ʹమధుకర్ ను కావలించుకోవాలనిపించిందిʹ

ʹమధుకర్

(కుల నిర్మూలనా పోరాట సమితి ప్రధాన కార్యదర్శి బూరం అభినవ్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పెట్టిన పోస్ట్ యధాతదంగా)

చలో పెద్దపల్లి !!
చలో మంథని !!!

ఈ రెండు పోరాటాలు, ఆ తర్వాత... ఒక సుదీర్ఘమైన విరామం తర్వాత.. పరిణామాలను తెలుసు కునేందుకని..నిన్న మంథని వెళ్ళాం.మంథని మధుకర్ కుటుంబ సభ్యులతో ఒక రోజంతా గడిపాం.ప్రేమగా అన్నం పెట్టి ఎంతో ఆదరించారు..మధుకర్ తల్లి లచ్చవ్వ మధుకర్ ని గుర్తిచేస్తుంటే గుండె కరిగి కన్నీళ్లను పంచింది.మధుకర్ ఎంత గుణవంతుడో, పనిమంతుడో మాదరి లింగవ్వ చెబుతుంటే మధుకర్ ని గట్టిగా వాటేసుకోవాలనే కోరిక కలిగింది.అంతలా నా మనసుని ఆక్రమించాడు మధుకర్.అగ్రకులోన్మాదులు, హంతక రాజకీయనాయకులు, దగుల్బాజి పోలీసులు , ఎంగిలిమేతుకుల కోసం రక్త సంబంధాలకు సైతం వెలగట్టె వెధవలు ... అందరు కలిసి మధుకర్ ని చంపేశారు.ఖానాపూర్ ప్రజలకి అంత తెలుసు.అందుకే హంతకులు అధికారంలో ఉన్నా గ్రామంలో తిరగడానికి మొఖం చెల్లక నక్కి నక్కి దొంగలాగ బ్రతుకుతున్నారు.ఆ నా కొడుకులు కంటబడితే తన్నాడానికి లచ్చవ్వ చెప్పులు చీపుర్లు సిద్ధం చేసుకుంది.ఒకనాడు చిక్కిన సర్పంచ్ ఓదెలుని చీపురుతో సింగారించబోయింది.కాని పోలీసులు వచ్చి రక్షించారట.వారినీ వదలలేదట అమ్మ.నోటికొచ్చిన బూతులు తిట్టి తన కసినంతా వెళ్ళగక్కిందట.అలా భరించరాని బాధను గుండెలో మోస్తూ 130 హై బి.పి తో బాధపడుతోంది లచ్చవ్వ.ఇక తండ్రి ఎల్లయ్య... వేదన తీర్గ ఉంది.అమ్మలా ఎదువలేదు.బజారెక్కి బూతులు తిట్టలేదు.నా బిడ్డ హంతకులకు శిక్ష పడలంటూ నిత్యం కలువరిస్తున్నాడు.న్యాయం జరిగే పోరాటం ఓడిపోతే.. నేనె గెలిపిస్తానని హెచ్చరిస్తున్నాడు.బాధ ఎక్కువై తట్టుకోలేనప్పుడు .. మౌనంగా రోధిస్తున్నాడు.చాలా పద్ధతి కలిగిన కుటుంబం.8 మంది సంతానం.మధుకర్ ని మరచిపోవడం వాళ్లకయితే అసాధ్యం.ఆ కుటుంబాన్ని నిలబెడదాం.👍👍
అక్కడి నుండి నేరుగా పెద్దపల్లి జిల్లా భోంపల్లికి వెళ్ళాం.కీచక పోలీస్ SI ల దాడిలో గాయపడ్డ అరికిల్ల దేవేందర్, శ్యామల కుటుంబాన్ని కలిసాం. అమ్మ, నాన, అన్న, మామ,పిల్లలు అందరూ ఎంతో ప్రేమగా ఆహ్వానించారు.రాత్రికి అక్కడే ఉండాలని కోరారు.కాని పని ఒత్తిడి వల్ల కుదరలేదు.చలో పెద్దపల్లి పాద యాత్రా విశేషాలు, పోలిసుల నిర్బందాలు, దళారుల ప్రయత్నాలు అన్నింటినీ గుర్తుచేశారు.శ్యామలకు అన్ని విధాలా అండగా నిలిచిన మహిళా కలెక్టర్ ను అక్రమంగా బదిలీ చేసినందుకు చాలా బాధ పడ్డారు.తమకోసం పనిచేసి అన్యాయం ఐన కలెక్టర్ కోసం, న్యాయం కోసం పోరాడిన ప్రజా సంఘాల కోసం తాము మరింత దృడంగా నిలబడతామన్నారు.ఎట్టి పరిస్థితిలో దలారులకు లొంగి రాజీపడమని చెప్పారు.
ఈ రెండు కేసుల్లో పోలీసులు ముద్దాయిలుగా ఉన్నారు.వారిని ఇంకా అరెస్ట్ చెయ్యలేదు.sc,st case పెట్టలేదు.రిపోస్టు మార్టం రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు.దోషులు అరెస్ట్ కాలేదు.పై డిమాండ్ ల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది.కార్యాచరణ రూపొందిస్తున్నాం.మిత్రులందరూ కలసిరావాలని కోరుతున్నాం.
బూరం అభినవ్
కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Keywords : madhukar, manthini, peddapalli, telangana, telangana, dalit
(2024-04-11 18:36:57)



No. of visitors : 987

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమధుకర్