ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...

"వార్తలు.. విశ్వసనీయత"

ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ట్యాగ్ లైన్ "Because the truth involves us all".అప్పటి లక్ష్యం "వాస్తవం".కాలక్రమేణా వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా యుగం లో తెలుగు లో టీ వీ 9 " మెరుగైన సమాజం కోసం" అంటూ ముందుకొచ్చింది. అప్పటికే వచ్చిన ఆజ్ తక్ ఛానల్ "సబ్ సే తేజ్" అంటూ వేగం గా వార్తల ను అందించడం లక్ష్యం గా ఎంచుకున్నది. వాస్తవాలు ప్రధానం గా ఉన్న వార్తా సమాజం వేగం అనే ప్రాధాన్యత వైపు పయనించింది. ఆ క్రమం లో కొన్ని సార్లు విశ్వసనీయతసవాల్ ఎదుర్కునే స్థితిలోకి నెట్టివేయబడింది.
నాలుగు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సమాచారాన్ని ప్రచారం చేసారు. ఓ హిందీ చానల్ స్క్రీన్ పై బ్రేకింగ్ ప్లేట్ల మీద 100,50 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం జరిగిందని ప్రధాని మోడీ ప్రకటించినట్లు ఆ సమాచార సారాంశం. ఇలాంటి వార్తలు నమ్మడానికి సమాజం సిద్ధం గా లేదని ఆ రాత్రే అర్థమయింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దశలో వచ్చిన మార్ఫింగ్ తదితర ప్రక్రియల ఊతం గా ఇలాంటి గాసిప్ వార్త లు ప్రచారం చేయడం ఇప్పటి వేగ వార్తల లక్ష్యం గా మారింది. సామాజిక మాధ్యమాల్లో సంచలనాల ప్రాధాన్యత పెరిగిన క్రమం లో వాస్తవాలు-విశ్వసనీయత తీవ్ర వత్తిడిని ఎదుర్కుంటున్నాయి. ఇది ఇవాల్టి సమాజం. విలేకరులు కూడా ఆ వేగమనే భ్రమల్లో చిక్కుకుని చాలా సార్లు విశ్వసనీయత కు దూరమైన వార్తలు అందించాలనే ఆలోచనల్లోకి వెళ్ళే ప్రమాదం నెలకొంటున్నది.
హనుమకొండ నాగుల వీధి లో గొట్టిముక్కల శ్రీనివాస్ రావు గారుఅనే పెద్దాయన ఉండే వారు. సాంఘిక శాస్త్రాలలోలెక్చరర్ గా పని చేసిన ఆ సార్ ఇంగ్లీష్ లో మంచి రచయిత. ఆయన అప్పుడప్పుడు అదే వీధిలో ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయానికి వస్తుండే వాడు. ఆయన కొడుకు కాళిదాస్ మా మిత్రుడు విజయ్ ద్వారా మిత్రుడయ్యాడు. అలా ఆయన పరిచయం అయ్యారు. సార్ ద్వారా పత్రికల్లో ఎడిట్ పేజీ లో ప్రధాన వ్యాసం క్రింద, లేఖల కాలమ్ మీద .. ఈ రెంటికీ మధ్యలో ప్రచురితమయ్యే "మిడిల్స్" గురించి తెలిసింది. సార్ రాసే మిడిల్స్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సార్ రాసిన " స్లేట్ ఆన్ ద వాల్" మిడిల్ లో ఆయన వెలువరించిన అనుభవం కళ్లకు కట్టినట్లు వుంటాది. అది చదివిన తర్వాత మిడిల్ అనే పీస్ ఎంత గొప్పదో అర్థమయితాది. " సార్ తండ్రి ఫోటో వాళ్ళింట్లో వుండదు. అప్పుడు ఫోటో ల పట్ల శ్రద్ధ లేక పోవడం తో తీసుకునే అవకాశం లభించదు. ఆలోగానే ఆయన కాలం చేస్తారు. ఆయన ఫోటోలు లేక పోవడం వల్ల ఆయన జ్ఞాపకాలు కూడా భౌతికంగా మిగిలి వుండవు. ఆ దశలో సార్ తండ్రి వాడిన పలక వాళ్ల తండ్రి జ్ఞాపకం గా మారుతుంది. ఫోటో బదులు ఆ పలక ఈ గోడ కు వేసుకుంటారు. ఆ జ్ఞాపకం గురించి సార్ వివరించిన తీరు మిడిల్ గా ప్రచురితమయింది. గోడ కు వేలాడ దీసిన పలకనే వాళ్ల తండ్రి ముఖ చిత్రమయిందని..ఆయన చెప్పిన తీరు అద్భుతం గా వుంటుంది. మిడిల్స్ పట్ల తర్వాత కాలం లో ఆసక్తి కలిగేందుకు ఈ రచన చాలా ఉపయోగపడింది.
విశ్వసనీయత అంశం నుంచి వేరే అంశం వైపు, వేరే రచనా ప్రక్రియ వైపు వెళ్లాననిపిస్తున్నది. కానీ రోజూ చదివించడానికి విలేకరి గానీ, పత్రికా రచయిత గానీ పాఠకుని ముందు విభిన్న రచనా ప్రక్రియల వైపు దృష్టి సారించవచ్చనే వాస్తవం చెప్పడం కోసం ఆ ప్రయత్నం చేసాను. వార్నింగ్ పై వచ్చిన హెడ్డింగ్ ఓ రెండు రోజులు చర్చ గా సాగింది. వార్త దిన పత్రికలో అన్ని జిల్లాలలోకి వరంగల్, నిజామాబాద్ రెండు జిల్లాల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. అప్పుడు యాజమాన్యం , ఎడిటోరియల్ విభాగ రూప కల్పన చేసిన ఏ బీ కే ప్రసాద్ గారు గ్రామీణ విలేకరుల్లో మూడు నెట్ వర్క్ లను ఎంచుకున్నారు. అగ్రికల్చరల్ నెట్ వర్క్, కల్చరల్ నెట్ వర్క్, రెగ్యులర్ నెట్ వర్క్ ఈ మూడింటికీ ప్రతీ నియోజక వర్గ కేంద్రానికి ఒక రిపోర్టర్ చొప్పున వుండే వారు. మొఫసిల్ విభాగం లో ఈ మూడు అంగాలుండడం వలన వార్తల్లో వినూత్న ఒరవడులు సృష్టించ వచ్చని యాజమాన్య భావన.
ఆయా విభాగాల గ్రామీణ విలేఖరులు వార్తల విషయం లో పోటీ పడేవారు. ఈ పోటీ క్రమం లో నియోజక వర్గాల వారీగా వార్తలు సంఖ్యా పరం గా బాగా వచ్చేవి.
వార్తలు .. భాష గురించి మాట్లాడుకుంటున్నప్పుడే క్వార్క్ ఎక్స్ ప్రెస్ పేజీ మేకర్ ద్వారా పేజినేషన్ గురించి చెప్పుకోవాలి.తెలుగులో ఇది ఒక వినూత్న ఒరవడి. అప్పుడే ఫాంట్లు, రంగుల ప్రింటింగ్ ఇవన్నీ మా డెస్కులో చూడగలిగే అవకాశం వచ్చింది. మేం కొత్త కొత్త ఫాంట్ల లో స్లగ్గులు పెట్టాలని అనుకునే వాళ్లం. జకీర్ సార్ కు పల్లవి బోల్డ్ ఫాంట్ చాలా ఇష్టం. ఆ ఫాంట్ ఎంత ఎక్కువ పెద్దగా పెడితే పాఠకుడు అంత ఆసక్తి గా వార్త చదువుతాడని ఆయన అభిప్రాయం. ఫాంట్లలో భిన్నత్వం పేజీల రూపకల్పన లో అభిలషణీయమైన అంశం కాదని మాకు అప్పుడు తెలియదు. అందువల్ల వీలయినన్ని ఎక్కువ ఫాంట్లతో స్లగ్గులను నింపే వాళ్లం.
ఇక్కడ భాషలో గ్రామీణ విలేకరుల తొట్రుబాటు గురించి ఒక విషయం చెప్పుకోవాలి. అభివృద్ధి విషయం లో ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి చేర్చడం కోసం వార్త ఆరంభమయిన దశ లోనే నోడల్ అధికారుల వ్యవస్థ వచ్చింది. డేట్ లైన్ ఉదహరించడం వార్త రాస్తున్న విలేకరిని తక్కువ చేసి చూపడం అవుతుంది కాబట్టి ఆ విలేకరి వద్ద దొర్లిన తప్పు ను మాత్రమే ఉదహరించడం కొత్త తరాల విలేకరులు తమ రచనాసామర్థ్యాన్ని మెరుగు పరుచ్గుకునేందుకు ఉపయోగ పడుతుందని అప్పుడు దొర్లిన తప్పును ఇక్కడ చెబుతున్నాను. మానుకోట ప్రాంతానికి చెందిన ఓ మిత్రుడు తన వార్త లో రోజూ "న్యూడల్ అధికారి" అని రాస్తుండే వాడు. దీన్ని సవరించేందుకు ఆ విలేకరిని ప్రత్యేకించి వరంగల్ కు పిలుచుకోవాల్సి వచ్చింది. వార్తా రచనలో స్వతహా గా ఎదుగుతూ వచ్చిన దొంతు రమేశ్ తో ఇలాంటి భాషా తప్పిదాలను గురించి వార్తలో ఉన్నప్పుడు చర్చించేది.
వార్త నుంచి నేను బయటికి రావాలని కోరుకోవడానికి ప్రధాన కారణం యూనియన్ కార్యకలాపాల పై నాకున్న మక్కువ. ముందే చెప్పినట్లు జర్నలిజం లో నైనా , యూనియన్ లో నైనా దేవులపల్లి అమర్ నాకు స్ఫూర్తి. అందువల్ల వార్తా రచనను మెరుగుపరుచుకుంటూనే యూనియన్ ద్వారా గ్రామీణ విలేకరులతో పరిచయాలు పెంచుకోవడం అలాగే వాళ్ల బాగోగులను తెలుసుకోవడం నాకు ఇష్టమయిన అంశాలుగా మారాయి.
వార్తలో ఉన్న రోజుల్లో వరంగల్ ప్రెస్ క్లబ్ వైపు కూడా వెళ్ళలేనంత తీవ్ర వత్తిడి వుండేది. ఈ కారణంగా గ్రామాల లో పని చేస్తున్న ఇతరపత్రికల విలేకరులకు దూరమవుతానేమో అనే భయం ఆవరించుకున్నది. అప్పటికే వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం లో మేం నిర్ణాయక శక్తి గా మారిన దశ. అందువల్ల ఏదయినా కొత్త పత్రిక వస్తే బాగుండని చకోర పక్షిలా ఎదురు చూసా.
వార్త లో అనుభూతులు మిగిల్చిన అనుభవాలు లేకున్నా, చాలా సార్లు అక్కడి స్ట్రక్చర్ లో ఉన్న వైఫల్యం వల్లనే ఆ పత్రిక ఆశించిన స్థాయికి రాలేక పోయిందా అనే బాధ కలిగేది. రెండు పత్రికలంటే నాకు అమితమైన ఇష్టం. మొదటిది ʹఉదయంʹ.ఆ పత్రిక తెలుగు పాఠక లోకం ఎప్పుడూ మరవలేనంత సామాజిక దృక్కోణంలో వార్తలు ప్రచురించింది. ఆ పత్రిక చూపిన దిశ పాత్రికేయులు ప్రజా సమస్యలను వార్తల రూపం లో పెట్టడానికి ఉపకరించిందని చెప్పుకోవచ్చు.
ఇక్కడే ఓ విషయం చెప్పాలనిపించింది. అప్పట్లో కాశినాథుని నాగేశ్వర్ రావు పంతులు నిర్వహించిన "ఆంధ్ర పత్రిక " లో మా వూరి సమస్య అనే చిన్న కాలమ్ వచ్చేది. ఆ కాలమ్ లో మన ఊరి సమస్య కనుక ప్రచురితమైతే ఆ పత్రిక నెల రోజుల పాటు మనకు ఉచితం గా పంపే వాళ్లు. ఆ అవకాశం నాకు రెండు మూడు సార్లు లభించింది. అప్పుడు ప్రజా సమస్యపై పత్రికలు చూపిన శ్రద్ధ అలాంటిది. తెలుగు పత్రికలు రాజకీయ దృక్కోణాలుఎంచుకోనపుడు ప్రజా సమస్యల పై నిజంగానే దృష్టి సారించేవి. ఇప్పుడలా లేదని కాదు గాని విలేకరులు యాజమాన్యాల అభిరుచులకనుగుణంగా పని చేస్తున్నప్పుడు అది కొంత వరకు అసాధ్యం గా మారింది. ʹఉదయంʹదిన పత్రిక అయినా, సామాజిక దిశా నిర్దేశనం చేయగలిగే పాత్రికేయులను పెద్ద సంఖ్యలో తన ఉద్యోగులుగా చేర్చుకున్న ʹవార్తʹ దిన పత్రిక గానీ ప్రజా సమస్యలను వాస్తవాలను పాఠకులకు విరివిగా అందించగలిగాయి.
ʹవార్తʹ దిన పత్రిక వరంగల్ లో విశ్వసనీయత కు మారు పేరుగా నిలవడానికి ఆ పత్రికలో పనిచేసిన బ్యూరో తో బాటు అన్ని అంగాల ఉద్యోగులు తీవ్ర కృషి చేసారు. వత్తిడి వల్ల నలభై రోజులకే నేను బయటికి వచ్చి వేరే పత్రిక వెతుక్కోవాలని అనుకున్నప్పటికి అప్పటికే కవర్ చేసిన "ఉలిక్కిపడ్డ ఉల్లిగడ్డ దామెర" వార్త నాకు ఇప్పటికీ గుర్తుగానే నిలిస్తుంది. ఆ వూళ్ళో జరిగిన ప్రజా కోర్టుకు అప్పుడు అక్కడ పని చేస్తున్న దళం వచ్చింది. సమావేశం జరుగుతున్నది. అప్పుడు అన్నల దగ్గర ఉన్న బత్తి బాంబ్ ఒకటి ప్రమాద వశాత్తూ పేలింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. ఇది వార్త. దాని ఫాలో అప్ గా వచ్చిన వార్త "ఉలిక్కిపడ్డ పల్లె గురించి". ఈ వార్త లో సంచలనాలకు తావివ్వకుండా వివరించిన తీరు అప్పట్లో చర్చ గా మారింది. ఇదే దశలో మొగిలిచెర్ల వద్ద ఓ కానిస్టెబుల్ ను హతమార్చిన ఘటన, ప్రతీకారంగా అక్కడి ప్రజల డాక్టర్ ఆమెడ నారాయణ ను పోలీసులుగా అనుమానిస్తున్న వ్యక్తులు హత్య చేయడం ఒక దాని వెంట ఒకటి జరిగాయి. ఆ వార్త ప్రచురితమయ్యే రోజు వరకు నేను వార్త నుంచి బయటికి వచ్చి కొత్త పత్రికలో డమ్మీకి వార్తలు పంపుతున్నాను గానీ, అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని ఎలాగయినా ప్రస్తావించాలనిపించింది.
విశ్వసనీయత విషయాన్ని ప్రస్తుతించాలనే భావన తో ఇవ్వాళ్ల మొదలు పెట్టాను కానీ నిజంగానే కలగాపులగం గా , సమగ్రం గా రాయలేక పోయాను. వాస్తవానికి వార్త అనుభవాలు అనుభూతుల రూపం లో లేనంత వత్తిడి మా పై ఉండేది. ఆ కారణం గానే డెస్కులో ఉండే సృజన్, శేఖర్, విద్యాధర్ లు రోజూ ఎప్పుడు పేజీలు పూర్తవుతాయి ఎప్పుడు రూం కు వెళ్దామా అని ఎదురుచూసే వాళ్లు. శంకర్ రావు వరంగల్ వచ్చిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కొత్త గా వచ్చిన మునిరత్నం రెడ్డి గారికి రిపోర్టింగ్ పై ఉన్న ఆసక్తి డెస్కు పై ఉండేది కాదు. ఉదయం లో సార్ రిపోర్టర్ గా చేసాడేమో నాకు తెలియదు గానీ, అప్పటి వైస్ చాన్స్ లర్ వార్త కోసం ఓ రోజు సాయంత్రం జకీర్ సార్ ఆయన ను వెంట తీసుకెళ్లాడు. డెస్కుల్లో వున్నపుడు వార్తల సేకరణకు వెళ్ళే రిపోర్టర్ల పై నిజంగానే అక్కసు భావన ఉంటాది. ఆ నలభై రోజులూ నాదీ అదే బాధ.
-పీవీ కొండల్ రావు

Keywords : warangal, journalist, indian express, pv kondal rao
(2024-04-17 18:08:55)



No. of visitors : 1358

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమునివేళ్ల