రిజర్వేషన్లు మాత్రమే కాదు అడవి మీద రాజకీయ అధికారం కూడా ఆదివాసులదే - మావోయిస్టు పార్టీ

రిజర్వేషన్లు

ఆదివాసులకు పది శాతం రిజర్వేషన్లు, ముస్లింలకు 12 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఆమోదం పొందక తిరిగి వచ్చింది. ఆదివాసుల రిజర్వేషన్‌ పెంపు, ముస్లిం రిజర్వేషన్‌ పెంపు, వేరు వేరు బిల్లుల రూపంలో ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా పాటించకుండా ఆది వాసులపట్ల, ముస్లింలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు రూపొందించిన ఈ బిల్లు 1986లో ఎన్టీఆర్‌ బీసీలకు 25 శాతం నుంచి 40 శాతానికి పెంపు చేస్తూ రూపొందించిన బిల్లు వంటిదే. అది హైకోర్టు కొట్టి వేస్తే టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోలేదు. ఆ తాను నుంచే వచ్చిన ముక్క అయిన కేసీఆర్, ఆయన స్థాపించిన టీఆర్‌ఎస్‌ ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ సామ్రాజ్యవాద, బ్రాహ్మణీయ భూస్వామ్య భావజాలానికి, పాలనకు వ్యతిరేకంగా ముందు భాగాన నిలబడి పోరాడుతున్న మూల ఆదివాసులపై, ముస్లింలపై ప్రేమ చూపుతారంటే తోడేళ్లు, గొర్రెలకు మేలు చేయడం వంటిదే.

ఆదివాసులకే పరిమితమై ఆలోచించినా ఒకవైపు రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ రూపొందించిన మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కి ఎస్టీ జాబితాలోకి లంబాడాలను చేర్చి మూల ఆది వాసీలకు, లంబాడాలకు మధ్యన చిచ్చు పెట్టి పీడిత వర్గాల ఘర్ష ణల్లో, విభేదాలు, వైమనస్యాలు, విద్వేషాల్లో రగుల్కొంటున్న మంటల్లో పేలాలేరుకుంటున్న ప్రభుత్వం.. మరొ కవైపు ఎస్టీ రిజర్వేషన్లను పది శాతానికి పెంచి బిల్లును శాసనం చేయగలదని, చేసినా మూల ఆదివాసులకు న్యాయం చేయగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇపుడున్న ఆరు శాతం రిజ ర్వేషన్లలోనూ నాలుగు శాతమే అమలవుతున్నది. ఈ నాలుగు శాతంలో నాలుగో వంతు కూడా మూల ఆదివాసులకు దక్కడం లేదు. కారణం 1976లో లంబాడాలను అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చిన దగ్గర్నించే గత నలభై రెండేళ్లలో మూల ఆదివాసుల జనాభాకు లంబాడాల జనాభా ఇరవై రెట్లకు పెరిగింది.

లంబాడాల వలసలు వేగవంతంగా పెరగడమే ఇందుకు కారణం. 1961లో 81,366గా ఉన్న లంబాడా జనాభా 2011లో 20,99,524కు పెరిగింది. ఏజెన్సీలో మూల ఆదివాసుల జనాభా 2011లో 9 లక్షలుగా మైనారిటీకి పడిపోయింది. కనుక ఈ పరిస్థితిలో ఎస్టీ రిజర్వేషన్లు పదిశాతం అమలయినా మూల ఆదివాసులు పొందే ప్రయోజనమెంతో, పాలక వర్గాలు ఆడుతున్న ఓటు బ్యాంకు రాజ కీయాలు ఎంత దుర్బుద్ధితో కూడినవో ఎవరైనా న్యాయంగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. రాజ్యాంగం ప్రకారం అడవిలో, ఏజెన్సీలో మూల ఆదివాసులకు మాత్రమే దక్కవలసిన జల్, జంగల్, జమీన్‌లపై అధి కారం గ్యారంటీ కావాలన్నా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృ తిక, విద్యా, ఉద్యోగ, భూసంబంధ హక్కులు అమలు కావాలన్నా 1976లో చేసిన చట్ట సవరణను రద్దు చేయవలసిందే. రిజర్వేషన్ల అమలులో 1976ను కటాఫ్‌ డేట్‌గా గుర్తించి బ్యాక్‌లాగ్‌ పోస్టులను, భూమి పట్టాలను బ్యాక్‌లాగ్‌ పద్ధతిలో అమలు చేయాల్సిందే.

ఎస్టీ వర్గీకరణ అంటే మూల ఆదివాసీ తెగల్లోనే గోండు, కోలాము, పరధాను, పరమేశు, నాయకపోడు, చెంచు వంటి ఆదివాసీ తెగల జనాభా ప్రాతిపదికపైననే కానీ మైదాన ప్రాంత సంచార జాతి అయిన లంబాడాలను కలిపి కాదు. 1976ను కటాఫ్‌ తేదీగా గుర్తించి వలస లంబాడాలను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలి. 1976 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడాలకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు ఇక్కడ ఇవ్వాలి. అయితే అది రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ గుర్తింపు కాజాలదు. కాయితా లంబాడాలు, వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరజాలరు. అడవిలో మూల ఆదివాసుల నివాసం, తొలి రోజుల్లో ఆహారాన్వేషణ, వేట, కాలక్రమంలో పోడు వ్యవసాయం, ఏజెన్సీలో ఉనికి, ఎస్టీ గుర్తింపుకు ప్రాతిపదిక కావాలి. ఐదవ షెడ్యూల్డు ఏజెన్సీ (అటవీ) ప్రాంతాల్లో ఏజెన్సీ సర్టిఫికెట్లు మూల ఆదివాసులకు మాత్రమే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వగైరా రాజకీయాధికారా లన్నీ మూల ఆదివాసు లకే పరిమితం కావాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు మూల ఆదివాసులకే ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో రెసి డెన్షియల్‌ స్కూళ్లలో, కాలేజీలలో మూల ఆది వాసుల పిల్లలకే సీట్లు ఇవ్వాలి. జీసీసీలో మూల ఆదివాసులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.

ఆదివాసుల సంస్కృతిని అగౌరవ పరిచే చర్యలు చేపట్టవద్దు. సూకీ మాత, సేవాలాల్‌ చిత్రాలను ఆదివాసీ మ్యూజియంలో పెట్టడం సరిౖయెంది కాదు. మేడారం ట్రస్టులో ఆదివాసులు మాత్రమే ఉండాలి. జోడన్‌ఘాట్‌లో కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం రాజ్య ప్రేరేపిత అవమానకర చర్య. ఆదివాసుల మనోభావాలను గాయపరిచే చర్య. ఏజెన్సీ ప్రాంత ఐడీడీఐలలో మూల ఆదివాసులకు మాత్రమే హక్కులుండాలి. లంబాడా ప్రజలకు ప్రత్యేకంగా మైదాన ప్రాంతాలలో రిజర్వేషన్లు కల్పించాలి. ఐటిడీ ఏలు నెలకొల్పాలి. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు న్యాయ మూర్తులతో ఒక కమిషన్‌ వేయాలి.
ప్రభుత్వ రంగం రోజురోజుకూ కుంచించుకు పోతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు పీడిత, పేద ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరింప జాలవు. వాటివల్ల ఉపయోగం చాలా పరిమిత మైందనే ఎరుక ఉండాలి.

మూల ఆదివాసులకు జల్‌ జంగల్‌ జమీన్‌లపై సర్వాధికారాలు దక్కాలంటే ఆదివాసీయేతరులైన పేదలు, పీడితులు ముఖ్యంగా లంబాడాలు మూల ఆదివాసులకు శత్రువులనీ, లంబాడాలకు దక్కవల సిన న్యాయం దక్కకూడదనీ అర్థం కాదు. పాలకవర్గాలు పెట్టిన కుట్ర తప్ప మూల ఆదివాసులకు, లంబాడాలకు మధ్యనున్నది మిత్ర వైరు ధ్యమే. దీనిని మిత్ర వైరుధ్యంగానే గుర్తించి మూల ఆదివాసులు, లంబాడాలు, ఆదివాసీయేతర పీడిత, పోరాట ప్రజానీకంతో కలిసి పరిష్కరించుకోవాలి. భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద ఏజెంట్లే అసలైన శత్రువులు. వాళ్లే ఈ ఘర్షణలకు మూలం. ప్రభుత్వాలు వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు. మూల ఆదివా సులు, లంబాడాలు, పీడిత ప్రజలందరూ ఐక్యమై దోపిడీ పాలక వర్గా లకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే పేద ప్రజలం దరికీ న్యాయమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.

మూల ఆదివాసులు జల్, జంగల్, జమీన్, స్వీయ గౌరవం కోసం పీడిత ప్రజలందరితో ఐక్యమై పోరాడాలి. స్వపరిపాలన కోసం పోరాడాలి. మిలిటెంటు పోరాటాల ద్వారా తప్ప ఎన్నికల రాజకీ యాల ద్వారా పేద, పీడిత ప్రజలకు లభించేది ఎండమావులే. అంతిమ సారాంశంలో పీడిత ప్రజలందరితోపాటు మూల ఆదివా సుల సమస్యలకు పరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యం. పోరాటానికి అది మార్గదర్శకం, లక్ష్యం కావాలి.
జగన్‌,
సీపీఐ మావోయిస్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర‌ అధికార ప్రతినిధి
(మార్చ్ 3 , 2018 న సాక్షి పత్రికలో ప్రచురితమైనది)

Keywords : maoists, jagan, haribhushan, adivasi, lambada, st reservation
(2024-03-15 05:31:58)



No. of visitors : 1806

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రిజర్వేషన్లు