ఈ బీజేపీ మంత్రి బీకాంలో ఫిజిక్సే కాదు అధికార మదంలో గోల్డ్ మెడలిస్ట్ కూడా !

బీకాంలో ఫిజిక్స్ చదివిన రాజకీయ నాయకులు మనదగ్గరే కాదు దేశంలో చాలా మందే ఉన్నారు. తమ‌ అఙానమే సరైన ఙానమని వాళ్ళు మనను నమ్మమంటారు. కాదంటే అధికార మధంతో విరుచుక‌పడతారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ వెలగబెడుతున్న మంత్రి అరవింద్ పాండే తన అఙాన ప్రదర్శనతో ఆగకుండా తన అఙానమే అసలైన ఙానమంటూ విద్యార్థులముందే ఓ టీచర్ ను దారుణంగా అవమానించాడు.
విద్యాశాఖమంత్రి అయిన అరవింద్‌ పాండేకు అర్జెంట్ గా పాఠశాలలు సందర్శించి తన ఙాన ప్రదర్శన చేసుకోవాలన్న కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లోని గణితం బోధిస్తున్న టీచర్‌కు పరీక్ష పెట్టారు. తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ అని చెప్పగా ఠాఠ్ మైనస్ ఎట్లైవుతది ప్లస్ అవుతది . ఇది కూడా రాని నీవు లెక్కల టీచర్ ఎట్లైనవ్ అని హూంకరిచిండు. ఆ తర్వాత మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత అని ప్రశ్నించాడు. టీచర్ మైనస్‌ రెండు అని చెప్పగానే మంత్రి గారి కోపం నశాళానికిఅంటింది. దాని ఆన్సర్ సున్నా అని చెప్పిన మంత్రి విద్యార్థుల ముందే టీచర్ ను చెడామడా తిట్టిపోశాడు. ఆ టీచర్‌ను ఓ వారంపాటు స్కూల్ కు రావద్దంటు ఆదేశాలు జారీచేశాడు. ఈ బీజేపీ మంత్రి గారి ఙాన ప్రదర్శనపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఇంత గొప్ప ఙానులు... పైగా అధికారమదమెక్కిన అహంకారులు విద్యాశాఖ మంత్రులైతే ఇక విద్యార్థుల భవిశ్యత్తు ఏమవుతుంది ?

Keywords : Education Minister, Uttarakhand Minister, bjp, Arvind Pandey , teacher
(2024-04-24 19:26:03)



No. of visitors : 1595

Suggested Posts


Maoist posters in Nainital: Police conduct raids across district

District police have raided several locations, including the house of a research scholar, three days after a government vehicle was set on fire in Nainitalʹs Dhari village by persons suspected to have Maoist links...

పాలకుల అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టులపై రాజద్రోహం కేసులు...అరెస్టులు

ముఖ్యమంత్రి అవినీతిని బహిర్గతం చేసిన నలుగురు జర్నలిస్టులు ఉమేష్ శర్మ, రాజేష్ శర్మ, ఎస్పీ సెమ్వాల్, అమృతేష్ చౌహాన్ లపై రాజద్రోహం కేసు నమోదైంది.ఈ జర్నలిస్టులు తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని చార్జిషీట్ పేర్కొంది. జూలై 31 అర్ధరాత్రి రాజేష్ శర్మను ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ శర్మ సంబంధిత పత్రాలను ఉమేష్ శర

లాక్ డౌన్ కాలంలో పేదలకు ఆహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థి నేతపై కేసులు నమోదు

ప్రణాళిక లేని అనూహ్యమైన లాక్ డౌన్ తో దేశంలో పేదల, వలస కార్మికులతో సహా అనేక మంది ప్రజల జీవనం అస్థవ్యస్తమైంది. అనేక మంది ఆకలితో మాడి పోతున్నారు. ఈ నేపథ్యంలో వలస కూలీలకు, వేరే ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకు, పేదలందరికి ఆహారం అందించాలని డిమాండ్ చేసినందుకు ఓ విద్యార్థి నాయకుని పై కేసులు నమోదు చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు.

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో అగ్రవర్ణాల వారితో కలిసి భోజనం చేశాడ‌న్న కోపంతో ఓ అగ్రకుల మూక‌ ఓ దళితుడిని కొట్టి చంపింది.

అలా అయితే, మీరు వండితే మేమూ తినం - దళిత విద్యార్థుల తిరుగుబాటు

ఉత్తరాఖండ్ లోని ఓ స్కూల్ లో అగ్రవర్ణ వంటమనిషి వండిన భోజనాన్ని తాము తినబోమని భోజనాన్ని బహిష్కరించారు దళిత విద్యార్థులు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఈ