include 'men';
?>
ఆంక్షల వలయాల్ని చేధించుకొని ఎగిసిన ఆశయాల జెండా
రాజ్య నిర్బంధాన్ని దిక్కరించి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మహా సభల్ని ప్రారంభించుకుంది. రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులతో గురువారం కరీంనగర్లోని టీఎన్జీవో హాల్లో టీవీవీ రాష్ట్ర 5వ మహాసభలు ప్రారంభమయ్యాయి. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ పతాకావిష్కరణ చేసి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు శంకర్రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు యత్నిస్తుందన్నారు. అందులో భాగంగానే టీవీవీ సభలను అడ్డుకునేందుకు యత్నించిందన్నారు. పోరాడి తెలంగాణను సాధించుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ విద్యార్థి వేదిక సమాన విద్య కోసం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం, మంచి సమాజం కోసం పోరాడుతోందని గుర్తుచేశారు. సామాజిక అసమానతలు తొలగాలని, కామన్ స్కూల్ విద్యా విధానం అమలు కావాలని కొట్లాడుతున్న సంస్థ నిర్బంధాన్ని ప్రయోగించడం అప్రజాస్వామికమన్నారు. విద్యారంగానికి బడ్జెట్ కెటాయింపులు తగ్గిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. అధికారంలో ఉన్నవాళ్లే వెలాసిటీ లాంటి కార్పోరేట్ సంస్థలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ విశ్వవిద్యాలయాలను మతోన్మాద రాజకీయాలకు కేంద్రంగా మార్చుతోందని ఆరోపించారు. సామ్రాజ్యవాదానికి మతం తోడవడం ఇవాళ విద్యారంగానికి పొంచివున్న పెద్ద ప్రమాదమన్నారు. పాలక విధానాల మూలంగా దళిత, ఆదివాసీ, మైనార్టీ, అట్టడుగు వర్గాలకు విద్య దూరమయ్యే ప్రమాదముందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలపునిచ్చారు. సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వాలు తాము రాసుకున్న రాజ్యాంగానే తామే గౌరవించడం లేదన్నారు. ప్రొఫెసర్ వనమాల మాట్లాడుతూ మహిళలకు సమానావకాశాలు కల్పిచని ఏ సమాజమైనా రోగగ్రస్తమైన సమాజమే అన్నారు. విద్యా ప్రైవేటీకరణ వల్ల ఎక్కువగా నష్టపోయేది మహిళలే అని, వాళ్లకు విద్య దూరమవ్వడంతో పాటు, గౌరవ ప్రదమైన జీవితం కూడా దూరమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కళ్యాణి లక్ష్మి వంటి పథకాలు అర్థం లేనివని, జీవితానికి పెళ్లే పరమావధికాదని, ప్రభుత్వాలు వాళ్ల ఆకాంక్షలు తెలుసుకొని వ్యవహరించాలని సూచించారు. ఆకుల భూమయ్య రాసిన శాస్త్రీయ విద్యా విదానం పుస్తకాన్ని ఈ సందర్భంగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, టీవీవీ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీవీవీ, ప్రజాకళామండలి కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు కొత్త ఉత్తేజాన్ని నింపాయి.
Keywords : tvv, telangana, police
(2024-03-21 09:03:29)
No. of visitors : 1516
Suggested Posts
| ʹపోలీసులు నన్ను చంపాలని చూస్తున్నారు, రక్షించండిʹ - హోం మంత్రికి విద్యార్థి నాయకుడి వినతితెలంగాణ పోలీసులు తనను హత్య చేయడానికి చూస్తున్నారని, తనను కాపడమని ఓ విద్యార్థి నాయకుడు రాష్ట్ర హోం మంత్రికి మొరపెట్టుకున్నాడు. తెలంగాన ఉధ్యమంలో ఆక్టీవ్ గా పాల్గొన్న ఆజాద్ అనే ఒస్మానియా యూనివర్సిటీ.... |
| జైల్లోనైనా సభలు జరుపుతాం : TVV అధ్యక్షుడు మహేష్టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ఉద్వేగపూరిత ఉపన్యాసం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీవీవీ తన లక్ష్య సాధనలో ఇంచుకూడా వెనక్కి జరగదని ప్రకటించారు. అవసరమైతే జైళ్లోనైనా సభలు జరుపుతాం తప్ప ఆగే ప్రసక్తి లేదన్నారు. టీవీవీ గత దశాబ్ద కాలంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకొచ్చిందని, మిలియన్ మార్చిని రూపకల్పన చేసిన ఘనత టీవీవీదని గుర |
| పోలీసు సంస్కృతి చెల్లదు : టీవీవీ మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్మెజార్టీ ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే కొద్ది మంది గుప్పిట్లో మొత్తం సంపదను పోగుచేసుకున్న అసమ సమాజంలో టీవీవీ సమానత్వం కోసం పోరాడుతోందన్నారు. అలాంటి సంస్థపై నిర్బందాలను ప్రయోగించడం వల్ల శాంతి నెలకొనదని, పోరాటాలు మరింత తీవ్రమవుతాయని అన్నారు. |
| నిర్బంధాలు గడ్డిపోచతో సమానం : టీవీవీ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి టీవీవీ రాష్ట్ర మహాసభల్లో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రథమిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ద్రోహి అని ఆరోపించారు. అందరికీ విద్య అందించమని, అంటరానితనాన్ని రూపుమాపాలని, ఉద్యోగాలు కల్పించాలని అడుగుతున్న విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించడం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఉల్లంఘించడమే అన్నారు. ప్రభుత్వ నిర్బందాలు తమకు |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..