ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 15...మెదక్ జిల్లా విలేకరుల‌ మరణ వాంగ్మూలం- పీవీ కొండల్ రావు

ʹమునివేళ్ల

ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం..

"బై లైన్లతో పరిచయాలు...ఎదురొడ్డే సంస్కృతి"

"బై లైన్లే బిర్యానీలు"అంటుండేవాడు జకీర్ సార్. ʹవార్త ʹ ఆరంభం లో గ్రామీణ జర్నలిస్టులకు టాబ్లాయిడ్ లో కూడా బై లైన్ లు ఇచ్చే విధానాన్ని ప్రోత్సహించారు. పేరుతో ఒక వార్త రావడం విలేకరిగా ఒక అదృష్టం గా భావిస్తుంటాడు వార్తా రచయిత. అలా బై లైన్ ల ద్వారా విలేకరులు పత్రికల్లో పరిచయమవుతారు. ఆంధ్ర ప్రభ నాడు రుద్రాభట్ల కిషన్ సార్ అయినా, రేపాక జైపాల్ రెడ్డి సార్ అయినా అలాగే పరిచయం అయ్యారు.ఇంగ్లీష్ పత్రికల్లో ప్రధాన రిపోర్టర్లంతా అలాగే పరిచయమయ్యారు. కొందరు విలేకరులను వాళ్ల బై లైన్ లు చూశాక చాలా రోజులకు చూడగలిగాను.

తెలంగాణ జర్నలిస్టులది మొదటినుంచీ ఎదురొడ్డే మనస్తత్వం. ప్రజల పక్షాన నిలుస్తూ ఎదిరించే సంస్కృతి. చాలా సార్లు యాజమాన్యాలు ఇక్కడి జర్నలిస్టుల వార్తల ఆధారంగా తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. అప్పుడు తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లాలో చిన్న పత్రికలు పెద్దసంఖ్యలో వచ్చేవి. ఆ పత్రికలలో ఒకటి ʹవేడిగాలిʹ. ఆ పత్రిక కొత్త ఒరవడికి నాంది గా నిలిచిందని అప్పట్లో అనుకుంటుండేవారు. జయపాల్ రెడ్డి సార్ వరంగల్ వచ్చిన రోజులలో అది మొదలైంది. గోదావరి జిల్లాల తర్వాత నల్గొండ, నిజామాబాద్ లలోనే చిన్న పత్రికల ప్రచురణలో పోటీ ఉంది.

నల్లగొండలో పత్రికల్లో ప్రజాపోరు, ప్రజా పోరాటం ప్రధానమైనవి. చిన్న పత్రికలు ఎక్కువగా ఉండడం వలన అప్పుడు ఆయా జిల్లాల్లో కొత్త జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో తయారయ్యేవారు. కరీం నగర్ జీవగడ్డ, వరంగల్ లోని వరంగల్ వాణి ఆ రెండు జిల్లాల్లో రెండు ప్రధాన పత్రికలు. ఉస్మానియా విశ్వ విద్యాలయం లో చదువుకోవడానికి వచ్చే వాళ్లలో నల్గొండ జిల్లా విద్యార్థులు ఎక్కువ కాబట్టి అక్కడి నుంచి పత్రికల్లో చేరే వాళ్లు గణనీయమైన సంఖ్యలో ఉండే వాళ్ళు. ఇక్కడ జర్నలిస్టు వృత్తిని యువత ఎంచుకోవడానికి చదువుల్లో అవకాశాలు ఒక కారణమైతే , ఉద్యమాల సంస్కృతి ఇంకో కారణం గా నిలిచింది.

జాకారం ఘటన నాటికి వరంగల్ జర్నలిస్టులు ఎదురొడ్డే సంస్కృతికిపర్యాయ పదం గా నిలిచారు. ఆ ఘటన లో బషీర్ లాంటి ఫోటోగ్రాఫర్ ల కెమెరాలను ధ్వంసం చేసినా, విలేకరుల పై ఆగ్రహం తో పోలీసులు ఊగిపోయినా ఆ నాటి వాస్తవాలను వెలువరించడం ద్వారా రాష్ట్రం లో ఓ కొత్త ఒరవడికి తెర తీసారు. జాకారం ఘటన తర్వాత ఖమ్మం జిల్లాలోని కరకగూడెంవద్ద జరిగిన ఘటన కూడా పాత్రికేయులను వార్త కోసం పోటీ పడేలా చేసింది. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పై నక్సలైట్లు మెరుపు దాడి చేసిన వార్త కోసం ʹవార్త ʹఫోటోగ్రాఫర్ లు ఇచ్చిన ఫోటో లు నేను వాడుకుని ఏ పీ టైమ్స్ కు వార్తలు పంపాను.

ఇవాళ నిజామాబాద్ తో మొదలవడానికి అక్కడి జర్నలిస్టుల్లో ప్రోధి చేసుకున్న పోటీ సంస్కృతి కారణం. ʹవార్తʹ దిన పత్రిక కు ముందే అక్కడ బై లైన్ల తో పరిచయమైన జర్నలిస్టుల్లో అంకం రవి, రేపాక జైపాల్ రెడ్డి మాత్రమే వుండేవాళ్ళు. ʹవార్త ʹలో పిట్టల రవీందర్ అక్కడ బ్యూరో గా పని చేసారు. ఆయనతో బాటు జమాల్ పూర్ గణేశ్ కూడా అక్కడ పని చేసాడు. గణేశ్ నా వరకు బై లైన్లతోనే పరిచయం. ఏ పీ టైమ్స్ లో మా ముగ్గురి తర్వాత నిజామబాద్ నుంచి లింగం, గోదావరిఖని లో పిట్టల రాజేందర్ చేరారు. కోల్ బెల్ట్ వార్తలకోసం మాత్రమే రాజేందర్ చేరడం తో కరీం నగర్ వార్త లను మొదట్లో నేనే రాసే వాడిని. అప్పుడు కరీం నగర్ జిల్లాలోని ఉల్లేపల్లి ఊరిలో దళం బస చేసిందని ఓ ఇంటిని చుట్టు ముట్టిన ఘటన ను వార్త రాసాం. కరీం నగర్ జిల్లాలో చిచ్చర పిడుగు గా పేరొందిన అనుపురం కొమురయ్య కోసం పోలీసులు చేసిన దాడి ఘటనను కూడా ఏ పీ టైమ్స్ కే రాసాను.

నిజామాబాద్ జిల్లాలో అప్పుడు సిర్నాపల్లి ఊరు పత్రికల్లో రోజూ పతాక శీర్షికగా ఉండేది. సిర్నాపల్లి దళానికి స్వామి కమాండర్ గా పని చేస్తూండేది. సిర్నాపల్లి రైల్వే స్టేషన్ పై అన్నలు అనేక సార్లు దాడులు చేసిన వార్తలూ వచ్చేవి. అందువల్ల ఆ దళం పోలీసులకు టార్గెట్ గా మారింది. ఆ దళం కోసం పిల్లుట్ల, పడకల్ గ్రామాలలో రెండు చోట్లా దాడులు నిర్వహించినట్లు గుర్తు. పడకల్ దాడి నుంచి స్వామి తప్పించుకున్నాడని అప్పటి కథనం. ఈ వార్తల కారణం గా కూడా నిజామాబాద్ విలేకరుల తో వార్తలు తెలుసుకునే పరిచయాలు ఉండేది.అప్పుడే నిజామాబాద్ లో సాయిలు కూడా యూనియన్ లో పరిచయం.

అన్నల వార్తలు ప్రధానం గా ఉన్న ఈ జిల్లాల్లో విలేకరులంతా ఎదురీదే సంప్రదాయంలో మమేకమైన వాళ్ళే. ఈ సంస్కృతి వల్ల పోలీసులనుంచి పాత్రికేయులకు వత్తిడులు ఉంటుండేది. మెదక్ జిల్లా జర్నలిస్టులు 51 మంది ఈ వత్తిడి ఎదుర్కున్న జాబితాలో ఉన్నారు. అప్పటి ఎస్ పీ వినయ్ కుమార్ సింగ్ అక్కడి జర్నలిస్టుల పై డెత్ వారంట్ జారీ చేసారు. కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నారు. ఈ ఘటన నేపధ్యం లో యూనియన్ లో కూడా యాక్టివ్ గా ఉన్న జర్నలిస్ట్ మిత్రులు విరాహత్, రామ లింగా రెడ్డి లతో పరిచయం ఏర్పడింది. అప్పటి పోలీసు ప్రయత్నాలను ఎదురొడ్డే రీతిలో మెదక్ జర్నలిస్టులు ప్రచురించిన మరణ వాజ్ఞ్మూలం రాష్ట్ర జర్నలిస్టు వుద్యమ చరిత్రలో అనిర్వచనీయమైనది.
ఉద్యమ వార్తలు, ఆ వార్తల సేకరణ , ఆ సందర్భం లో ఎదురైన వత్తిడులు ఇవన్నీ వరంగల్, కరీం నగర్, మెదక్, నిజామాబాద్ జర్నలిస్టులందరినీ ఒక గ్రూప్ గా ఎదిగేందుకు ఉపకరించాయి. యూనియన్ లో కూడా చాలా వరకు ఈ జిల్లాల జర్నలిస్టులు ఒకే అభిప్రాయం వెల్లడించే వారు.

ఏ పీ టైమ్స్ లో పని చేస్తున్న దశ లోనే ఓ సారి సిద్దిపేట లో నందిని సిధా రెడ్డి సార్ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి లైక్ మైండెడ్ పీపుల్ తో ఒక విస్తృత సమావేశం నిర్వహించారు. రాత్రి తెల్లవార్లూ జరిగిన ఆ సమావేశానికి వరంగల్ నుంచి పురుషోత్తం, రవి, జగన్, నేను, ఉమేశ్ , లతో బాటు గంగాధర్ సార్ ,కొందరు టీచర్లు హాజరయినట్లు గుర్తు. ఆ సమావేశానికి అన్ని జిల్లాలనుంచీ వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తరచి చెప్పిన వాళ్లంతా హాజరయ్యారు. భూమయ్య సార్, సిధా రెడ్డి సార్ లతో బాటు, కనకాచారి సార్, రాఘవాచారి సార్, తదితరులు మాట్లాడారక్కడ. విలేకరుల పక్షాన మెదక్ నుంచి విరాహత్,రామలింగా రెడ్డి,రంగాచారి, మంజీరా రచయితల సంఘం నుంచి దేశపతి శ్రీనివాస్ వచ్చారు.

ఏ పీ టైమ్స్ లో నాకు ఇవన్నీ వార్తలే. అన్నల వార్తలే వార్తలు గా రాస్తున్న క్రమం లో పోలీసు వార్తలకోసం, కనీసం పోలీసు ప్రెస్ మీట్ కు కూడా వెళ్లడం నాకెందుకో ఇబ్బంది గా అనిపించేది. నా వార్తల ను బాగున్నయని చెప్పే వాళ్లు గూడా నన్ను ఓ పాత్రికేయుడిగా చూడడానికి బదులు జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధి గా మాత్రమే చూసేవాళ్లు.

రాజకీయ విశ్లేషణ కోసం ఇతర పత్రికలకు నేను రాసిన వార్తలు చర్చనీయాంశాలయినా నా పత్రిక లో వచ్చే వార్తలెప్పుడూ అలా చర్చకు నోచుకోలేదనే బాధ నాకు ఇప్పటికీ ఉంది. ఏ పీ టైమ్స్ లో జిల్లాల సంబంధిత వార్తలవిభాగంలోఇక్కడి రాజకీయ ఆర్థిక, విద్య, పారిశ్రామిక వెనుక బాటు తనాలను తెలియబరుస్తూ పద్నాలుగు రోజుల పాటు నా బై లైన్ ల తో సీరియల్ వచ్చింది. ఈ సీరీస్ నా జర్నలిజం జీవితం లో మరిచిపోలేని వార్తా కథనం గా నిలిచింది.

నిజానికి ఏ పీ టైమ్స్ లాంటి పత్రిక లో లభించిన స్వేచ్ఛ ఒక ఎదగాల్సిన జర్నలిస్టును స్ఫూర్తిదాయక వార్తా రచన చేసేందుకు ఉపయోగపడుతుంది. నా వరకు అదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ సిద్దిపేట మీటింగ్ అనంతరం పీపుల్స్ వార్ పార్టీలో చర్చ గా మారింది. ఆ చర్చ నేపధ్యం లోనే పార్టీ తెలంగాణ పై తన వైఖరిని తెలుపుతూ ఒక డాక్యుమెంట్ తయారుచేసింది. ఆ డాక్యుమెంట్ ను కూడా నేను ఏడు రోజుల పాటు ఏ పీ టైమ్స్ లో సీరియల్ గా రాశాను. అప్పుడు డెస్కులో ఉన్న మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం నిజంగా మరువలేనిది. ఏ పీ టైమ్స్ఎడిటర్ గా ఉన్న సామ్ రాజప్ప నేనంటే ఇష్ట పడే వాడు. ఆ పత్రికలోనే నేను ఒక శనివారం స్పెషల్ లో జనార్ధన్ రావు సార్ సహకారం తో "వన్ ఆఫ్ సెవెంటీ "చట్టం పై ఎక్స్ క్లూజివ్ వ్యాసం రాయగలిగాను. సన్ డే స్పెషల్ లో వంగర గ్రామం పై ప్రత్యేక వ్యాసం, మరోసారి "వీ షల్ ఓవర్ కమ్" టైటిల్ తో అన్నల పై వ్యాసం రాయగలిగాను.

ఆంధ్ర ప్రదేశ్ టైమ్స్ పేపర్ లో జిల్లాలలో జీతాల పరిస్థితి ఎలా వున్నా జిల్లా వార్తలకు ప్రోత్సాహం బ్రహ్మాండంగా ఉండేది. అక్కడ పనిచేసిన మిత్రులంతా మాతో ఫ్రెండ్లీగా వుండే వారు.ఆ పత్రిక "Heralding winds of change" అనే ట్యాగ్ లైన్ తో వచ్చేది.నిజంగానే ఆ పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడే ఇంగ్లీష్ పత్రికల్లో మార్పును తీసుకొస్తూ వచ్చింది. ఆ పత్రిక అప్పటివరకూ హైదరాబాద్ లో ఏకచ్చత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న దక్కన్ క్రానికల్ కు వెన్నులో వణుకు పుట్టించిందంటే అతిశయోక్తి కాదు. విజయవాడ నుంచి ఈ పత్రిక లో పని చేసిన డానీ గారు ఇంటర్మీడియట్ ప్రశ్నా పత్రాల లీకేజీ వార్త రాస్తూ ఏకంగా పేపర్ ను మొదటి పేజిలో ప్రచురింప జేసారు. అప్పుడదో సంచలనం. అలాంటి సంచలనాల పత్రిక హఠాత్తుగా మూతపడింది. మాకు అందరికీ జిల్లాలలో అయితే అయిదు నెలల జీతాలివ్వలేదు.
ఈ లోగానే నేను నా ఏకైక మిడిల్ రాసాను. అది ఏ పీ టైమ్స్ మూత పడక ముందే ప్రచురితమైంది.

Keywords : journalists, pv kondal rao, warangal, medak, nizamabad, police, peoples war
(2024-03-25 15:29:15)



No. of visitors : 1283

Suggested Posts


 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"

ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం. అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...

గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావు

మహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"

నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న....

  ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావు

కిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావు

ఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు.....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావు

వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన...

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావు

మా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు....

 ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు

హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు.....

ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావు

అప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹమునివేళ్ల