రేపిస్టు బాబాకు బీజేపీ ఎందుకు మద్దతుగా నిలబడింది ?
అతను సినిమాలో హీరో... అనుచరులకు ఆరాధ్య దైవం... లక్షల మంది అనుచరులున్న డేరా సచ్చసౌదాకు అధిపతి... తన ఆశ్రమంలో ఉన్న 18 మంది స్త్రీలపై అత్యాచారం చేశాడని, 400 మందిని నపుంసకులుగా మార్చాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఇతని బండారాన్ని బైటపెట్టిన జర్నలిస్టు హత్య, సాద్వి రేప్ కేసులో ప్రత్యక్ష సాక్షి రంజిత్ సింగ్ హత్య... ఒకటేమిటి లెక్కకు మించిన నేరాలు చేసిన అతిపెద్ద ఆర్గనైజ్ డ్ క్రిమినల్ ఇతను. రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించగల ఓట్లధేనువు... ఆ పార్టీల... ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాల మద్దతుతో భీభత్సం సృష్టించగల శక్తి యుక్తులున్నవాడు గుర్మిత్ రాంరహీమ్ బాబా
చివరికి అతని చేతిలో అత్యాచారానికి గురైన ఇద్దరు మహిళలు ధైర్యంగా చేసిన పోరాటం అతన్ని జైలుకు పంపింది.
ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాండ్ల మీద అత్యాచారానికి పాల్పడ్డ పదిహేనేళ్ల తరువాత డేరా బాబాగా పిలిచే గుర్మిత్ రామ్ రహీమ్ను సీబీఐ కోర్టు ఇవ్వాళ్ళ నేరస్థుడిగా తేల్చింది. 800 కార్ల కాన్వాయ్ తో ఆయన కోర్టుకు వచ్చిన తీరు చూస్తేనే అర్దమవుతున్నది ఆయనకు ప్రభుత్వ మద్దతు ఎంత ఉందనేది. ఏ అడ్డంకులు లేకుండా లక్షలాది మంది ఆయన అనుచరులు కోర్టు దగ్గరికి చేరుకోవడంలోని మర్మం అర్దం చేసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. ఇటు హర్యాణాలోనూ, పంజాబ్ లోనూ బీజేపీని దాని మిత్రపక్షాన్ని గెలిపించడానికి ఈ రేప్ బాబా ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనం మర్చిపోయినా పంజాబ్, హర్యాణాల ప్రజలు మర్చిపోరుకదా ! ఇతని మద్దతు పొందడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా సిర్సా లోని రేప్ బాబా ఆశ్రమానికి వెళ్ళి అతనితో చర్చలు జరిపాడు. 2014, అక్టోబర్ 7 వ తేదీన 44 మంది బీజేపీ అభ్యర్థులు సీర్సాలోని బాబా ఆశ్రమానికి వెళ్ళి అతని ఆశీర్వాదాలు పొందారు. ఈ రేప్ ల బాబా మొదటిసారి బహిరంగంగా బీజేపీకి తన మద్దతును ప్రకటించాడు. హర్యాణాలో బీజేపీ గెలుపుకు అన్ని రకాల సహకరించిన ఈ గుర్మిత్ రామ్ రహీమ్ బాబాకు సహకరించిన బీజేపీ తన రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది. రెండురోజులుగా వస్తున్న బాబా అనుచరులను పోలీసులు ఎక్కడకూడా అడ్డుకోలేదు. బ్యారీకేడ్లు ఉన్నప్పటికీ డేరా మద్దతుదారులను అడ్డుకోవద్దనే ఆదేశాలు తమకున్నాయని పోలీసులు చెప్పారు. ఈ విశయాన్ని ʹపంజాబ్ న్యూస్ ఎక్స్ ప్రెస్ʹ బైటపెట్టింది. ఆ విధంగా లక్షలాదిమంది బాబా అనుచరులను కోర్టు దగ్గర మోహరింపజేసి న్యాయమూర్తులను ప్రభావం చేసేందుకు హర్యాణా ముఖ్యమంత్రి కట్టర్ ప్రయత్నించాడని ʹపంజాబ్ న్యూస్ ఎక్స్ ప్రెస్ʹ చేసిన ఆరోపణలో అబద్దముందా?
ఇప్పుడు అలా రోడ్ల మీదికి వచ్చిన లక్షలమంది బాబా మద్దతుదారులు పంజాబ్, హర్యాణా, ఢిల్లీలలో భీభత్సం సృష్టిస్తున్నారు. బస్సులు తగలబెడుతున్నారు. రైళ్ళను తగలబెడుతున్నారు. షాపుల మీద ప్రజలమీద దాడులకు తెగబడుతున్నారు. వీళ్ళను అడ్డుకోవడానికి పారా మిలటరీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే అర్దం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. పోలీసు కాల్పుల్లో 20 మంది దాకా చనిపోయారనే వార్తలొస్తున్నాయి. వందలమంది గాయాలపాలయ్యారు. ఓ వ్యక్తి అందులోనూ ఓ రేపిస్టు కోసం ఇంత హింసజరుగుతుందంటే వెనక ఏరాజకీయ పక్షమూ లేదంటే నమ్మగలమా ?

గతంలో స్వయంగా ప్రధాని మోడీ ఈ డేరాబాబా కీర్తిని కొనియాడాడంటే దేశ దౌర్భాగ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు... ప్రజల్ని మత్తులో ఉంచాలనుకుంటాయి. అందుకు మత విశ్వాసాలను వాడుకుంటాయి. అందుకు డేరాబాబా ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాబాలు తమను తాము దైవ దూతలు చెప్పుకుంటూ చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు.
పంజాబ్,హర్యానాలోని వెనుకబడినవర్గాలకు చెందిన ప్రజలు సమాజంలోని వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. అలాంటి వాళ్ల కేంద్రంగా నడిచేదే డేరా సచ్చా సౌధా. 1948లో మస్తానా బెలూచిస్థానీ ఈ సౌధాను నెలకొల్పాడు. డేరాల్లో కులాల వంటి అడ్డుగోడలు లేకపోవడంతో సచ్ఛా సౌధాకు అధిక సంఖ్యలో ఆకర్షితులయ్యారు. అయితే డేరా ముసుగుతో ఈ గుర్మిత్ రామ్ రహీమ్ బాబా చేయని అరాచకంలేదు. చివరకు బీజేపీ మద్దతు కూడా దొరకడంతో ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది.
Keywords : Gurmeet Ram Rahim, Haryana, BJP, RSS, Amith shah, punjab
(2023-09-28 08:22:02)
No. of visitors : 4691
Suggested Posts
| పంచకులలో డేరాల హింసకు బీజేపీ ప్రభుత్వమద్దతు ఉంది... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు రేప్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు మద్దతుగా నిల్చిన బీజేపీనే ఈ హింసకు మద్దతుగా నిల్చిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ హర్యాణా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హింసకు ప్రభుత్వమే మద్దతుగా నిల్చిందని కడిగిపడేసింది. |
| అంత గొప్ప రేపిస్టుకు శిక్ష వేయడం భారత సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రేనట ! రేప్ ల బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ పై తమకున్న అభిమానాన్ని బహిరంగంగానే చాటాడు. పైగా కోర్టులనే తప్పుబట్టాడు. ʹ గుర్మిత్ సింగ్ ను కోట్లాది మంది ప్రజలు, అనుచరులు అనుసరుస్తున్నారు, గుర్మిత్ గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిపై కోర్టులు తీర్పులు వెలువరించడం భారతీయ సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రʹ అని ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు..... |
| ʹGet out!ʹ Haryana Sports Minister Anil Vij tells woman IPS officer, she stays putLocked in an argument over liquor smuggling, the Haryana Health and Sports Minister Anil Vij on Friday shouted at a senior woman police officer and ordered her to ʹget outʹ of a meeting |
| న్యాయం అడిగినందుకు15 మంది దళితులపై రాజద్రోహం కేసు!అక్రమంగా అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేయాలని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులతో సహా 15 మంది దళితులపై రాజద్రోహం కేసు బనాయించింది హర్యాణా ప్రభుత్వం. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన రెండురోజులకే ఆ దళితులపై రాజద్రోహం కేసు మోపారు.... |
| ʹసంఘ్ʹ మంత్రి ఉవాచ...డేరాల హింస అతిసహజమైనదట !పంచకుల తగలబెట్టిన, అనేక మంది మరణానికి కారణమైన , పేదల చిన్న వ్యాపారుల కోట్లాది రూపాయల ఆస్తులను తగలబెట్టిన, రెండు రాష్ట్రాల్లో దుర్మార్గమైన హింసకు పాల్పడిన రేపులబాబా అనుచరుల స్పందన అతి సహజమైనదట... |
| గో సంరక్షణ పేరుతో హరియాణాలో అరాచకం - అమాయకులపై దాడి చేసిన కాశాయ మూకహర్యాణ రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఇస్సాన్ మహ్మద్, షాహజాద్, షకీల్, ఆజాద్ మహ్మద్ అనే నలుగురు ఆటోలో వెళ్తుండగా చేతుల్లో కర్రలు, రాడ్ లు పట్టుకున్న ఓ 20 మంది గుంపు ఆటోను ఆపి ఆనలుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. గో మాంసం తీసుకువెళుతున్నారన్న.... |
| హర్యాణాలోమూక దాడి - ముస్లిం యువకుడి హత్యహర్యానా, మేవాట్ జిల్లాకు చెందిన జిమ్ ట్రైనర్ ఆసిఫ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తిని ఆదివారం ʹజై శ్రీ రామ్ʹ అని నినాదాలు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ విజిలెంట్ గ్రూపులు కొట్టి చంపారు. |
| ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు
ఈ ఏడాది జూలైలో హర్యాణా లోని సోనిపత్ లోని పోలీసు పోస్టు లో ఇద్దరు దళిత బాలికలపై డజను మంది సిబ్బంది అత్యాచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ చండీగఢ్ కు చెందిన బేఖాఫ్ ఆజాది (భయం లేని స్వేచ్చ) గ్రూప్ నిజనిర్ధారణ రిపోర్టును అక్టోబర్ 27నాడు విడుదల చేసింది. |
| రైతులపై పోలీసుల దుర్మార్గ దాడి - రక్తసిక్తమైన హర్యాణాహర్యాణా లో శనివారం నాడు రైతులపై పోలీసుల లాఠీ విరిగింది. పోలీసులు రైతులను తరిమి తరిమి కొట్టడంతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పది నెలలుగా పోరాడుతున్న రైతులపై ప్రభుత్వాలు అనేక రకాల అణిచివేతకు గురి చేస్తున్నాయి. |
| నేపాలీల్లా ఉన్నారని భారతీయులకు పాస్ పోర్ట్ నిరాకరించిన అధికారులుపౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక(NRC) తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, హర్యాణాలో ఇద్దరు అమ్మాయిలు, తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ, |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..