include 'men';
?>
దుర్మార్గ పాలన... తెలంగాణ పోరాటయోధులపై ప్రభుత్వ దాడులు, హింసలు -అనామిక
మార్పుకోసం సాగే ప్రతి పోరాటంలోనూ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అది బ్రిటీష్ వలసపాలన వ్యతిరేక పోరాటమైనా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమైనా. 1969 ఉద్యమం మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు విద్యార్థులే ముందునిలిచారు. సమస్తరంగాల ప్రజలతో కలిసి నడుస్తూ, త్యాగాలకు వెరవకుండా విద్యార్థులు సాగించిన పోరాట ఫలితంమే ప్రత్యేక రాష్ట్రం. ఉద్యమాన్ని ఎన్నికల పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకున్నప్పటికీ... ప్రత్యేక రాష్ట్రంలోనూ పోరాటం తప్పదని, ప్రజాస్వామిక తెలంగాణే తమ లక్ష్యమని ప్రకటించారు విద్యార్థులు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై కోస్తాంధ్ర పాలక వర్గాలు ప్రయోగించిన నిర్భందాన్నే ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు నిదర్శనమే.... ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడే నాయకుల అక్రమ అరెస్టులు, కిడ్నాప్లు. తెలంగాణ విద్యార్థి వేదికపై అమలవుతున్న దాడిని అందులో భాగంగానే చూడాల్సింది.
రెండు రోజుల క్రితం అర్థరాత్రి హైదరాబాద్లో తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, సభ్యుడు క్రాంతిలను కిడ్నాప్ చేసిన పోలీసులు వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ కేసులు మోపారు. ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంతో ఏర్పడిన టీవీవీ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. గత పదేళ్లుగా విద్యారంగ సమస్య పరిష్కారం కోసం నిరంతర పోరాటాన్నికొనసాగిస్తోంది. విద్యాను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలను బలిపెడుతున్న కార్పోరేటీకరణను వ్యతిరేకిస్తూ, అందరికీ సమాన విద్య కావాలని పోరాడుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే టీవీవీపై రాజ్యం కక్షగట్టింది. అందుకే... టీవీవీ సభ్యులపై అక్రమ కేసులు మోపి భయబ్రాంతులకు గురిచేయాలనుకుంటోంది. అందులో భాగంగానే టీవీవీ నాయకత్వాన్ని టార్గెట్ చేసింది. గతంలో మహేష్ని కిడ్నాప్ చేసిన పోలీసులు విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి రోడ్డుపక్కన వదిలేసి వెళ్లారు. మళ్లీ మరోమారు కిడ్నాప్ చేసిన పోలీసులు... తప్పుడు కేసులు మోపి జైలుకు పంపారు.
ప్రశ్నించే గొంతును నొక్కేసే విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజా సంఘాలపై తప్పుడు ప్రచారం చేస్తోంది. గతం లో మహబూబ్ నగర్ జిల్లాలో ఎనిమిది మంది టీవీవీ సభ్యులపై అక్రమ కేసులు మోపడం, శాతవాహన విశ్వవిద్యాలం నుంచి అర్థరాత్రి ఇద్దరు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్లడం, విరసం సభ్యుడు క్రాంతిని దౌర్జన్యంగా మఫ్టీలో ఉన్న పోలీసులు కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించడం, మవోయిస్టలతో సంబంధాల పేరిట ఇప్పుడు మహేష్, క్రాంతిల అరెస్టు.. ప్రశ్నించే గొంతును రాజ్యం ఎంత దారుణంగా అణచివేయాలనుకుంటే తెలియజెప్పే వాస్తవాలు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రజల హక్కుల్ని కాలరాయడం ఇవాల్టి విషాదం. ఒక వ్యక్తిని నిర్భందించినంత మాత్రాన ఉద్యమాలు ఆగవనడానికి.. మహేష్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆందోళనలే చిహ్నం. ప్రభుత్వాలు ఇప్పటికైనా పిరికి చర్యలు మాని విద్యార్థులు, హక్కుల కార్యకర్తలపై దాడులు మానుకోవాలి. ప్రశ్నను అణచివేయడం ఎప్పటికీ సాధ్యం కాదని తెలుసుకోవాలి.
-అనామిక
Keywords : telangana, trs, kcr, ktr, police, maoists, tvv, arrest
(2024-04-01 15:58:15)
No. of visitors : 1663
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. |
| కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసంకామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు.... |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| మార్చ్13 ఎంఆర్పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..