include 'men';
?>
ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్...ʹ- గౌరీ లంకేశ్ చివరి సంపాదకీయం
సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ ఈ నెల 5న దుండగుల తూటాలకు బలయ్యారు. తుది శ్వాస విడిచే వరకూ హిందూత్వ విభజన రాజకీయ ఎజెండాకు వ్యతిరేకంగా స్థిరంగా ఆమె తన కలాన్ని ఝుళిపించారు. 16 పేజీల కన్నడ వారపత్రిక ʹగౌరీ లంకేశ్ పత్రికేʹ లోని మూడవ పేజీలో ʹకండ హాగేʹ (నా చూపు) పేరుతో ఆమె సంపాదకీయం రాసేవారు. తాజా సంచికలో ఆమె రాసిన చివరి సంపాదకీయం పూర్తి పాఠాన్ని దిగువ ఇస్తున్నాం.
ఈ వారం సంచికలో భారత్లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్ దారిలో వెళ్తున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను.
కొన్ని రోజుల క్రితం గణేశ్ చతుర్థి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సంఘ్ పరివార్ ఓ పుకారును ప్రచారంలోకి తెచ్చింది. గణేశ్ విగ్రహాలను ఎక్కడెక్కడ ప్రతిష్టించాలో కర్నాటక (కాంగ్రెస్) ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నది ఆ వార్త. ఒక్కో విగ్రహం కోసం రూ.10 లక్షలు చెల్లించాలి. ఎత్తు విషయంలోనూ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇతర మతస్తుల నివాసాలు లేని ప్రాంతాల దారిలోనే నిమజ్జన యాత్ర సాగాలి. టపాసులు కాల్చేందుకు అనుమతించరు. ఈ తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తెచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). కర్నాటక పోలీస్ చీఫ్ ఆర్కె దత్తా ఈ వార్తపై వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి. అటువంటి నిబంధనలేమీ ప్రభుత్వం విధించలేదని ఆయన స్పష్టం చేశారు. దాంతో, అది పచ్చి అబద్దమని తేలిపోయింది. ఈ పుకారుకు ఆధారమేమిటని వెతికితే ʹపోస్ట్కార్డు.న్యూస్ʹ వెబ్సైట్ అని తేలింది. అది హిందూత్వవాదులు నడిపిస్తున్న వెబ్సైట్. సామాజిక మాధ్యమాల్లో ప్రతి రోజూ ఇలాంటి వార్తలను ఆ వెబ్సైట్ సృష్టిస్తుంది.
ఆగస్టు 11వ తేదీన ʹపోస్ట్కార్డు.న్యూస్ʹ వెబ్సైట్ ʹకర్నాటకలో తాలిబన్ పాలనʹ అంటూ ఒక అబద్దపు వార్తను సృష్టించింది. గణేశ్ చతుర్థి సందర్భంగా కర్నాటక ప్రభుత్వం అనుచిత నియమాలను ఏర్పాటు చేసిందన్నది సారాంశం. ఈ అబద్దాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేయడంలో సంఘీయులు విజయం సాధించారు. మరే కారణంగానో సిద్ధరామయ్య ప్రభుత్వం పట్ల ఆగ్రహావేశాలతో వున్న వారు ఈ అబద్దపు వార్తను తమ ఆయుధంగా చేసుకున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన, విచారకరమైన విషయమేమంటే ... ప్రజలు తమ కళ్లు-చెవులు మూసుకుని, బుర్రకు ఏమాత్రం పని పెట్టకుండా, ఆలోచించకుండా ఇదే వాస్తవమని భావించారు.
లైంగిక దాడి కేసులో గుర్మీత్ రామ్ రహీం సింగ్ను దోషిగా తేలుస్తూ గత వారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సందర్భంగా ఆయనతో చాలా మంది బీజేపీ నేతలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని మోడీతో సహా, హర్యానాకు చెందిన బీజేపీ మంత్రుల ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. దాంతో... బీజేపీ, సంఫ్ు పరివార్ ఇరకాటంలో పడ్డాయి. అందుకు కౌంటర్గా సీపీఐ(ఎం) నేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను గుర్మీత్తో కలిపి ఓ ఫోటోను ప్రచారంలో పెట్టారు. వాస్తవాన్ని వెలికి తీయగా.. అది గుర్మీత్తో కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ దిగిన ఫోటో అని తేలింది. ఫోటోషాప్ ద్వారా చాందీ తల స్థానంలో విజయన్ తల వుంచి... సృష్టించిన నకిలీ ఫొటో అని స్పష్టమైంది. హిందూత్వ వాదులకు చెందిన సోషల్ మీడియా నిపుణులు చాందీ ఫోటో స్థానంలో విజయన్ ఫోటోను చేర్చి ప్రచారంలో పెట్టారు. దానికి బదులుగా అసలు ఫోటోను కొందరు వెంటనే వెలుగులోకి తేవడంతో సంఫ్ు పరివారం బండారం బయట పడింది.
హిందూత్వ వాదులు సాగిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలకు గతేడాది వరకూ సరైన కౌంటర్ ఇచ్చినవాళ్లు లేరు. ఇప్పుడు చాలామంది అందుకు నడుం బిగించారు. స్వాగతించదగిన పరిణామం. ఇప్పటిదాకా నకిలీ వార్తలే రాజ్యమేలగా, ఇప్పుడు వాస్తవ వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.
ఉదాహరణకు, ఆగస్ట్ 17వ తేదీన ధృవ్ రాధీ సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్న అబద్దాలను ఎత్తి చూపే వీడియో ఇది. మోడీ చెప్తున్న అబద్దాలను రాధీ గత కొద్ది మాసాలుగా బహిర్గతం చేస్తున్నారు.
ప్రారంభంలో కొద్దిమంది మాత్రమే రాధీ వీడియోలను వీక్షించేవారు. అయితే ఈ వీడియోకి బాగా ప్రచారం లభించింది. ʹయూ ట్యూబ్ʹలో లక్ష మందికి పైగా చూశారు.
రాధీ పేర్కొన్న వివరాల ప్రకారం నెల రోజుల కిందట ʹబుజి బుజియాʹ (అబద్దాల కోరు అని అర్ధం. మోడీకి లంకేశ్ పెట్టిన పేరు) ప్రభుత్వం రాజ్యసభలో ఓ విషయం వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 30 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారని చెప్పింది. అయితే, నోట్ల రద్దు అనంతరం 91 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనికి ముందు పేర్కొన్నారు. ఆర్థిక సర్వే ప్రకారం కేవలం 5.4 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారు. ఈ మూడు అంకెల్లో ఏవి సరైనవని రాధీ తన వీడియోలో ప్రశ్నించారు.
నేడు బిజెపి ప్రభుత్వం చెప్పిన అబద్దాలను, ఇచ్చిన సమాచారాన్ని ప్రధాన మీడియా అంగీకరిస్తోంది. ప్రశ్నించేవారు, సవాల్ విసిరేవారు లేకపోవడమే అందుకు కారణం. టీవీ వార్తా చానళ్ల విషయానికొస్తే ఇందులో పది దశలున్నాయి. ఉదాహరణకు, రామ్నాథ్ కోవింద్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అనేక ఆంగ్ల వార్తా చానళ్లు ఒక కథనాన్ని ప్రసారం చేశాయి. కోవింద్ ప్రమాణం చేసిన కొద్ది గంటలలోపే ట్విటర్లో 30 లక్షల మందికి పైగా అనుచరులను సంపాదించు కున్నారన్నది కథనం సారాంశం. కోవింద్ ప్రజాదరణ ఏ విధంగా పెరిగిందన్న అంశాన్ని కొన్ని చానళ్లు రోజంతా నొక్కి చెప్తూనే వున్నాయి.
ఈరోజుల్లో అనేక టీవీ వార్తా సంస్థలు ఆర్ఎస్ఎస్తో జత కట్టినట్టు కనిపిస్తోంది. కథనం వెనక వాస్తవమేమంటే... పదవీ విరమణ చేసిన దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ అధికారిక ట్విటర్ ఖాతాను కొత్తగా అధ్యక్ష పదవిని చేపట్టిన కోవింద్కు కేటాయించారు. దాంతో సహజంగానే ఆయన ఫాలోవర్లంతా కోవింద్కు బదిలీ అయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్కు ట్విటర్లో 30 లక్షల మందికి పైగా ఫాలోవర్లు వున్నారన్నది గమనించదగ్గ విషయం.
ఆర్ఎస్ఎస్ అబద్దపు ప్రచారాలకు కౌంటర్గా సత్యాన్వేషకులు అనేకమంది వాస్తవమేంటో చెప్తున్నారు. ధృవ్ రాధే తన వీడియోలతో ఈ పని చేస్తుంటే, ప్రతీక్ సిన్హా ఒక వెబ్సైట్ (ఆల్ట్న్యూస్.ఇన్)ను ప్రారంభించారు. ఇలాంటివే మరికొన్ని వెబ్సైట్లు...ది వైర్, స్క్రోల్, న్యూస్ లాండ్రీ, క్వింట్ వంటి ఆన్లైన్ వార్తా పత్రికలు వున్నాయి. ఇవి చాలా చురుగ్గా తప్పుడు వార్తా కథనాల గుట్టు విప్పి చెప్తున్నాయి.
ఆర్ఎస్ఎస్, కాషాయ దళం సాగిస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వాళ్లంతా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలనూ ఆశించకపోవడం గమనార్హం. వాళ్ల లక్ష్యం తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చూడటం, ఫాసిస్టుల బండారాన్ని బైట పెట్టడం.
కొద్ది వారాల క్రితం భారీ వర్షాల కారణంగా బెంగళూరు నీట మునిగిపోయినప్పుడు... కర్నాటక బిజెపి ఐటి విభాగం ఒక ఫోటోను విడుదల చేసింది. ʹచంద్రుడి మీద నడుస్తున్న ప్రజలను నాసా కనిపెట్టింది. ఆ తర్వాత బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ దానిని బెంగళూరు రోడ్డుగా ధృవీకరిం చిందిʹ అంటూ ఫోటో కింద వ్యంగ్యోక్తులను కూడా జోడించింది. భారీ వర్షాలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నకిలీ వార్తలను ప్రచారం చేసే ప్రయత్నమిదని స్పష్టమౌతోంది.
వాస్తవానికి ఆ ఫొటో బిజెపి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందినదని, బెంగళూరుది కాదని బైటపడడంతో పథకం బెడిసికొట్టింది.
అదేవిధంగా ఇటీవల పశ్చిమ బెంగాల్లో అల్లర్లు చెలరేగినప్పుడు మతతత్వ శక్తులు సోషల్ మీడియాలో రెండు పోస్టర్లను ప్రచారంలో వుంచాయి. ఒకటి కాలిపోయిన ఇళ్ల ఫోటో. దాని కింద ʹబెంగాల్ తగలబడుతోందిʹ అని రాసి వుంది. రెండవ ఫోటోలో అనేక మంది చూస్తుండగా ఓ పురుషుడు మహిళ చీర లాగుతున్నాడు. ఆ ఫోటో కింద ʹబదూరియాలో హిందూ మహిళలపై దాడిʹ అని రాసి వుంది. అయితే కొద్ది రోజుల్లోనే ఫోటోల వెనక దాగిన వాస్తవం బహిర్గతమైంది.
మొదటి ఫోటో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా 2002లో అల్లర్లు చెలరేగినప్పుడు తీసింది. రెండవ ఫోటో ఒక భోజ్పురి సినిమాలోనిది. ఇప్పటికీ వుంది. ఈ ఫోటోను బిజెపి సీనియర్ నేత విజేత మాలిక్ కూడా షేర్ చేసుకున్నారు.
ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు. బిజెపి మంత్రులు కూడా నకిలీ వార్తలను, కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు, ముస్లింలు త్రివర్ణ పతాకాన్ని తగలబెడుతున్న ఫోటోను నితిన్ గట్కరీ షేర్ చేసుకున్నారు. ఆ ఫోటో కింద ʹగణతంత్ర దినోత్సవం నాడు హైదరాబాద్లో త్రివర్ణ పతాకను దగ్దం చేస్తున్నారుʹ అని రాసి వుంది. గూగుల్లో కొత్తగా ఒక యాప్ వచ్చింది. దీని సాయంతో ఒక ఫోటోను ఎప్పుడు ఎక్కడ రూపొందించారో తెలుసుకోవచ్చు. ప్రతీక్ సిన్హా ఈ యాప్ను ఉపయోగించే ఆ ఫోటో ఎక్కడిదో తెలుసుకున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో నిషేధిత సంస్థలు నిరసన తెలుపుతున్నప్పుడు తీసినది.
ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కూడా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో ఆరితేరారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఓ ఫోటోను షేర్ చేశారు. భారత్ లోని 50,000 కి.మీ. రహదారులపై 30 లక్షల ఎల్ఈడీ లైట్లు కాంతులు చిమ్ముతున్నాయన్నది ఆ ఫోటో, శీర్షిక సారాంశం. అయితే, అది బోగస్ అని తేలిపోయింది. 2009లో జపాన్లోని ఓ వీధిలో తీసిన ఫోటో అది.
ʹఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన వంతెనʹ అంటూ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి రాజేశ్ మునాత్ ఓ ఫోటోను ప్రచారంలో పెట్టారు. దానికి 2000 లైకులు వచ్చిన తర్వాత అది నకిలీ అని తేలిపోయింది. వాస్తవానికది వియత్నాంలో నిర్మించిన బ్రిడ్జి. దాంతో, దానిని సోషల్ మీడియా నుంచి తొలగించక తప్పలేదు.
మా సొంత రాష్ట్రమైన కర్నాటకలో పుకార్లను ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలు ఏమాత్రం వెనకబడి లేరు. కర్నాటక ఎంపి ప్రతాప్ సిన్హా ʹటైమ్స్ ఆఫ్ ఇండియాʹ పత్రికలో ప్రచురితమైనదంటూ ఒక నివేదికను షేర్ చేశారు. ʹఒక హిందూ బాలికను ముస్లిం పొడిచి చంపాడుʹ అన్నది శీర్షిక. ఆ వార్తలో వాస్తవమెంత అనేది పరిశీలించకుండానే సిన్హా ప్రపంచానికి నీతి బోధ చేసే పనిలో పడ్డారు. ఒక్క పత్రిక కూడా ఆ విధమైన వార్తను ప్రచురించలేదు. వాస్తవానికి శీర్షికను ఫొటోషాప్లో మార్చి పెట్టారు. వార్తను కూడా మతపరమైన కోణంలో మలిచారు. అయితే ఈ విషయమై కలవరం రేగడంతో ఎంపీ ఆ అబద్దపు వార్తను తొలగించారు. అంతకు మించి... మత విద్వేషాన్ని రగిల్చే అబద్దాన్ని ప్రచారం చేసినందుకు ఆయన క్షమాపణలు చెప్పలేదు. విచారాన్నీ వ్యక్తం చేయలేదు.
నా స్నేహితుడు వాసు గుర్తు చేసినట్టు నేను కూడా ఈ వారంలో ఓ నకిలీ ఫోటో ను షేర్ చేశాను. అది పాట్నాలో ర్యాలీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ షేర్ చేసిన ఫోటో. నా స్నేహితులు శశిధర్ హెమ్మాడీ అది నకిలీ అని గుర్తు చేశారు. దాంతో, గ్రహించుకొని వాస్తవ ఫోటోలను జత చేసి నా తప్పును సరిదిద్దుకున్నాను. ఇదంతా కేవలం ప్రచారం కోసం కాదు. ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీ కరించాలన్నదే నా ఆకాంక్ష. చివరి మాటగా, తప్పుడు వార్తల్ని వెలికి తీసే ప్రతి ఒక్కరి కీ నమస్కరిస్తున్నా.. అటువంటివారు చాలామందే ఉన్నారని అనుకుంటున్నా..
(ప్రజాశక్తి పత్రిక నుండి...)
Keywords : gauri lankesh, karnataka, bengaluru, rss, bjp, hindutva
(2024-03-19 16:21:23)
No. of visitors : 3821
Suggested Posts
| గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన గౌరీ లంకేష్ ను మావోయిస్టులు హత్య చేశారని కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ ప్రజల పక్షాన హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పడాన్ని సహించలేని సంఘ్ పరివార్ శక్తులే ఆమెను హత్య చేశాయని.... |
| సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు..... |
| జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో...గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం...ఢిల్లీ నుండి కన్యాకుమారి దాకా మతోన్మాద హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో నిన్న మొదలైన ప్రదర్శనలు ఇవ్వాళ్ళ కూడా కొనసాగాయి. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ ,గుజరాత్, చండీగడ్, హైదరాబాద్ తో సహా అనేక చోట్ల ప్రదర్శకులు.... |
| నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్.. నినధించిన బెంగళూరుసీనియర్ జర్నలిస్టు, హిందుత్వ వ్యతిరేక పోరాట కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా మంగళవారం చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. నేను కూడ గౌరీ, మేము కూడ గౌరీ అనే నినాదాలతో బెంగళూరు దద్దరిల్లింది. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన .... |
| బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటలపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్కు ప్రతీకలా? |
| Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹThe Communist Party of India (Maoist) has rejected the ʹpropaganda by Hindu fascist forcesʹ that Kannada journalist Gauri Lankesh was killed by Maoists. It said that the ʹSangh Parivarʹ killed Lankesh to muzzle the voice of pro-people forces.
In a release issued by Abhay, spokesman for Central Committee of CPI (Maoist).... |
| మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు2013 ఆగస్టు 20 నుండి నరేంద్ర దభోల్కర్ హత్యతో మొదలై, 2015లో గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, 2017 సెప్టెంబరు గౌరీ లంకేశ్ (జర్నలిస్టు) హత్యతో హిందూ మనువాద ఫాసిస్టుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు హత్యలు.... హంతకుడు ఒక్కరే... అవే తుపాకీ గుళ్లు. ఈ దేశంలో మేధావులు తుపాకీ గుండ్లకు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు .... |
| హిందుత్వ శక్తులనుండి ప్రాణహాని ఉన్నగిరీష్ కర్నాడ్ సహా 25 మందికి ప్రభుత్వ భద్రతహిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీష్ కర్నాడ్, బార్గుర్ రమాచంద్రప్ప, కేఎస్ భగవాన్, యోగేష్ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్, చెన్నవీర కన్నావి, నటరాజ్ హులియార్, చంద్రశేఖర్ తదితరులకు పోలసుల రక్షణ కల్పించారు. ప్రత్యేక లింగాయత్ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్ ఎస్ఎమ్ జమ్దార్కు ప్రత్యేక రక్షణ కల్పించాలని.... |
| గ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసి... హైదరాబాద్ లో భారీ ర్యాలీబెంగుళూరు లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ʹగ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసిʹ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. టాంక్ బండ్ పైనున్న ముఖ్దుం మొయినుద్దీన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాదిమంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.... |
| మహిళలు రాత్రిపూట రోడ్డు మీదికి రావద్దట ! ప్రభుత్వం భద్రత కల్పించలేదట !అసలు మహిళలకు రాత్రి పూట పనేంటని ఎదురు ప్రశ్న వేశాడు కర్నాటక హోంమంత్రి రామలింగా రెడ్డి. కర్నాటక మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేశాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ మహిళ ఆఫీసుకు వెళుతున్న.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..