సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.

సీఎం

స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఓకే పేరు. మోడీ శిష్యులు అని. వాళ్ళు మంతృలు కావచ్చు... ముఖ్యమంతృలు కూడా కావచ్చు. ఇది మోడీపై కోపంతో అంటున్న మాట కాదు. నడుస్తున్న చరిత్ర.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక ʹస్వచ్చ్‌ భారత్‌ అభియాన్‌ʹ పథకాన్ని అమలు చేయడంలో రాజస్థాన్ బాగా వెనకబడి పోయింది. ఎట్లైనా ఆ పథకాన్ని బ్రహ్మాండగా అమ్లు చేసీ మోడీ దగ్గర మార్కులు కొట్టేయాలని ముఖ్యమంత్రి వసుంధర రాజె బీజేపీ ప్రభుత్వం బాగా ఆలోచించీ...చించీ ఓ కొత్త మార్గాన్ని కనిపెట్టింది. తరతరాలుగా ఇంటి వెలుపల బహిర్భూమికి వెళ్లే అలవాటున్న రాష్ట్రంలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలంటే అలా బహిర్భూమికి వెళ్లే వాళ్ల ఫొటోలు తీయాలని, వారెవరే గుర్తించి అవమానపర్చాలని గతేడాది ఆమె ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ అశోక్‌ జైన్‌ ఆధ్వర్యంలో ఐదుగురు మున్సిపల్‌ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు సెల్ ఫోన్ లు వేసుకొని రోడ్ల మీద పడ్డారు. బహిర్భూమికి వెళుతున్న మహిళల ఫొటోలు తీశారు. మహిళలు అడ్డుకున్నా, మొత్తుకుంటున్నా వినకుండా ఫోటోలు తీస్తూ పోయారు. అసభ్యంగా ఇలా ఫొటోలు తీయడం ఏమిటంటూ స్తానికుడైన‌ సామాజిక కార్యకర్త‌ 52 ఏళ్ల జఫర్‌ ఖాన్‌ అడ్డుకున్నాడు. ప్రధాని కల నెరవేరడం కోసం ముఖ్య‌మంత్రి ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకున్ననేరానికి జఫర్ ఖాన్ పై అధికారులు దాడి చేశారు. విచక్షణరహితంగా కొట్టారు. దాంతో జఫర్ ఖాన్ మరణించాడు. ఈ సంఘటనలకు నిరసనగా స్థానికులు రోడ్డుపై బైటాయించారు. ఆందోళన నిర్వహించారు. అయినా ఫోటోలు తీసిన అధికారులపై చర్యలు లేవు ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి ఆదేశాలను మాత్రమే పాటించారు కాబట్టి. పోనీ జఫర్ ఖాన్ ను హత్యచేసినందుకైనా చర్యలు తీసుకుంటారా అంటే..... తీసుకోబోరు ఎందుకంటే జఫర్ ఖాన్ డ్యూటీలో ఉన్న అధికారులను అడ్డుకున్నాడు కాబట్టి.

అది సరే రాజస్థాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలోని 22 శాతం ఇళ్లకు ఇంకా టాయ్‌లెట్లు లేనప్పుడు వారంతా ఎక్కడికెళ్లాలి ? ఆరుబయట బహిర్భూమికి వెళ్లడం సరైన సంస్కృతి కాదని చెప్పే నాయకులు అలా వెళ్ళే మహిళల‌ ఫొటోలు తీయాలని ఆదేశాలివ్వడం ఏ సంస్కృతి ? అడ్డుకున్న వాళ్ళను హత్యలు చేయడం ఏం సంస్కృతి ? అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోదా లేక రాచరిక పాలన నడుస్తోందా ?

Keywords : rajasthan, vasundhara raje, modi, bjp, Zafar Khan, Defecating Women, swachh bharat, Rajasthan municipal council employees,
(2024-04-14 03:20:21)



No. of visitors : 2116

Suggested Posts


Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks

The family of a Muslim man, whose dismembered body was found on the railway tracks near Govindgarh in Alwar district of Rajasthan on Friday, has claimed that he was thrashed and shot dead by a crowd of cow vigilantes when he was transporting four cows to his native village Ghatmika in Bharatpur....

బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్ష‌కుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్

ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాధితులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును ఎత్తి వేసి పెహ్లూ ఖాన్ హంతకులను శిక్షిస్తుందని ఆ కుటుంభం భావించింది. అయితే బీజేపీ కన్నా తామేమీ తక్కువ తినలేదని మరో సారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన పెహ్లూ ఖాన్ పై, అతని కొడుకుపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!

ఆవులను అక్రమ రవాణా చేశాడన్న నెపంతో రాజస్తాన్ లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని మతోన్మాద‌ మూక కొట్టి చంపిన కేసును రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా కోర్టు ఈ రోజు కొట్టివేసింది. నిందితులైన ఆరుగురిని నిర్దోషులని కోర్టు ప్రకటించింది.

గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి

గోరక్షక ముసుగులో ఉన్న మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్‌లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌....

అంబేడ్కర్ పోస్టర్లను చించేసి, అడ్డుకున్న దళిత యువకుడిని కొట్టి చంపారు !

బాబా సాహెన్ అంబేడ్కర్ పోస్టర్లను చించేసిన వారిని అడ్డుకున్నందుకు ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. చంపిన వాళ్ళు ఓబీసీ వర్గానికి చెందినవాళ్ళుగా పోలీసులు పేర్కొన్నారు.

హైకోర్టులో మనువు విగ్రహం తొలగించాలని దశాబ్దాల పోరాటం

1989 నుండి రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో మనువు విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించాలని 32 ఏళ్ళుగా పోరాటం సాగుతుంది. దళిత, బహుజనులు, ప్రజాస్వామిక వాదులు ఆ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఓ ముస్లిం వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు మతోన్మాదులు. రాజస్థాన్ లోని షికార్ జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిథిలో గఫార్ అహ్మద్ అనే ఆటో నడుపుకొని జీవించే 53 ఏళ్ళ వ్యక్తి తన ఆటోలో పాసింజర్లను గమ్య స్థానాల్లో దింపి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సీఎం