హిందూ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని చాటి చెప్పేందుకే త్రిబుల్ తలాక్ బిల్లు - మావోయిస్టు పార్టీ
బ్రాహ్మణీయ హిందూ ఆధిపత్య భావజాలాన్ని కలిగి ఉన్న భారత పాలకవర్గాలు 1947 అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం ప్రజలను రెండవ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారు. 1947 నుండి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలలో హిందూ మతోన్మాదులు సృష్టించిన - 1984లో మూడువేల మంది సిక్కుల ఊచకోత, 2002లో రెండు వేలకు పైబడి గుజరాత్ ముస్లిముల ఊచకోతలు వంటి మారణకాండలలో లక్షలాది మంది ప్రజలు హతమయ్యారు. ఆస్తులు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అనేక మంది అత్యాచారాలకు బలై అవమానాలతో జీవిస్తున్నారు. వీరిలో ముస్లిములే అత్యధికం. దీనితో ముస్లిం ప్రజలు భయం గుప్పిట్లో రోజు ఒక గండంగా జీవిస్తున్నారు. అంటే కాంగ్రెస్, బీజెకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా హిందూ మతోన్మాద దాడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో 2014లో హిందూ ఫాసిస్టుగా పేరుమోసిన మోడీ నేతృత్వంలో హిందుత్వ శక్తులు గద్దెనెక్కిన మరుక్షణం నుండి ముస్లిం మతస్తులపై వివిధ రూపాల్లో దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. హిందూ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో గోరక్ష, ఘర్ వాపసీ, లవ్ జిహాద్, దేశభక్తి, మనువాదం పేరుతో గత మూడు సంవత్సరాలుగా ముస్లిం, క్రిస్టియన్, దళిత, ఆదివాసి, మహిళలు, విద్యార్ధులు తదితర సెక్షన్ల ప్రజలపై దాడులు చేస్తూ హిందూ ఫాసిస్టు శక్తులు దేశంలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు దూకుడుకుగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఫాసిస్టు శక్తుల అధిపత్యాన్ని చాటిచెబుతూ ముస్లిం ప్రజల మనోభావాలను కించపరుస్తూ కుట్రపూరితంగా ముందుకు తెచ్చినదే తలాక్-అల్-బీదాత్ (ముమ్మారు తలాక్) బిల్లు, ముస్లిం ప్రజలతో సహా అన్ని పీడిత వర్గాలకు, సెక్షన్లకు అండగా నిలిచి ఇలాంటి దాడులన్నింటినీ ప్రతిఘటించి ఓడించడమే నేడు ఈ దేశ పీడిత వర్గాల, సెక్షన్ల, పీడిత జాతుల, ప్రజాస్వామిక, లౌకికవాదులందరి ముందున్న కర్తవ్యంగా మా పార్టీ భావిస్తోంది. అందుకు ఉద్యుక్తులు కావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నది.
2017 శీతాకాల పార్లమెంటు సమావేశాలలో మోడీ ప్రభుత్వం ʹముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులివ్వడం కోసం మూడు సార్లు తలాక్ చెప్పే ఇస్లాము సంప్రదాయాన్ని శిక్షార్హమైన నేరమని చెప్పేʹ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో వీగిపోయింది. ఈ బిల్లు విషయంలో పార్లమెంటు పార్టీల మధ్య స్వల్పమైనవి తప్ప మౌలిక విభేదాలు ఏమీ లేవు. పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ముస్లిం స్త్రీ-పురుషుల జీవితాలతో ముడిపడిన ఒక గంభీర సమస్యను కేవలం భరణ పోషణకు కుదించి తన్నులాడుకోవడం పార్లమెంటు ʹఅఖాడా (మల్లయుద్ధ పోటీ స్థలం)కు కొత్తేమీ కాదు. ఇవి దేశ ప్రజల ప్రత్యేకించి ముస్లిం ప్రజల మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించే ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరేమీ కాదు.
దేశంలో ప్రతి పది మంది ముస్లిం మహిళలలో ఒకరు ముమ్మారు తలాక్ పీడితులేనని చెబుతున్న మోడీ ప్రభుత్వం వారి మౌలిక సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. నిజానికి ఈ దేశంలో ముస్లిం ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితులలో జీవిస్తున్నారా 2006లో వెలుగు చూసిన జస్టిస్ రాజేంద్ర సచ్చర్ కమీషన్ రిపోర్టు చూస్తే తెలుస్తుంది. దేశ సగటు సాక్షరతతో పోలిస్తే వారి పిల్లలకు చదువే మృగ్యమవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 6-14 సంవత్సరాల లోపు ముస్లిం పిల్లలతో నాల్గవ వంతు పిల్లలు బడి ముఖం చూడడం లేదు. 17 శాతం మించి పిల్లలు మెట్రిక్ దాటడం లేదు. ముస్లిములలో కేవలం 4.9 శాతమే ఉద్యోగం చేస్తున్నారు. అదీ కింది శ్రేణి ఉద్యోగాలే. 6ఏఎస్, ఐపీఎస్ లాంటి భారతీయ సేవలలో మూడు శాతానికి మించి లేరు. పోలీసు ఉద్యోగాలలో 6 శాతం ఉన్నారు. ఇలా ఏ రంగంలో చూసినా వివక్ష కొనసాగుతూనే ఉంది. వీటన్నింటినీ పక్కనబెట్టి ముమ్మారు తలాక్ చట్టాన్ని తీసుకొని రావడం ద్వారా హిందుత్వ శక్తులు తమ ఆధిపత్యాన్ని చాటిచెప్పుకోవాలని చూస్తున్నాయి. ఆ దిశలో రానున్న లోక్సభ బడ్జెట్ సమావేశాలలో ఆర్డినెన్స్ తేవడానికి సిద్దమవుతున్నాయి.
ఏకపక్షంగా ముస్లిం పురుషులు తమ జీవిత సహచరికి ఒకే విడుతలో ముమ్మారు తలాక్ చెప్పడం అప్రజాస్వామికం అనడంలో సందేహమేమీ లేదు. తలాక్-ఇల్-బీదాత్ అనేక ముస్లిము దేశాలలో ఎప్పుడో నిషేధించబడింది. 1964లోనే పాకిస్తాన్లో మునమరు తలాక్ ను నిషేధించారు. ముస్లిం దేశాలైన ఈజిప్టు, సూడాన్, జోర్డాన్, సిరియా, ఇరాక్, మొరాక్ దేశాలలో మున్మూరు తలాక్ అనేది ఖురాన్ సంప్రదాయంలో లేదంటూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఇస్లాంలో సున్ని తెగకు సంబంధించిన అల్-ఎ-హుర్రియత్ శాఖ కూడా తలాక్-అల్-బీదాత్మను వ్యతిరేకిస్తున్నది. అయితే మన దేశంలోని ముస్లిం ప్రజలు తమ మత విశ్వాసాలను అనుసరించి ముమ్మారు తలాక్ ను పాటిస్తున్నారు.
అయితే ముస్లిం సమాజంలో ప్రజాస్వామిక భావాలు గల మహిళలు ముమ్మారు తలాక్ పద్ధతిని వ్యతిరేకిస్తూ చాలా కాలంగా వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. వివిధ ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులు ఈ పోరాటాలను బలపరుస్తూ వస్తున్నాయి. ఈ పోరాటాలను మా పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. అయితే ముమ్మారు తలాక్ పద్ధతిని రద్దు చేయాలనే డిమాండును ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలే పరిష్కరించుకోవాలి తప్ప బ్రాహ్మణీయ హిందుత్వ పాలకవర్గాలు ఈ సమస్యను ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించలేవు. ప్రజాస్వామిక, లౌకిక శక్తుల అండతో ముస్లిం మహిళలు ఈ పోరాటాలను మరింత విస్తృతంగా కొనసాగించడం ద్వారా మతపరమైన మూఢ విశ్వాసాల నుంచి బయటపడేలా ప్రజలను చైతన్యపరచాలి.
ప్రజాస్వామిక భావాలు, సంస్కృతిని అభివృద్ధి చేయడం ద్వారానే మహిళలను రెండవ తరగతి పౌరులుగా పరిగణించే పితృస్వామిక భావజాలం నుంచి ప్రజలను చైతన్యపరచడం సాధ్యమవుతుంది. ఈ విధంగా మాత్రమే మహిళల ప్రజాస్వామిక స్వేచ్చను, హక్కులను హరించి వేసే ముమ్మారు తలాక్ వంటి సమస్యలను ప్రజలు స్వతంత్రంగా పరిష్కరించుకోగలుగుతారు.
సామ్రాజ్యవాదుల దన్నుతో దేశ పాలకవర్గాలైన దళారీ నిరంకుశ బూర్జువా , బడా భూస్వామ్య వర్గాలు దేశంలో అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తూ భౌతికవాదం, సామ్యవాదం పేరుతో అభివృద్ధికి ఆటంకంగా మారాయి. ప్రజలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అణచివేసేందుకు మతాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఏ మతమైనా పితృస్వామిక భావజాలాన్ని పైకెత్తుతూ మహిళలకు రెండవ తరగతి పౌరుల స్థానాన్ని కల్పిస్తుంది. చారిత్రకంగా మతాలన్నీ దోపిడీ వర్గాలకు సేవ చేసేవిగా, అభివృద్ధి నిరోధకంగానే ఉన్నాయి. అవి ప్రజలలో భావవాద దృక్పథాన్ని పెంచి పోషిస్తూ వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందకుండా అడ్డుకుంటూ వస్తున్నాయి. ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ పాలక హిందూ ఫాసిస్టు శక్తులు మొసలి కన్నీరు కారుస్తున్నారు గానీ, మను ధర్మశాస్త్రం కింద నలిగిపోతున్న హిందూ మహిళల విషయాన్ని గురించి మాట్లాడడం లేదు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మరణించే వరకూ ఏ మతమైనా మహిళను పురుషునికి బానిసగానే పరిగణిస్తున్నది. దేశంలో ఇప్పటికీ పెద్దెత్తున సాగుతున్న బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, వరకట్న హత్యలు, పరువు హత్యలు, క్రూరమైన గృహ హింస మొదలైన వాటికి వివిధ మతాల పితృస్వామిక భావజాలమే ప్రధాన కారణం. దేశంలో బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామిక వేదికల్లో వీటిపై ఎన్ని చట్టాలు చేసినా అవి ప్రజల కంటితుడుపు చర్యలే గానే మిగిలిపోయాయి. నేడు ప్రతిపాదిత తలాక్ చట్టం కూడా ముస్లిం మహిళల కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదు. | ఉత్తరాఖండ్ కు చెందిన సైరా బానా, రాజస్థానకు చెందిన అఫ్రీన్ రహమాన్, పశ్చిమ బంగకు చెందిన ఇస్రత్ జహాన్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహిళలు గావచ్చు కానీ ఎక్కనివారు ఎందరో ఉంటారు. మనువును మించిన అపర మనువులున్న బ్రాహ్మణం, ఇస్లాం, క్రైస్తవ మతాలేవైనా మహిళను రెండవ శ్రేణి పౌరురాలుగానే చూస్తున్నంత కాలం మహిళలు పితృస్వామ్య కాడి కింద నలుగుతూనే ఉంటారు. హిందూ వివాహ చట్టాన్ని సవరిస్తూ తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు వాటా కల్పించినంత మాత్రాన ఏ తండ్రి చట్టాన్ని గౌరవిస్తున్నాడు? బాల్య వివాహాలు, వరకట్నాలు ఏ చట్టం ప్రకారం నడుస్తున్నాయి? 2011 జనాభా లెక్కలలో దేశంలో 55 లక్షల బాల్య వివాహాలు నమోదయ్యాయి. మహిళ తన గర్భాన్ని ఉంచుకోవాలా, లేదా అన్న విషయంలో భర్త అనుమతి మహిళకు అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పినా ఏ మహిళకు ఆ స్వేచ్ఛ ఉంది? మధ్యప్రదేశ్ ప్రభుత్వం 12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారానికి-హత్యకీ పాల్పడితే మృత్యుదండన విధించాలంటే అత్యాచారాలు అరికట్టబడినాయా? 15 సంవత్సరాల భార్యతో కాపురం చేయడం నేరం అని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే హిందుత్వ సంస్థ రాష్ట్ర సేవికా సమితిల (ఆర్ఎస్ఎస్) ʹభర్త భార్యను రేప్ చేయడమేంటి?ʹ అంటూ తన కుటుంబవాదాన్ని, మనువాదాన్ని ప్రచారం చేయడం మానుకుందా? మన దేశ రాజ్యాంగంలో రూపొందించబడిన హిందూ, ముస్లిం మత ప్రైవేటు చట్టాలను సైతం ఉల్లంఘిస్తూ దేవాలనుకుంటున్న ప్రాతిపాదిత నేటి ముమ్మారు తలాక్ చట్టం గతి కూడా ఇంతకంటే మరో రకంగా ఉండబోదు. చట్టాలు, కోర్టులతో ప్రజలను మూర్ఖులను చేసి పాలకవర్గాలు తమ పాలనను సాగించాలనుకొంటారు. వాస్తవంగా ప్రజలను మతమౌఢ్యానికి వ్యతిరేకంగా చైతన్యపర్చకుండా వారిని మత విశ్వాసాల నుండి బయటకు తేలేరు. స్త్రీకి తన పెళ్లి, విడాకులు, పిల్లలపై అధికారం, గర్భధారణ లాంటి విషయాలలో స్వతంత్రత లేకుండా సంపదపై అధికారం, సమాన పనికి సమాన వేతనం, చట్టాలలో సమానత్వం లాంటి రాజకీయ హక్కులను ఈ దోపిడీ వ్యవస్థలో ఊహించలేం. ఇవేవీ లేకుండా కేవలం విడాకులను విడదీసి సమస్యగా మార్చి, ముస్లిం ప్రజలలో చీలికలు తెచ్చే హిందుత్వ పన్నాగాలను ఖండించాలి. ఓడించాలి. ముస్లిం మహిళల ప్రజాస్వామిక హక్కులన్నింటినీ ఎత్తిపడుతూ స్త్రీ-పురుష సమానత్వం కోసం, దోపిడీ విముక్తి కోసం పోరాడాలి.
ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక, లౌకికవాదులారా! అయోధ్యలో రామాలయ నిర్మాణం, కామన్ సివిల్ కోడ్ ను అమలు చేయడం, 370 ఆర్టికల్ రద్దు అనేవి తొలి నుండి హిందూ ఫాసిస్టు శక్తుల ఎజెండాలో ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. నీథకానికి పితృస్వామ్య భూస్వామ్య బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి ప్రాతినిధ్యం వహించే మోడీ ప్రభుత్వానికి గానీ, హిందుత్వ శక్తులకు గాని ముస్లిం మహిళల స్వేచ్చ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే దేశంలో సగభాగంగా ఉన్న మహిళలపై పితృస్వామ్య దోపిడీ, అణచివేత, వివక్షలకు హిందుత్వ శక్తులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. ముస్లిం మహిళల పాలిట అప్రజాస్వామికంగా ఉన్న ముమ్మారు తలాక్ విధానాన్ని గానీ, ఈ దేశంలోని వివిధ మతాలకు చెందిన మహిళలపై కొనసాగుతున్న పితృస్వామ్య దోపిడీ, అణచివేత, వివక్షలను రూపుమాపడం గాని ఈ దేశ దోపిడీ పాలకవర్గాలకు సాధ్యం కాదు. అందుకనే, రండి! దేశంలో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలను కూలదోసి పీడిత వర్గాలపై సాగుతున్న దోపిడీ, పీడనలతో సహా మహిళలపై అన్ని రకాల వివక్షలనూ నిర్మూలించేందుకూ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం. భారతదేశంలో అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, దాని స్థానంలో కార్మిక-కర్షక మైత్రి పునాదిగా, నాలుగు వర్గాలకు - కార్మికులు, రైతులు, పట్టణ పెటీబూర్జువాజీ, జాతీయ బూర్జువా - ప్రాతినిధ్యం వహించే ఫెడరల్ ప్రజాస్వామిక రిపబ్లికను స్థాపించేందుకు దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాలో పురోగమిద్దాం.
అభయ్, అధికార ప్రతినిధి
కేంధ్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : triple talaq, bjp, hindutva, rss, muslims, india
(2024-03-23 16:06:40)
No. of visitors : 1663
Suggested Posts
0 results