include 'men';
?>
గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు
అక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు.
ఇది నాలుగు రోజులుగా త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ పాల్పడుతున్న అరాచక హింసోన్మాదం.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఐపీఎఫ్టీ కార్యకర్తల విధ్వంసకాండతో అట్టుడుకుతున్నది. లెఫ్ట్ కార్యకర్తలు, ప్రత్యేకంగా సీపీఐ(ఎం) కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని హిందూత్వవాదులు, వేర్పాటువాదులు మూకుమ్మడిగా రెచ్చిపోతున్నారు. ధలై జిల్లాలోని కమల్పూర్లో 19 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అక్కడ సీపీఐ(ఎం) కార్యదర్శి నివాసంతో సహా అనేక ఇండ్లను తగులబెట్టారు. ఫలితాలు వెలువడిన ఒక్క శనివారం రోజునే తమ కార్యకర్తలతోపాటు, పార్టీ కార్యాలయాలపై విధ్వంసానికి సంబంధించిన 200లకు పైగా కేసులు నమోదైనట్టు సీపీఐ(ఎం) తెలిపింది. సోమవారం నాటికి 415 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, మద్దతుదారులపై ʹభౌతిక దాడులుʹ జరిగాయని, 1.539 మంది కార్యకర్తలు, మద్దతుదారుల ఇండ్లను ధ్వంసం చేశారనీ, 196 ఇండ్లకు నిప్పుపెట్టారనీ, 134 పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారనీ, 64 కార్యాలయాలు తగులబెట్టారని, బీజేపీ, దాని భాగస్వామ్య పక్షం ఐపీఎఫ్టీ మద్దతుదారులు కలసి 208 కార్యాలయాలను ʹబలవంతంగా ఆక్రమించుకున్నారనిʹ సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి బిజన్ ధర్ చెప్పారు.
బెలోనియా పట్టణంలో భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తూ... హిందూత్వవాదులు లెనిన్ విగ్రహాన్ని జేసీబీని ఉపయోగించి మరీ కూల్చివేసిన ఘటన వారి విధ్వంసకాండకు పరాకాష్టగా మారింది. అక్కడితో ఆగని వారి విధ్వంస కాండ మంగళవారం దక్షిణ త్రిపురలోని సబ్రూమ్ పట్టణంలో మరో లెనిన్ విగ్రహాన్ని ధ్వంస చేశారు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు ఇంకా బయటకురావడంలేదు. త్రిపురలో ఒక చిన్న పట్టణమైన జిరానియాలో ఇద్దరు లెఫ్ట్ కార్యకర్తలను హత్య చేశారు. బాంబుపేలుడు ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, మరో కార్యకర్తను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ధలై జిల్లాలోని కమల్పూర్లో 19 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అక్కడ సీపీఐ(ఎం) కార్యదర్శి నివాసం సహా నాలుగు ఇండ్లను తగులబెట్టారు. బీజేపీ-ఐపీఫ్టీ బెదిరింపులతో సీపీఐ(ఎం) కార్యకర్తలు ఇండ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని సీపిఐ(ఎం ) నేత బిజన్ ధర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Keywords : tripura, rss, bjp, cpim, lenin, attacks
(2024-03-18 06:20:14)
No. of visitors : 1228
Suggested Posts
| హంతకుల రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న సీపీఎం స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి.. |
| మత హింస గురించి రాసినందుకు ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు - బెయిల్ మంజూరు చేసిన కోర్టుత్రిపురలో ఈ మధ్య జరిగిన ముస్లింలపై దాడులకు సంబంధించిన ఘటనలను రిపోర్ట్ చేసినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఆదివారం నాడు అరెస్టుచేశారు. సమృద్ధి సకునియా, స్వరణ్ ఝా అనే ఇద్దరు జర్నలిస్టులను అస్సాం లోని కరీంగంజ్ జిల్లాలో అదుపులోకి తీసుకుని ఆపై త్రిపుర పోలీసులకు అప్పగించారు అస్సాం పోలీసులు. |
| త్రిపురలో ముస్లింలపై హింసను బహిర్గతం చేసినందుకు లాయర్లపై UAPA -ప్రజాసంఘాల ప్రకటననవంబర్ 3న, త్రిపుర పోలీసులు ఢిల్లీకి చెందిన నలుగురు న్యాయవాదులకు ఇండియన్ పీనల్ కోడ్(IPC), క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ నోటీసులు పంపారు. |
| Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
త్రిపురలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా ఓ మసీదును ధ్వంసం చేశారు. ముస్లింల షాపులపై, ఇళ్ళపై దాడులు చేసి దోచుకున్నారు.
|
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..