include 'men';
?>
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...
ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...
స్ట్రింగర్ జీవితం...
గ్రామీణ ప్రాంత జర్నలిస్టు సాధారణం గా స్ట్రింగర్ గానే తన విలేకరి జీవితం ఆరంభించే అవకాశం వుంటాది. ఎక్కడో ఒక్కరిద్దరు తప్ప జర్నలిజం ఎంట్రీ లోనే పై స్థాయి ఉద్యోగులుగా చేరిన వారు చాలా అరుదు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు వార్తా రచనను మెరుగుపరుచునేందుకు వాళ్ల అనుభవం ఉపకరిస్తాది.
గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు.
వరంగల్ లో మా తరం జర్నలిస్టులు అందరూ ప్రజల సమస్యలను అవగతం చేసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాల్లో పాలుపంచుకోవడమో, దిశా నిర్దేశనం చేయాడమో , మమేకమవడమో చేసిన వాళ్ళే.
రుద్రాభట్ల కిషన్ సార్ వరంగల్ లో చేరిన తర్వాత వార్తా రచనా రంగం లో ఓ వినూత్న పోటీ నెలకొన్నది. ఆ పోటీ జిల్లాలో అంతకు ముందే వార్తా రచన, వార్తా సేకరణ లో కొత్త ఒరవడులు నేర్చుకుంటున్న ఒక తరానికి ఉత్ప్రేరకం గా ఉపయోగపడింది.
ఘన్ పూర్ లో ఉన్నప్పుడే , జర్నలిస్టు యూనియన్ కార్యకలాపాల్లో చేరే అవకాశం లభించింది. ఇప్పుడయితే జర్నలిజం లో చేరకముందే అక్రెడిటేషన్ కార్డులు రావడమో, అక్రెడిటేషన్ వచ్చిన తర్వాత జర్నలిస్టులు కావడమో చూస్తున్నాం గానీ, మేము జర్నలిస్టులు గా చేరిన నాడు యూనియన్ సమావేశాలు ప్రభుత్వ పరం గా లభించాల్సిన సదుపాయాలను గురించి ఉద్యమాలు చేయాల్సిన అవసరాలను గురించి చర్చించేవి.
నిజానికి అప్పటి యాజమాన్యాలు స్ట్రింగర్ వ్యవస్థకు ఉడతా భక్తి గా చిన్న చిన్న రెమ్యూనరేషన్ లు ఇచ్చేవి. ఘన్ పూర్ లో ఉన్నప్పుడు ఓ రోజు వీ ఎల్ సార్ ఆదేశం మేరకు జనగామలో నిర్వహిస్తున్న యూనియన్ సమావేశానికి బయలుదేరాము. హనుమకొండ నుంచి డీ పీ ఆర్ వో ఆఫీసు లో ఉండే మెటాడర్ వాహనం లో నరసింహా రావు సార్, మోహన్ రావు సార్, కృష్ణా రెడ్డి సార్, వీళ్ల తో బాటు రవీందర్ సార్, కూడా బయలుదేరి వచ్చారు.యూనియన్ అనగానే దేవులపల్లి అమర్, శ్రీనివాస్ రెడ్డి సార్ ల పేర్లు మాత్రమే గుర్తుండే ఆ రోజులలో సమావేశానంతరం ఎన్నికలు నిర్వహిస్తారని తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36 మంది జర్నలిస్టులు యూనియన్ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఈనాడు లో పనిచేసే వాళ్లెవరూ యూనియన్ లో యాక్టివ్ గా వుండే వాళ్ళు కాదు. అయితే ఈనాడు స్టాఫర్ గా ఉండే పీ ఏ వీ ప్రసాద్ ఓ పర్యాయం జిల్లా కార్యదర్శిగా కొనసాగి బదిలీ అయిన తర్వాత ఆ బాధ్యతలను వీ ఎల్ సార్ తాత్కాలికం గా నిర్వహించి ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం లో మేము జనగామ కు వెళ్లాము. జనగామ, యూనియన్ అనగానే ఆ ప్రాంతం లో పనిచేస్తున్న కన్నా పరశురాములు,కందుల నరసింహులు, రచ్చ విజయకుమార్, బులుసు ఈశ్వర్ కుమార్ లతో బాటు చేర్యాలకు చెందిన బండ్ల సూర్యనారాయణ, బండ మల్లేశం, ఉప్పల అంజయ్య గారు గుర్తు వస్తారు. వీళ్లకు తోడు పరకాల ప్రాంతం లో మా తర్వాత ఆంధ్ర ప్రభ లో చేరిన మెండు రవీందర్ వాళ్లు కూడా జనగామ కు వచ్చారు. జనగామ గెస్ట్ హౌజ్ లో సమావేశం జరిగింది. అమర్ ఎప్పటిలాగే స్ఫూర్తిదాయక ఉపన్యాసమిచ్చారు. ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా కన్నా ఎన్నికయ్యారు. కార్యదర్శి గా వీ ఎల్ సార్ అయ్యారు. కోశాధికారిగా దాసరి కృష్ణా రెడ్డి అయ్యారు. అప్పుడే సమావేశానికి హాజరయిన నాకు కార్యవర్గ సభ్యుడిగా అవకాశమిచ్చారు. యూనియన్ లో మొదటిసారే కార్యవర్గం లోకి నన్ను తీసుకోవడం తో నాకు నిజంగా సంతోషమయింది.
ఈ విషయాలు రాస్తున్న సందర్భం లో అప్పటిసంఘటనలన్నీ నా కళ్లముందు ఉన్నట్టే అనిపిస్తున్నది. వీ ఎల్ సార్ ఉన్నప్పుడే పీ ఏ వి ప్రసాద్ బదిలీ అనంతరం ఈనాడు లో నళినీ కాంత్ గారు, ములుగు రమేశ్ గారు ఇద్దరూ వరంగల్,హనుమకొండ డేట్ లైన్ లతో పనిచేసేవారు. ములుగు రమేశ్ గారికి ఫారెస్ట్ విభాగం లో ఉద్యోగం రావడం తో ఆయన జర్నలిజం వదిలి వెళ్లి పోయారు.దాంతో నళిని కాంత్ గారు ఈనాడు వరంగల్ కార్యాలయానికి ఇన్ ఛార్జి గా మారి అనంతరం పూర్తికాలం స్టాఫర్ అయ్యారు. అప్పటికే నేను ఘన్ పూర్ వార్తలు రాస్తూ పీజీ చదువుతున్న రోజులు. మా క్లాస్ లో ఉన్న జగన్ అనే మిత్రుడు పీజీ తర్వాత తాను ఏదయినా చదువో పనో లేక పోతే హనుమకొండ లో ఉండడం అసాధ్యమని అందువల్ల తానుకూడా విలేఖరి అవుతే బాగుంటుందని అంటుండే వాడు. ఈనాడు లో అప్పుడు నారాయణ మూర్తి అనే మిత్రుడుండే వాడు. ఆయన అంతవరకూ చేసిన హసన్ పర్తి డేట్ లైన్ నళినీకాంత్ స్టాఫర్ అయిన తర్వాత మూర్తి హనుమకొండ కు మారడం వల్ల ఖాళీ అయింది. అందుకోసం హసన్ పర్తి డేట్ లైన్ నింపే అవకాశం ఉంది. వీ ఎల్ సార్ స్టాఫర్ గా ఉన్నప్పుడు సార్ ను ధైర్యం గా కలువడం మా వల్ల కాకపోయేది. అయితే జగన్ ను ఈనాడు లోకి తీసుకొచ్చిన సందర్భం లో ధైర్యం చేసా. వరంగల్ లో మా ఆఫీసుకు నేను జగన్ సైకిల్ పై వెళ్లి నళిని కాంత్ కు ఫోన్ చేయించాము. జగన్ హసన్ పర్తి డేట్ లైన్ లో జాయినయ్యాడు. అప్పుడు హనుమకొండ లో మా అడ్డా చౌరస్తా లో ఉండే విజయా ఫోటో స్టూడియో.
జగన్ మొదటి వార్తలు మా పీజీ క్లాస్ లో వెనుక బెంచిల్లో కూర్చొని రాసిన సందర్భాలు ఇప్పటికీ గుర్తు. రుద్రాభట్ల కిషన్ సార్ వరంగల్ వచ్చిన సందర్భం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉద్యమం ఉధృతమయిన తరుణం. సహజం గానే వార్తా రచనా రంగం లో ఆరితేరిన కిషన్ సార్ జిల్లాలో ఓ పోటీ తత్వానికి ఆద్యుడిగా నిలిచాడనే చెప్పుకోవాలి. మా ఆఫీస్ నాగుల సంది లోకి మారింది. నా ద్వారా జగన్ జర్నలిజం లోకి చేరిన మొదటి విలేకరి అయ్యాడు.వాస్తవానికి ఆంధ్ర ప్రభ లో చేరిన దశలోనే మొదటిసారి సమయం దినపత్రిక మేచినేని కిషన్ రావు నేతృత్వం లో ఆరంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఊళ్లో ఆంధ్ర ప్రభ ఏజెంట్ గా ఉంటున్న నాకు సమయం దిన పత్రిక లో సేల్స్ ప్రమోటర్ గా చేయాలనిపించింది. మోహన్ రావు సార్ ఆ పత్రిక వరంగల్ స్టాఫర్ గా చేరాడు. నేను సేల్స్ ప్రమోటర్ గా ఓ వారం రోజులు చేసాను. ఆ పత్రిక లో లేఖల పేజీ కి "సమయం వచ్చింది" అనే పోయెం కూడా రాసాను. ఆది అచ్చయింది కూడా.
వార్తా రచన లో దేవులపల్లి అమర్ అంటే ఎంత ఇష్టమో సమాజానందస్వామి పేరిట ప్రజాతంత్ర లో రన్నింగ్ కామెంట్రీ రాసిన దేవీప్రియ కామెంట్రీ గూడా అంటే ఇష్టం నాకు. అందుకే ఆంధ్ర ప్రభ ఘన్ పూర్ స్ట్రింగర్ గా ఉన్నపుడే "గానా బజానా" పేరుతో నాయకుల మీద కామెంటరీ రాసాను. ఇప్పటికీ ఎలుకలు కొట్టిన ఆ నోట్ బుక్ భద్రంగానే ఉన్నది.సమయం తో నా అనుబంధం మళ్ళీ రెండో సారి కొనసాగింది.
పీజీ అయిపోయే సరికే బాపుకు యాక్సిడెంట్ కావడం బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సిన స్థితి నెలకొన్నాయి. ఆ దశలోనే ముజీబ్ ఖాన్ నేతృత్వం లో ఆరంభమవాల్సిన సమయం లో చేరాను. ముకుందన్ సీ మీనన్ ఎడిటోరియల్ హెడ్ గా చేరిన ఆ పబ్లికేషన్ లో అందరూ ఉద్ధండులే. వేణు,వనజ లతో బాటు గోపీ కూడా ఆ పత్రికలో చేరాడు.మల్లేపల్లి లక్ష్మయ్య,విజయవాడ సీనన్న, వీళ్లంతా కూడా అప్పుడు హైదరాబాద్ లో చేసినవాళ్లలో ఉన్నారు. నన్ను మెదక్ జిల్లా స్టాఫర్ గా వేసారు. నేను సంగా రెడ్డి లో పనిచేయాలి. మొన్న ఓ ఆరునెల్ల క్రితం సంగా రెడ్డి లో ఓ మిత్రుని ఇంటికి వెళ్ళాను కానీ సమయం స్టాఫర్ గా నేను అక్కడికి వెళ్ళనుగూడా వెళ్లలేదు. ఈ కారణం గానే నేమో నా పై వేణు కు ప్రేమ తో కూడిన కోపం. బాపు అనారోగ్యం మిషతో నేను మెదక్ నుంచి హైదరాబాద్ రాగలిగాను. కానీ అక్కడ కూడా ఏదో ఒక కారణం తో పనితప్పించుకుని వరంగల్ లోనే పనిచేయాలని ఉబలాటం. అప్పుడే చెన్నారెడ్డిని దించటానికి హైదరాబాద్ లో జరిగిన మత కొట్లాటలు చోటుచేసుకున్నట్టు గుర్తు. ఆ కొట్లాటల అనంతరం నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఆధారంగా "స్లిమ్మర్ హోప్స్ ఇన్ స్లం లైవ్స్" అని ఓ వార్తను సమయం కోసం రాసాను. ఆ వార్త మీనన్ సార్ కు నచ్చిందట. ఆయన కోసం వార్తలు అప్పుడు ఇంగ్లీష్ లోనే రాయాల్సి వచ్చేది.
సమయం మొదటి సాలరీ 3500.నా మొదటి సాలరీ ఘటన కూడా ఇక్కడ చెప్పుకోవాలి. మెదక్ స్టాఫర్ గా నాకు జీతం ఇచ్చారు. బాపు నిమ్స్ నుంచి డిశ్చార్జి కాలేదింకా. బాబాయి ఇంట్లోనే ఉంటున్నా ట్రెయిన్ పాస్ తీసుకుని వెళ్లి వస్తుండే వాణ్ని. మొదటి జీతం తీసుకున్న సంతోషం. నా పాస్ టైం అయిపోయింది. ఘన్ పూర్ నుంచి సికింద్రాబాద్ కు తీసిన పాస్ ప్లేసులో సికింద్రాబాద్ నుంచి ఘన్ పూర్ కు పాస్ తీసాను. ఆంధ్ర ప్రభ సర్క్యులేషన్ సైడ్ రామన్నయ్య వరంగల్ ఇన్ చార్జి. హైదరాబాద్ కు నాతో బాటు నెక్ సీను, కోళ్ల ఫారం రమేశ్ బయలుదేరాం. ఫిబ్రవరి తో ముగిసిన పాత పాస్ తో బాటు, మార్చి నెల పాస్ రెండూ నా దగ్గరున్నాయి. ఫిబ్రవరి పాస్ కూడా మార్చికి దిద్ది నేను ఆ పాస్ తో ,రమేశ్ కొత్త పాస్ తో భాగ్యనగర్ ఎక్కాము. ప్రయాణం సాఫీగానే సాగింది. జేబులో మొదటి జీతం. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. ఠక్కున దిగాలని ప్లాట్ ఫాం వైపు చూస్తున్న. పాస్ పనిచేస్తున్నది అనే తృప్తి. ఒక కిరాయ మిగిలిందనే లెక్క. హమ్మయ్య అనుకుంటూ దిగబోయాను. ప్లాట్ ఫాం మీద టీసీ ఠక్కున అందుకున్నాడు. ఫిబ్రవరి పాసును గుర్తించాడు. ఫైన్ కట్టమని రాసాడు. రామన్నయ్య తమ్ముడు అలాంటి వాడు కాడని వదలమని కోరాడు. అయినా కాగజ్ నగర్ నుంచి సికింద్రా బాద్ వరకు 3600 ఫైన్ వేసారు. నా మొదటి జీతం అలా ఖర్చయింది.
-పీవీ కొండల్ రావు
Keywords : journalism, warangal, telangana, pv kondal, andhraprabha, samayam
(2024-03-26 06:54:33)
No. of visitors : 2112
Suggested Posts
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావుమహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు..... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న.... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావుకిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన.... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావుఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు..... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావువరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావుమా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు.... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు..... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావుఅప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని.... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..