభాషించడానికీ, అతడి ఆలోచనలను పంచుకోవడానికీ మన దగ్గరకు వస్తుంది. రండి ఆమెతో మాట కలుపుదాం...డా. సాయి బాబ ను కాపాడుకుందాం.. !!

( ʹDavid Ouʹ ఫేస్ బుక్ టైమ్ లైన్ నుండి .... )

Keywords : GN Saibaba, Vasantakumari, delhi university, maoists, police, arrest, jail
(2024-03-20 18:40:05)



No. of visitors : 1263

Suggested Posts


ఉద్య‌మాల ఉస్మానియా - అమ‌రుల త్యాగాల మార్గం - వ‌ర‌వ‌ర‌రావు

కామ్రేడ్స్‌ అసోసియేషన్‌తో ప్రారంభమై ప్రత్యామ్నాయ రాజకీయాల నూతన ప్రజాస్వామిక స్వప్నం ఆచరణగా రుజువవుతున్న వర్తమానంలో ఎందరో జ్ఞాత, అజ్ఞాత ఉస్మానియా విద్యార్థుల పోరాట భూమిక ఉన్నది. అసంఖ్యాక విద్యార్థులు నిర్వహించిన ఆ పోరాటాలలో నాకు తెలిసిన, నాకు తెలియని ఇంకెందరో విద్యార్థుల ప్రాణత్యాగాల ఫలితాలు ఉన్నాయి.

ఓయూ లేకుంటే నా జీవితం లేదు : అల్లం నారాయ‌ణ‌

నేనెప్పుడూ చెప్తుంటా.. నా జీవితంలో రెండు కోణాలున్నాయని. ఒకటి ఉద్యమం. ఇంకోటి సంతోష్‌. అతని నైజం నాకు నచ్చేది. యూనివర్సిటీ మొత్తాన్ని ఆయన ప్రభావితం చేసేవాడు. ఆయన గురించి ప్రతిరోజూ వర్సిటీ చర్చించేది. మాట్లాడుకునేది. ఒక వ్యక్తి ఒక యూనివర్సిటీని అంతలా ప్రభావితం చేసిండంటే.. అది చిన్న విషయం కాదు. కరెంట్‌ ఇష్యూస్‌ మీద ఆయన స్పందించే తీరు ప్రత్యేకం. అదే ..

ఓయూలో విద్యార్థి చ‌ల‌నాలు - సి. కాశీం

ఓయూ కేంద్రంగా 2009 నవంబర్‌ 29న ఏర్పడిన విద్యార్థి జాక్‌కు ఆర్ట్స్‌కాలేజీ జీవం పోసింది. ఆర్ట్స్‌ కాలేజీ ముందు వెలసిన టెంట్‌ తెలంగాణ ఉద్యమాన్ని శాసించింది. తెలంగాణ ప్రజలందరు ఓయు వైపు చూసారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 2010 జనవరిలో 5 లక్షల మంది విద్యార్థులతో ఆర్ట్స్‌ కాలేజీ ముందు స్టూడెంట్‌ జాక్‌ సభ నిర్వహించింది....

ఉస్మానియా నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ

ఆర్ట్స్‌ కాలేజీకి ముగ్గువోసినపుడు నాకు పదేండ్లుంటయ్‌. మా అయ్యతోటి గల్సి కంకర గొట్టిన. రాళ్లు మోసిన. ఆర్ట్స్‌ కాలేజీకెదురుంగ కోంటోని బిల్లింగుండె(బీ హాస్టల్‌ భవనం). ఇప్పుడున్న ఠాగూర్‌ ఆడిటోరియం అడుగున అప్పట్ల సిల్మా ఆలుండె. దాని కట్టనీకి ఇటికెల్ని మూసిల్నించి తెచ్చేది....

భావోద్వేగాల కూడ‌లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ - నందిని సిధారెడ్డి

ఆ తర్వాత కొద్ది రోజులకే రమీజాబీ సంఘటన జరిగింది. అడిక్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు రమీజాబీ, ఆమె భర్త న్యాయం కోసం వచ్చిండ్రు. భర్త ముందే పోలీస్‌స్టేషన్‌లో రమీజాబీపై అత్యాచారం జరిగింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆ సంఘటన మీద పెద్ద నిరసన. విద్యార్థులు, విప్లవ కారులు రోడ్డు మీదికొచ్చిండ్రు. అటు పోలీసులు, ఇటు విద్యార్థులు విద్యానగర్‌లో ఒక యుద్ధంలాగా జరిగింది.

యూనివర్సిటీలో పోలీసు జోక్యంపై పోరాడి విజయం సాధించిన ఉస్మానియా విద్యార్థులకు శెల్యూట్స్ !

దాదాపు 20 గంటలకు పైగా తిండి , నిద్ర మానేసి విద్యార్థులు వీసీ కార్యాలయంలోనే బైటాయించి పోలీసులకు, వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిట్టచివరకు దిగి వచ్చిన వీసీ విద్యార్థుల డిమాడ్లను అంగీకరించాడు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు, అందులో... యూనివర్సిటీ అధికారుల అనుమతితో విద్యార్థులు

ʹఓయూ విద్యార్థి వొగ్గె భరత్ ను తెలంగాణ, NIA పోలీసులు కిడ్నాప్ చేశారుʹ

15 జూలై సోమవారం రోజున తన హాస్టల్ రూమ్ లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత‌ భరత్ మిత్రుడిని కలిసి వస్తా అని ఓయూ హాస్టల్ నుండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో హిమయత్ నగర్ కేఫ్ లో టీ తాగుతుండగా కరీంనగర్ పోలీసులము అని చెప్పి భరత్ ను బలవంతంగా వ్యాన్లో పడేసి కిడ్నాప్ చేసారు. ఆరోజు రాత్రి హైదరాబాద్ లోనే ఒక గుర్తు తెలియని ఆఫీసులో తీవ్రంగా కొడుతూ త

Open Letter To President of India - OU Students

However the university has become a subject of negligence in the hands of the successive governments including the present Telangana government. The students while struggling for separate statehood have raised many issues that have been impeding the progress of the university in fulfilling its responsibility towards the people of the country...

కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఓయూ విద్యార్థులు

రాష్ట్రంలో ప్రైవేట్‌ వర్సిటీల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓయూలో విద్యార్థులు మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహ నం చేశారు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రండి