include 'men';
?>
మళ్ళీ రగులుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
రోహిత్ వేముల హత్య తరువాత రగిలిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ అగ్గి రాజుకుంది. ఈ సారి యూనివర్సిటీ పాలకవర్గం ఓ గిరిజనున్ని టార్గేట్ చేసింది. ఈ వివక్షకు వ్యతిరేకంగా టీవీవీ, ఏఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, డీఎస్యూ, బీఎస్ఎఫ్, సహా మొత్తం 15 విద్యార్థి సంఘాల మద్దతుతో గిరిజన విద్యార్థుల ఫోరం (టీఎస్ఎఫ్) రిలే నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులయ్యింది. విద్యార్థుల ఆందోళనను విరమింపజేయడానికి యూనివర్సిటీ పాలక వర్గం అన్ని వైపుల నుండి వత్తిడులు తెచ్చి విఫలమయ్యింది. కానీ వారి సమస్యను మాత్రం పరిష్కరించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అసలేం జరిగిందంటే...
సెప్టెంబర్ 21న యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అలియెన్స్ ఫర్ సోషల్ జస్టిస్ (ఏఎస్జే)కు చెందిన అభ్యర్థులు అన్ని స్థానాలనూ గెల్చుకున్నారు. తెలంగాణ, వామపక్ష, దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఈ కూటమిగా ఏర్పడ్డాయి.
బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అయిన ఏబీవీపీ ఓడిపోయింది. అయితే ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన టీఎస్ఎఫ్ అభ్యర్థి లంబాడా అయిన నరేశ్ లునావత్కు 75 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉందన్న ఆరోపణతో ఎన్నికైనట్టు ప్రకటించకుండా నిలిపివేశారు. ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి నుంచి ఫిర్యాదు అందడంతో యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విద్యార్థుల నిరసనలను పట్టించుకోని యూనివర్సిటీ అధికారులు ఇందుకోసం అక్టోబర్ 23న ప్రొఫెసర్ ఆలోక్ పరాషర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీని వేశారు.
యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే నరేష్ కు 75 శాతం హాజరు ఉన్నట్టు నామినేషన్ల సమయంలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెడ్ సంతకంతో ప్రమాణ పత్రం జారీ చేశారు.
నామినేషన్ల సమయంలో తగినంత హాజరు లేని కారణంగా దాదాపు 10 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. హాజరు 75 శాతం ఉన్న కారణంగా నరేశ్ నామినేషన్ అనుమతించారు. మరి ఏబీవీపీ పిర్యాదు చేయగానే 75 శాతంఉన్న నరేష్ హాజరు ఒక సారి 64 శాతం ఉన్నట్టు మరో సారి 71 శాతం ఉన్నట్టు ప్రకటించారు. ఏ దురుద్దేశం లేకుంటే అధికారులు ఇలా ఎందుకు చేశారని నరేష్ ప్రశ్న.
పది రోజుల్లో నిర్ణయం చెబుతామని అక్టోబర్ 23న చెప్పిన అధికారులు ఈ రోజుకు ఏ విషయం చెప్పకుండా సాగదీయడంలో లోగుట్టు ఏంటి ?
ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థుల వేళ్ళన్నీ వీసీ అప్పారావు వైపే చూపిస్తున్నాయి. ఏబీవీపీకి మద్దతుగా దళిత, బహుజనులకు, ఆదివాసులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న యూనివర్సిటీ పాలకవర్గంపై పోరాటం తప్ప మరో మార్గం లేదని విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి. నాలుగు రోజులుగా వెలివాడలో నిరహార దీక్ష చేస్తున్నారు.
Keywords : HCU, hyderabad central university, dharna, UoH
(2024-03-25 00:05:40)
No. of visitors : 1088
Suggested Posts
| రోహిత్ వేములా... . కాషాయ కూటమి పై మళ్ళీ నువ్వే గెలిచావు !హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మళ్ళీ కాషాయ పరివారం చిత్తుగా ఓడింది. ABVP, NSUI, ʹఅలయన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ʹ ASJ కూటమి మధ్య జరిగిన హోరాహోరా పోరులో ASJ... |
| HCU లో మళ్ళీ మరో దుర్మార్గం... 10 మంది విద్యార్థుల సస్పెండ్హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అగ్రహారంగా మారిందని మరోమారు రుజువైంది. తనిఖీ పేరుతో అర్థరాత్రి యూనిర్సిటీ హాస్టళ్లపై దాడులు జరిపిన అధికారులు 10 మంది విద్యార్థులను అకడమిక్స్, హాస్టల్స్ నుంచి బహిష్కరించారు. తప్పుడు ఆరోపణలతో ఏడుగురు విద్యార్థులపై ఆరునెలల పాటు సస్పెన్షన్ విధించిన అధికారులు మరో ముగ్గురి.... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..