నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?
(Wahed Abd తన ఫేస్ బుక్ టైమ్లైన్ పై చేసిన పోస్ట్ ఇది)
గత కొంతకాలంగా నోయిడా, ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది వర్గపోరాటమే. నోయిడాలోని పోష్ కాలనీలో డబ్బుకు కొదువలేని సంపన్న వర్గాలకు, రోజుకూలి చేసుకునే జొహ్రాకాలనీ వాసులకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో సహజంగానే ప్రభుత్వము, మంత్రులు, పోలీసు, పాలనాయంత్రాంగాలన్నీ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ నిలబడ్డాయి. మాహాగన్ మోడర్నే పేరుతో ఉన్న ఈ పోష్ కాలనీ గేటెడ్ కమ్యునిటీ. ఇక్కడ ఇండ్లలో పాచి పని చేసే జొహ్రాబీ కనబడకుండా పోయింది. ఈ కాలనీకి పక్కనే ఉన్న మురికివాడలో నివసించే జొహ్రాబీ ఈ కాలనీలో సేఠీ కుటుంబం వద్ద పనిచేసేది. ఆమె భర్త ఆమెను వెదుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అక్కడి సెక్యురిటీగార్డులు అడ్డుకున్నారు. మురికివాడ నివాసులు ఆమె ఎక్కడుందో చెప్పాలంటూ నిరసనగా వచ్చారు. చివరకు ఆమె ఎక్కడున్నదో తెలిసింది.
రెండు నెలల జీతం ఇమ్మని అడిగిన పాపానికి ఆమెను నిర్బంధించారని జొహ్రాబీ చెప్పింది. మరోవైపు ఆమెను నిర్బంధించిన సేఠీ కుటుంబం కూడా మురికివాడ వాసులపై కేసు పెట్టారు. అయితే కేంద్రమంత్రి మహేష్ శర్మకు రెండు పక్షాల వాదనలు వినేంత తీరిక లేదు. సహజంగానే పేదల బాధలు వినే తీరిక పాలకులకు ఉండదు. ఏకపక్షంగా సేఠీ కుటుంబం అమాయకులనీ, వారికి ఎలాంటి పాపం తెలియదని ప్రకటించాడు.
పోలీసులు కొంతమంది మురికివాడ వాసులను, ఇండ్లల్లో పనిచేసేవారిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారికి అస్సలు బెయిలు కూడా దొరక్కుండా చేస్తానని బెదిరించాడు. ఇది కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్టు చేసినవారిపై హత్యాప్రయత్నం కేసులు కూడా పెట్టేసి రాజకీయ నేతలకు సంతోషం కలిగించారు. ఈ పోష్ కాలనీలోని అమాయక సంపన్నుల్లో ఎవరికి ఎలాంటి గాయాలు లేవు. వారిపై భౌతిక దాడులు జరిగినట్లు ఎఫ్ ఐ ఆర్ లలో ఎక్కడా ప్రస్తావన కూడా లేదు. మరి హత్యాయత్నం కేసులు ఎలా ఫైలయ్యాయి?
స్పష్టంగా కనబడుతున్న విషయమేమంటే, మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన. ఒకవైపు జాతీయ రాజధాని ప్రాంతంలో అత్యంత సంపన్నులు, మరోవైపు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన నిరుపేదలు.
ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది. ఈ నిరుపేదలంతా బెంగాలు నుంచి వలస వచ్చిన ముస్లిములు. కాబట్టి దీనికి మతంరంగు పులమడం కూడా వెంటనే జరిగిపోయింది. వాట్సప్, ఫేస్ బుక్కుల ద్వారా అబద్దాలు, ఫేక్ వార్తలు ప్రచారం చేయడంలో సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించే ఈ సోకాల్డ్ చదువుకున్నవాళ్ళు వెంటనే మురికివాడ వాసులను బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులుగా కూడా ప్రచారం మొదలుపెట్టారు. అది అబద్దమని, ఈ పేదలంతా బెంగాలుకు చెందిన వారన్నది రుజువైన సత్యం. కాని అబద్దాలు చెప్పేవారికి సిగ్గెగ్గులు ఉండవు. ఈ అబద్దాన్ని ప్రచారంలో పెట్టడమే కాదు, మరో మాల్దా అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఈ సంఘటన మన నగరాల్లో వర్గవిభజన ఎలాంటిదో చాటి చెప్పే సంఘటన. ధనికులకు, పేదలకు మధ్య ఘర్షణలో యావత్తు రాజ్యం ధనికులకు వత్తాసు పలుకుతుందని చాటి చెప్పిన సంఘటన. ఈ సంఘటనలో యాధృచ్ఛికంగా పేదలు బెంగాలు నుంచి వచ్చిన ముస్లిములు కాబట్టి వారిని బంగ్లాదేశీలుగా ముద్రవేయడం జరిగింది. అలా కాకుండా ఈ పేదలు దళితులు లేదా మరో బలహీనవర్గానికి చెందినవారైతే మరో ముద్ర వేసి వేధించేవారు.
అసంఘటితరంగంలో పనిచేస్తున్న ఈ మురికివాడల పేదల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని దేశంలోని సంపన్న వర్గాలకు ఈ వివక్షలు, దౌర్జన్యాలు తమ హక్కుగా కనబడతాయి. కాని మహేష్ శర్మ వంటి మంత్రులు ʹʹచాలా మంది ఇండ్లల్లో పనిమనిషికి పెళ్ళాం కన్నా ఎక్కువ విలువ ఉంటుందిʹʹ అంటూ అసభ్యంగా, అశ్లీలంగా జోకులేస్తారు. ఈ సంపన్న వర్గాలే అన్నది మన ప్రజాస్వామ్యం అసలు రూపం అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే వాస్తవం.
- వాహెద్
Keywords : yogi adityanath, UP, noida, rss, sangh parivar, workers
(2024-04-11 18:38:04)
No. of visitors : 1212
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |