ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 2..."కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."



ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

"కామన్ పేజీలు.. లైన్ అకౌంట్లు.."

ఇప్పుడు స్ట్రింగర్లు అంటున్న వ్యవస్థ ను ఆంధ్ర ప్రభ దిన పత్రిక లో అకేషనల్ కాంట్రిబ్యూటర్ వ్యవస్థ గా పేర్కొనేవారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా ఎంపికైన మేం ముగ్గురం అకేషనల్ కాంట్రిబ్యూటర్లు గా పని చేయనారంభించాం. ఆంధ్రప్రభ లో జిల్లా ట్యాబ్లాయిడ్ విధానం మేం పనిచేసిన చాలా యేళ్ల తరువాత గూడా ప్రవేశ పెట్టలేదు. అయితే డాక్ ఎడిషన్, సిటీ ఎడిషన్, లేట్ నైట్ ఎడిషన్ మూడూ ఉండడం వల్ల మా వార్తలకు తగు ప్రాధాన్యత లభించేది. మా వార్తలుపంపడానికి అప్పుడు గౌలిగూడా బస్ స్టాండ్ లో ఉన్న బాక్స్ ఒక సదుపాయం అయితే, వరంగల్ కార్యాలయం లోని టెలిప్రింటర్ ఇంకో సదుపాయం. స్వామి సార్ ఉన్నప్పుడు అనంతశయనం గారు టెలిప్రింటర్ ఆపరేటర్ గా ఉండే వారు. ఆయన ద్వారా కూడా వార్తలు ఎలా రాయవచ్చో తెలుసుకోగలిగే వాళ్లం. స్వామి సార్ మృతి తర్వాత వీ ఎల్ నరసిం హా రావు సార్ మాకు స్టాఫ్ రిపోర్టర్ గా ఉండే వారు. శోధన్ పెయింట్స్ పక్కకున్న మా ఆఫీసును అక్కడినుంచి ఎంజీఎం ఆసుపత్రి వెనుక వైపు మార్చారు. అక్కడ సారుండే ఇల్లే మా కార్యాలయం గా ఉండేది. ఆ రోజుల్లో వార్తా రచన నేర్చుకోవాలంటే సార్ లాంటి అనుభవజ్ఞుల నుంచి భాషా పరమయిన మెళకువలు నేర్చుకునే వాళ్లం. సార్ అంటే ఎంత ఇష్టమో అంత భయం వుండేది. అనంతశయనం స్థానం లో శివకుమార్ వచ్చేసరికి వార్తలు రాయడం కొంత నేర్చుకోగలిగాం.వార్తలను గౌలిగూడా బాక్స్ కే పంపేందుకు నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే వాడిని. అయినా వరంగల్ వచ్చినప్పుడు మదన్ మోహన్ ను, ఆదిరాజు ను తప్పకుండా కలిసే వాడిని. ఎం జీ ఎం వెనుక సందు నుంచి మా ఆఫీసు ఎల్లమ్మ బజార్ కు మారింది. అప్పుడు చుక్క తెగిపడ్డట్టు ఎప్పుడో ఒక సారి ఆఫీసుకు వెళ్ళే నన్ను చూసి సార్ ఏమన్నా అంటాడేమో అనే భయం తో పై అంతస్థు లో ఉన్న ఆఫిసు రూం లోకి వార్తను పేపర్ లా విసిరే వాడిని. అప్పటికి నాకు కాజీపేట రాజు గారు పరిచయం లేడు. ఆయనను చూడాలని అనుకునేది.
ఈ సందర్భం లో రెండు అంశాలు చెప్పుకోవాలి. మొదటిది. మదన్ మోహన్ హనుమకొండ డేట్ లైన్ నుంచి నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ గా వెళ్ళిపోయిన సందర్భం. పత్రికల్లో, పైగా ఆంధ్ర ప్రభ లో పని చేసిన ప్రతీ అకేషనల్, రెగ్యులర్ కాంట్రిబ్యూటర్ కూడా తమ బై లైన్ చూసుకోవాలని పరితపిస్తారు. ఆంధ్ర ప్రభ దినపత్రికకు ఆ రోజుల్లో ఉన్న పేరు అది. ఎమర్జెన్సీ కా లం లో పత్రికా స్వేచ్ఛను నియంత్రించ యత్నించిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్లాంక్ ఎడిటొరియల్ ఇచ్చారని ఆ పత్రిక పట్ల అపరిమితమైన గౌరవం. మా బ్యాచులో ఉన్నవాళ్ల లో ఆదిరాజుకు, మదన్ మోహన్ కు బై లైన్ ల వార్తలు వచ్చాయి. చేర్యాల లో పని చేసే బండ్ల సూర్య నారాయణ గారికి , బండ మల్లేశం కు కూడా బై లైన్ లు వచ్చేవి. నాకు అప్పుడే అంత ఆశ వుండేది కాదు గానీ మదన్ మోహన్ కు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కూడా బై లైన్ కావాలని ఆయన కోరిక ఉండేది. కాకతీయ యునివర్సిటీ పీ ఆర్ వో గా ఉండే ఉపేందర్ సార్ కు ఇంగ్లీష్ వార్తలు రాయడం చాలా ఇష్టం. ఆయన వార్తలను ,తనే ఇంగ్లీష్ భాషలో బాగా వార్తలు రాయగలిగే వీ ఎల్ సార్ అంతగా పట్టించుకునేవాడు గాదు. అందువల్ల ఉపేందర్ సార్ రాసిన ఒక వార్తను వరంగల్ చారిత్రక ప్రాశస్త్యాన్ని ప్రస్తుతించే వార్తను మదన్ మోహన్ పేరుతో పేపర్ జీపుకు ఇచ్చి పంపారు. డెస్కులో ఎలాగోలా క్లియర్ చేసుకుని ఆ వార్త ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో బై లైన్ వేయించుకున్నాడు మదన్ మోహన్. తరువాత ఆయన నెహ్రూ యూవ కేంద్రం లో చేరడం, రవిందర్ సార్ హనుమకొండ డేట్ లైన్ లో జాయినవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఘన్ పూర్ స్ట్రింగర్ గా నాకు అత్యధికంగా వచ్చిన పారితోషికం 196 రూపాయలు. వార్తలు బాగానే రాసే వాడిని. రాసినవన్నీ ప్రచురితమయ్యేది. కానీ పారితోషికం ఎందుకో అంతకు మించి రాలేదెప్పుడూ.ఇదే టైం లో మా ఆదిరాజుకు ఆరేడువందల రెమ్యూనరేషన్ వచ్చేది. ఇదెలా సాధ్యమని మాకు ఆశ్చర్యమేసేది. మా పత్రిక లో లైన్ అకౌంట్లు వివరాలు మేమే పంపాలి. ఆదిరాజు కూడా తనే పంపే వాడు. కానీ ఆయన ఎంచుకున్న వ్యూహం చాలా బాగుండేది. వరంగల్ జిల్లా తో పాటు ,నల్గొండ , కర్నూల్, మహబూబ్ నగర్ మూడు జిల్లాలలో కూడా ఆత్మకూరు డేట్ లైన్ లు ఉండేది. ఆ మూడింటి లైన్ అకౌంట్లు కూడా ఆదిరాజు తన వివరాలతో కలిపి పంపే వాడట. మొత్తానికి ఆదిరాజు తన లైన్ అకౌంట్ ఇకామత్ మాకు చెప్పినప్పుడు మేం నవ్వుకునే వాళ్లం.

-పీవీ కొండల్ రావు

Keywords : journalism, warangal. andhraprabha, stringer, pv kondal rao
(2024-04-21 19:21:33)



No. of visitors : 1213

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..