include 'men';
?>
తెలంగాణలో మళ్ళీ తలెత్తుతున్న దొరల దోపిడీ దౌర్జన్యాలపై తిరుబాటు...ఛలో అభంగపట్నం
తరతరాలుగా తమను నీచంగా చూస్తున్న, తమపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న, దోపిడి చేస్తున్న దుర్మార్గులపై దళితులు ఎదురుతిరుగుతున్నారు. జగిత్యాల, సిరిసిల్లా బాటలో దొరల గడీల సంకెళ్ళు తెంచుకొని తలెత్తి నిలబడ్డ తెలంగాణ...ఇప్పుడు మళ్ళీ తలెత్తిన నయా దొరలపై తిరగబడుతున్నది. నక్సలబరీ ఉత్తేజంతో ... తెగించి దొరల దోపిడీ దౌర్జాన్యాలపై దండెత్తిన తెలంగాణ, పల్లె పల్లె ఎర్రజెండాలెత్తి దొపిడిని నిలువెత్తు పాతిపెట్టిన తెలంగాణ మళ్ళీ తెగిస్తోంది. పాలకుల మద్దతుతో కొత్త రూపాల్లో వస్తున్న కొత్త దొరలను తరిమి కొట్టేందుకు సిద్దమవుతోంది. అన్నలు లేరన్న ధైర్యంతో మళ్ళీ మొదలుపెట్టిన దొరల దోపిడీ దౌర్జన్యాలపై చైతన్యవంతమైన తెలంగాణ పోరులు తెగిస్తోంది. మంథని మధుకర్ హత్య, పెద్దపల్లి దళితులపై దాడి, సిరిసిల్ల దళితులపై దాడి చిత్రహింసలకు వ్యతిరేకంగా గళమెత్తిన తెలంగాణ ఇప్పుడు ఛలో అభంగపట్నం అంటూ పోరాటానికి సిద్దమవుతోంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలో బీజేపీ నాయకుడు భరత్ రెడ్డి దొరతనానికి వ్యతిరేకంగా దళితులు, ప్రజాస్వామికవాదులు ఏకమయ్యారు. ఊరి చెరువులో నుండి భరత్ రెడ్డి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు ఇద్దరు దళిత యువకులు కొండ్ర లక్ష్మణ్, బచ్చు రాజేశ్వర్ ల పై భరత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసి కర్రతో కొడుతూ చెప్పనలవికాని బూతులు తిడుతూ, ముక్కు నేలకు రాయించి, బురద నీటిలో ముంచుతూ తీవ్ర హింసలు పెట్టిన ఘటనపై భగ్గుమంటున్నారు దళితులు. భరత్ రెడ్డి చేసిన అమానవీయ దాడి విడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో దినపత్రికలు రాయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో దళిత సంఘాలు భరత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రదర్శనలు, రాస్తా రోకోలు, ర్యాలూ నిర్వహిస్తున్నారు. కొందరు దళిత , ప్రజాస్వామిక కార్యకర్తలు ఈ నెల 19 వతేదీన ఛలో అభంగపట్నం పిలుపునిచ్చారు. ఒకరినుండి ఒకరికి ఆపిలుపు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దళితులు, ప్రజాస్వామిక వాదులు 19 వ తేదీన పెద్ద ఎత్తున అభంగపట్నం తరలడానికి సిద్దమవుతున్నారు.
దొరతనానికి వ్యతిరేకంగా, దొరల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కులమతాలకు అతీతంగా కలిసి నిలబడ్డ అగ్ర కుల భూస్వాములపై అన్ని కులాలు చేతిలో చేయేసి తెగించి కొట్లాడిన తెలంగాణ ఇప్పుడు ఏమ్ చేయబోతున్నది ? అభంగపట్నంలో దళితులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా దళితులతో చేయికలిపి పోరాడటానికి సబ్బండ కులాలు, పేదలు ఐక్యంగా కదలడమా లేక దొరల రాజ్యాన్ని తిరిగి నిలబెట్టాలనుకుంటున్న దోపిడి దారులతో చేయి కలపడమా ? ఇప్పుడు దళితులతో నిలబడలేదంటే భరత్ రెడ్డితో నిలబడినట్టే. భరత్ రెడ్డితో నిలబడటమే కాదు మన నెత్తి మీద మళ్ళీ దొరల రాజ్యాన్ని ఎత్తుకున్నట్టే .
ఈ నెల 19 ఆదివారం ఛలో అభంగపట్నం
Keywords : telangana, dalits, abhangapatnam, nizamabad, kcr
(2024-03-19 00:17:02)
No. of visitors : 1632
Suggested Posts
| గూడ అంజన్నకు జోహార్లు !ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ.... |
|
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన... |
| జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి
ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు. |
| కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసంకామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు.... |
| సమైక్య సభలో తెలంగాణను నినదించిన శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందిసమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి.... |
| ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను.... |
| ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండాఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా... |
| మార్చ్13 ఎంఆర్పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటనఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్ ముట్టడి, పెరేడ్ గ్రౌండ్స్లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించారు. |
| కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు
ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..