కంచె ఐలయ్య మీద రాజ్యం,సంఘపరివార్‌,ఆధిపత్య కులాల దాడిని ఖండిస్తున్నాం - విరసం

కంచె

(ʹకోమట్లు సామాజిక స్మగ్లర్లుʹ అనే పుస్తకం రాసినందుకు ప్రొఫెసర్ కంచె ఐలయ్య పై కొద్దిరోజులుగా జరుగుతున్న దాడి మీద విప్లవరచయితల సంఘం పత్రికా ప్రకటన పూర్తి పాఠం)

ప్రొఫెసర్‌ కంచె ఐలయ్యగారి మీద జరుగుతున్న దాడిని విరసం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కుల ఆధిపత్యం, దానికి కొమ్ముకాస్తున్న పాలకవర్గం, సంఘపరివార్‌ కలిసి చేస్తున్న దాడి తప్ప మరోటి కాదు. కంచె ఐలయ్య పీడిత, ఉత్పత్తి కులాల కోణం నుండి భారత సమాజాన్ని పరిశోధించి రచనలు చేస్తున్నారు. ఆయన విశ్లేషణా పద్ధతి మీద ఎవరికైనా విమర్శలు ఉండవచ్చు. విరసం కూడా ఆయన పరిశీలనా పద్ధతితో విభేదిస్తుంది. ఇది చాలా మామూలు విషయం. భావాలు సంఘర్షించాలి. అందులోనే సమాజ వికాసం ఉంటుంది. భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు.
వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, సామాజిక అణచివేతకు, అవమానాలకు గురవుతున్న సమూహాలు ఈ దేశ చరిత్రను, సాంఘిక వ్యవస్థను ఎలా చూస్తారో, ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించగలిగితే ఐలయ్య వంటి బహుజన మేధావుల స్వరంలోని ʹతీవ్రతʹ అర్థమవుతుంది. మన సమాజం ఉపయోగించే సాధారణ భాషలో, తిట్లలో, సామెతలల్లో దళిత, బహుజన కులాలను, స్త్రీలను అవమానించే వ్యక్తీరణలు ఎన్నో చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు నిండాలో. తరతరాలపాటు సామాజిక సంపదకు, విద్యకు, గౌరవప్రదమైన జీవితాలకు దూరం చేయబడిన సమూహాలు నోరుతెరిస్తే, తమ చరిత్రను తాము రాయను మొదలుపెడితే పచ్చిగా, చేదుగానే ఉంటుంది. అందులో ఎవరు ఎన్ని పరిమితులైనా చూపించవచ్చుగాని, అది సహజంగా వచ్చే ప్రతిక్రియ. ఇన్నేళ్లూ అన్నేసి తిట్లను పడ్డవాళ్లు తప్పకుండా అంటారు. ఇది ఒక్క ఐలయ్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని కులాల్లోని ఆలోచనాపరులు, ప్రజాస్వామికవాదులు ఎంతగా దీనిని అర్థం చేసుకుంటే సమాజ ప్రజాస్వామికీకరణకు అంతగా తోడ్పడినవాళ్లవుతారు.
ఇప్పుడు కోమటి కులం మీద చేసిన వ్యాఖ్యకు నొచ్చుకొని కంచె ఐలయ్య అనే వ్యక్తిపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహం పైకి కనిపిస్తోంది కాని దీనిని అంతమాత్రంగానే చూడకూడదు. అంతమాత్రమే అయితే రాజ్యం జోక్యం చేసుకొని ఒక రచన మీద, అంటే ఒక ఆలోచన మీద కేసు నమోదు చేసేదాకా పోదు. ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా ముందుకొస్తున్న అధిపత్య కులాలు, సంఘపరివార్‌లది మొత్తంగా పీడిత ప్రజల ప్రతిఘటనా చైతన్యాన్ని ఓర్వలేనితనమే. ఐలయ్య సందర్భాన్ని తక్షణంగా అందిపుచ్చుకున్నారుగాని కొంత కాలంగా అట్టడుగు కులాల నుండి పెరుగుతున్న సంఘటితత్వాన్ని, ప్రశ్నించేతనాన్ని దెబ్బతీయడానికి, కుల ఆధిపత్యాన్ని నిలిపి ఉంచడానికి పాలక వ్యవస్థ నుండి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధిపత్య కులాలు పీడిత కులాలకు ప్రతిగా సంఘటితం కావడం, సంఘపరివార్‌ రాజకీయాలు వారికి తోడవ్వడం ఇటీవల జరుగుతున్న ప్రమాదకరమైన పరిణామం. అందులో భాగంగానే ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా సంఘపరివార్‌ హిందుత్వను ముందుకు తీసుకొస్తోంది. ఆధిపత్యకులాలను ఒక మాట అంటే అది కులవ్యవస్థను ప్రశ్నించడం కాబట్టి హిందూ మతాన్ని టార్గెట్‌ చేయడంగా సంఘపరివర్‌ చెప్తుంది. హిందూ మతాన్ని ఏమన్నా అది దేశాన్ని అవమానించడమని, కాబట్టి దేశద్రోహమని కూడా అంటుంది. ఒక ఆదినారయణ రెడ్డో, ఒక చాగంటి కోటేశ్వరరావో దళిత బహుజనులను అవమానపరిస్తే రాజ్యం, సంఘపరివార్‌ జోక్యం చేసుకోవు. ముస్లింలను చంపుతున్నారు అంటే స్వయంగా ప్రధానమంత్రి కారు కింద పడ్డ కుక్క పిల్ల పోలిక తీసుకువస్తారు. స్త్రీల మీద జరుగుతున్న దాడుల ప్రస్తావన వచ్చనప్పుడు స్త్రీలను గురించి మంత్రులే ఎంత నేలబారుగా మాట్లాడతారో చూస్తున్నాం. గరగపర్రు, నేరెళ్ల వంటి కులరాజకీయాలను రాజ్యమే నడిపిస్తుంది. దళితులను పోలీసులే చిత్రహింసలు పెడతారు. వ్యవస్థపై అంతస్తులో ఉన్న వాళ్లు ఏమైనా మాట్లాడతారు. ఏమైనా చేస్తారు. దానికి వ్యతిరేకంగా లేచే గొంతు మాత్రం రాజద్రోహమవుతుంది. అంటే ఇది ప్రజల ప్రత్యామ్నాయ ఆలోచనల మీద, నిరసన స్వరం మీద, ప్రశ్నించే చైతన్యం మీద దాడి.
తక్షణం ఐలయ్య మీద కేసును విరమించుకోవాలి. ఆయనకే అపకారం జరక్కుండా ప్రభుత్వం తగిన ఆదేశాలివ్వాలి. సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే పరస్పర భావాలను చర్చించుకునే వాతావరణాన్ని, వేదికలను ఏర్పాటుచేయాలి.
-వరలక్ష్మి (కార్యదర్శి), పాణి, కాశీం (కార్యవర్గ సభ్యులు), వరవరరావు (సీనియర్‌ సభ్యులు)
విప్లవ రచయితల సంఘం

Keywords : kanche ailaia, virasam, varavararao, book, rss,
(2024-04-03 11:27:35)



No. of visitors : 1859

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కంచె