రాజకీయ ఖైదీల విడుదల కోసం దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మిద్దాం... మావోయిస్టు పార్టీ పిలుపు

రాజకీయ

ʹప్రజా వ్యతిరేక, ప్రభుత్వ అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా పోరాడే గొంతులను ప్రభుత్వం హత్యలు చేస్తోంది, అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్ళపాలు చేస్తోంది. జైళ్ళలో కూడా హింసలకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ ఖైదీల హక్కుల కోసం ప్రతీ ఒక్కరూ అండగా నిలవాలిʹ అని మావోయిస్టు పార్టీ ప్రజలకు విఙప్తి చేసింది . ప్రజలపై, ప్రత్యేకించి మహిళలపై పోలీసులు కొనసాగిస్తున్న హత్యలు, అత్యాచారాలపై గొంతెత్తితే.. అలాంటి వారిని అణచివేయడానికి యూఏపీఏ, ఏఎఫ్ఎస్‌పీఏ వంటి క్రూరమైన చట్టాల కింద కేసులు మోపి జైలు పాలు చేస్తోందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఆరోపించారు. విప్లవకారుడు జతిన్ దాస్ లాహోర్ జైల్లో 63 రోజుల పాటు భగత్‌సింగ్ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖైదీల హక్కుల కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు. సెప్టెంబర్ 13న జతిన్ దాస్ 98వ వర్ధంతిని జరుపుకుంటున్న సందర్భంగా మరో మారు రాజకీయ ఖైదీల హక్కుల కోసం ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జైళ్లలో బందీలుగా ఉండి కామ్రేడ్స్ సాగిస్తున్న పోరాటాలకు దేశవ్యాప్తంగా బలమైన రాజకీయ హక్కుల ఉద్యమాన్ని నిర్మించాలని ఆయన జగన్ పిలుపునిచ్చారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న‌ రాష్ట్రాల్లో సంఘ్ పరివార్‌కు చెందిన పలు ప్రతీఘాతుక సంస్థలు ఆవిర్భవిస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంస్థలు హిందూ రాజ్యస్థాపన పేరుతో గోరక్షణ, ఘర్‌వాపసీ పేరుతో దళిత, మైనార్టీ, ఆదివాసి విద్యార్థులు, మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని, కశ్మీర్, అసోం, నాగాలాండ్, మణిపూర్ వంటి చోట్ల తమ హక్కుల కోసం పోరాటాలు సాగిస్తున్న వారిని హింసాయుత పద్దతుల్లో అణచివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడుతున్న గూర్ఖాల్యాండ్, త్రిపుర వంటి చోట్ల ఉద్యమకారులను అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జైలు పాలైన వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడకు వచ్చినా.. వారి జీవనాన్నిగాడిన పెట్టుకునే విధంగా తీర్చిదిద్దే సంస్కరణ కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లు.. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం నాటి కౄరత్వాన్నే కలిగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. జైళ్ల స్థితిగతులపై 1983లో జస్టిస్ ముల్లా కమిటీ విడుదల చేసిన సిఫార్సులను ఇంకా అమలు చేయలేదని.. ఖైదీల హక్కుల పరిరక్షణ కోసం కొత్తగా ఏమీ చేయకపోగా.. ఉన్న హక్కులను హరించి వేస్తున్నారని మావోయిస్టు పార్టీ నేత జగన్ ఆరోపించారు. ప్రతీ ఏడాది జైళ్లలో దాదాపు 2000 వేల మంది ఖైదీలు మరణిస్తున్నారని.. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఖైదీల, ప్రత్యేకంగా రాజకీయ ఖైదీల, మహిళా ఖైదీల హక్కుల కోసం ప్రత్యేక ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్‌తో పోరాటాలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు.

Keywords : political prisoner, maoist party, jathin das, bhagat singh, bjp, rss
(2024-03-22 05:45:41)



No. of visitors : 1887

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాజకీయ