మావోయిస్టు పార్టీకి పదమూడేండ్లు

మావోయిస్టు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై ʹసీపీఐ మావోయిస్టుʹ పార్టీ ఏర్పడిన రోజు. 2004లో ఏర్ప‌డిన మావోయిస్టు పార్టీ ఈ పదమూడేండ్ల‌ లో ఎంతో పురోగ‌తి సాధించింది. మావో చెప్పిన పార్టీ, ప్ర‌జా సైన్యం, ఐక్య సంఘ‌ట‌న అనే మూడు ఆయుధాల‌ను చేప‌ట్టిన మావోయిస్టు పార్టీ తెలంగాణ వంటి ప్రాంతాల్లో నిర్భందం వ‌ల్ల కొంత‌ వెన‌క్కి త‌గ్గినా మళ్ళీ ఆయా ప్రాంతాల్లో వేళ్ళూనుకునే ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఏవోబీలో బాక్సైట్ తవక్కానికి వ్యతిరేకంగా పోరాటాలు మాత్రమే కాక , కాఫీ తోటలను ఆదివాసులపరం చేయడం. విప్లవ సంఘాలను బలోపేతం చేస్తూ వర్గపోరాటాన్ని తీవ్రతరం చేశారు. మరో వైపు గెరిల్లా బేస్ ఏరియాల‌ను ఏర్ప‌ర్చుకొని మ‌రీ ప‌నిచేస్తోంది. దండ‌కార‌ణ్యంలో ప్ర‌త్యామ్నాయ అభివృద్ధిని అమ‌లు చేస్తూ, ప్ర‌జాపాల‌న‌ను నిర్వ‌హిస్తోంది. క్రాంతికారి జ‌న‌త‌న స‌ర్కార్ పేరుతో స‌మాంత‌ర పాల‌న సాగిస్తోంది. బీహార్, జార్ఖండ్, బెంగాల్ తో సహా కేరళ, తమిళనాడు, కర్నాటక ట్రై జంక్షన్ లోనే కాక వెస్టర్న్ ఘాట్స్ మొత్తంగా ఉద్యమం విస్తరించింది. పంజాబ్ , హర్యాణ లాంటి రాష్ట్రాల్లో మైదాన ప్రాంత ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసింది మావోయిస్టు పార్టీ. దేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో ఇతర వామపక్ష, దళిత, బహుజన, మైనార్టీ విద్యార్థిసంఘాలతో కలిసి యూనివర్సిటీలను కబళించజూస్తున్న సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా తీవ్రపోరాతాలు చేస్తోంది. అన్ని వ‌ర్గాలను ఐక్యం చేస్తూ ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లపై ప్ర‌జ‌ల‌ను క‌దిలిస్తోంది.

న‌క్స‌ల్బ‌రీకి యాబైయేండ్లు పూర్త‌వుతున్న‌ సంద‌ర్భం ఇది. ప‌శ్చిమ బెంగాళ్‌లోని డార్జిలింగ్ జిల్లా న‌క్స‌ల్బ‌రీలో పెల్లుబికిన భూస్వామ్య వ్య‌తిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త చూపినిచ్చింది. అలా 1969 ఏప్రిల్‌ 22న ఏర్పడ్డ సీపీఐ (ఎంఎల్‌) శ్రీకాకుళ‌, జ‌గిత్యాల పోరాటాల స్పూర్తితో దేశమంతా విస్త‌రించింది. 1980 ఏప్రిల్‌ 22న సీపీఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌గా ఏర్ప‌డింది. 1998లో సీపీఐ ఎంఎల్‌ (పార్టీ యూనిటీ) పీడబ్ల్యూలో విలీనమైంది. మ‌రోవైపు బెంగాల్, బీహార్ కేంద్రంగా భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటాలు నిర్వహించిన మావోయిస్టు క‌మ్యూనిస్ట్, 2003లో రెవెల్యూష‌న‌రీ క‌మ్యూనిస్ట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియాతో క‌లిసి ఎంసీసీఐగా ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో దేశంలో విప్ల‌వం విజ‌యం చేయ‌డానికి ఒకే ఒక ఐక్య పార్టీ అవ‌స‌ర‌మ‌ని భావించిన పీపుల్స్ వార్, ఎంసీసీఐతో జ‌రిపిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా 2004 సెప్టెంబర్ 21న సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఏర్ప‌డింది. మావోయిస్టు పార్టీ ఆవిర్భావాన్ని 2004 శాంతి చ‌ర్చ‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆ పార్టీ నాయ‌కులు రామ‌కృష్ణ‌, సుధాక‌ర్‌, గ‌ణేష్ తొలిసారి బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఈ ఐక్య‌తా కృషి మ‌రో అడుగు ముందుకేసి 2014 లో సీపీఐ ఎంఎల్‌ (నక్సల్బరీ) కూడా మావోయిస్టు పార్టీలో విలీనమైంది.

విప్ల‌వోద్య‌మాన్ని అణ‌చివేయ‌డానికి ప్ర‌భుత్వం చేపట్టిన సాల్వజుడుం వంటి ప్రైవేటు సాయుధ ముఠాల‌ ప్రయోగం ప్రజల సాయుధ ప్రతిఘటనతో విఫలమవడంతో ... మూడవ దశ గ్రీన్ హంట్ దాడిలో భాగంగా పాలకులు ల‌క్ష‌లాది బ‌ల‌గాల‌ను దండ‌కాణ్యంలో మోహ‌రించారు. ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ మూడ ద‌శ ముమ్మ‌రం చేసిన ప్ర‌భుత్వం మావోయిస్టు పార్టీని నిర్మూలించేందుకు ఆదివాసీల‌పై తీవ్ర అణ‌చివేత‌ను ప్ర‌యోగిస్తుంది. దండకారణ్యంలో సైన్యం స్థావరాలను ఏర్పాటు చేసి, డ్రోన్లు, మానవరహిత విమానాల సహాయంతో పార్టీ పై , ప్రజలపై దాడిని తీవ్రం చేశారు. ఇన్ని ఆటు పోట్ల మ‌ధ్య , పాలకుల దుర్మార్గమైన దాడులను ఎదుర్కొంటూ స్థిరంగా బలాన్ని పెంచుకుంటూ మావోయిస్టు పార్టీ నాయ‌క‌త్వంలో దండ‌కార‌ణ్యంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా విప్లవ శక్తులకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఒక ఆశాదీపంలా ఉంది.

Keywords : maoist, andhrapradesh, telangana, bengal, aob, bihar, jarkhand
(2024-03-25 20:21:15)



No. of visitors : 3086

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మావోయిస్టు