include 'men';
?>
చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి
మహిళల హక్కుల కోసంపోరాడుతున్న, మహిళల్లో చైతన్యం కోసం నిరంతరం పాటుపడుతున్న చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై చంద్రబాబు పోలీసులు విషప్రచారానికి పూనుకున్నారు. మహిళలు తమ హక్కుల కోసం పాలకులపై పోరాటాలు చేయడం తప్ప మరో దారి లేదని నమ్ముతున్న చైతన్య మహిళా సంఘం అంటే పాలకులకు వణుకు పుడుతోంది. అందుకే మహిళా కార్యకర్తలు మావోయిస్టులని, వారిమాటలు వింటే మహిళలు చెడిపోతారని చెబుతూ పోస్టర్లు వేస్తున్నారు . మహిళా కార్యకర్తల ఫోటోలతో కూడిన పోస్టర్లను ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాల్లో , నగరాల్లో మారు మూల గ్రామాల్లో అంటిస్తున్నారు. ఈ విధమైన దుర్మార్గమైన ప్రచారానికి నిరసనగా ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు పాలకులకు , దోపిడి దారులకు మద్దతుగా నిలబడి తమ నిజ రూపాన్ని బహిర్గత పర్చుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంఘాల ధర్నాకు రాకుండా ఎంత మందిని బెధిరించినా వందలాది మంది రావడం, ప్రదర్శన విజయవంతంగా జరగడంతో ధర్నాను ఫెయిల్ చేయడం కోసం ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
మరో వైపు పోలిసుల దుర్మార్గంపై విప్లవ రచయితల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. అరెస్టు చేసిన కార్యకర్తలందరినీ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విప్లవ రచయితల సంఘం ప్రకటన పూర్తి పాఠం...
బహుశా ప్రపంచంలో ఎక్కడా ఒక మహిళా సంఘం మీద ఇంత దుర్మార్గమైన దాడి జరిగి ఉండదు. మహిళా సంఘం నాయకుల ఫోటోలతో పోస్టర్లు, ఫ్లెక్సీలు వేసి వీళ్ళు రాక్షసులని, హంతకులని, మావోయిస్టులని, వీళ్ళను తరిమెయ్యాలని ప్రజాధనం వెచ్చించి ముసుగు సంఘం ఒకటి సృష్టించి ప్రచారం చేసి ఉండదు.
దీన్ని నిరసిస్తూ ప్రజాసంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే కిరాయి మనుషుల్ని పెట్టి పోటీ ధర్నా చేయించి స్వయంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టి ఉండదు. అది రెచ్చగొట్టినా రెచ్చిపోనందుకు అహం దెబ్బతిని మహిళల్ని కొట్టి అరెస్టు చేసి ఉండదు.
వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ, పచ్చి పితృస్వామిక భావజాలంతో నిస్సిగ్గుగా సామాజిక కార్యకర్తల ఫోటోల్ని అపద్ధపు సంఘాల పేర్లతో దొంగగా పోస్టర్లు వేసి టెర్రర్ సృష్టించే పని ఛత్తీస్ ఘడ్ లో జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పరాకాష్ఠకుబ్పోయింది.
చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాదుర్మార్గాన్ని భావజాలపరంగా, మానసికంగా, భౌతికంగా అనేక కొత్త పోకడలు పోయి అమలు చేస్తోంది. ఒకప్పుడు అది నయూమ్ ను సృష్టించింది. ఇప్పుడు చచ్చిపోయిన నయీమ్ కు ప్రాణం పోస్తోంది. ఇంకో దశకు అభివృద్ధి చెందిన ఫాసిజం ఇది. ఇది కనీస ప్రజాస్వామిక వాతావరణం కూడా లేకుండా చేస్తుంది. ఇప్పటికే చేసింది కూడా. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే తెలుగు రచయితలు, ప్రజాస్వామికవాదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దుర్మార్గంపై చైతన్యయుతంగా స్పందిస్తారని, ఈరోజు చైతన్య మహిళా సంఘానికి బాసటగా నిలిచిన ప్రజాసంఘాలతో కలిసి గొంతుకలుపుతారని ఆశిస్తున్నాం.
చైతన్య మహిళా సంఘంపై దాడులు ఆపాలి. అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకుల్ని, కార్యకర్తలను విడుదల చేయాలి.
-విరసం
Keywords : visakhapatnam, CMS, Maoists, police, arrest
(2024-03-28 13:13:21)
No. of visitors : 1785
Suggested Posts
| ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ముగ్గురు మహిళా మావోయిస్టులు వలసి @ రమే, వనతల లక్ష్మి @ సంగీత , కొర్ర దేవి @ సీతలను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులుప్రకటించారు.
|
| మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారుమనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం..... |
| అనారోగ్యంతో నడవలేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ ! నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదను సామ్రాజ్యవాద, కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల చట్టాలను తీసుక వచ్చి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నది. |
| ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూమనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు. |
| విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..