ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

ముంబై

జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ముందుంటామని ముంబైవాసులు మళ్ళీ నిరూపించారు. తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు ముంబై నగరం నడుం బిగించింది. సమస్యల పరిష్కారం కొరకు ఎగిసి పడుతున్న సముద్ర కెరటాల వలే ఎర్ర జెండాల రెప రెపల మధ్య ఆదివారం అర్ధరాత్రి తండోపతండాలుగా వస్తున్న రైతులకు నీళ్ల బ్యాటిళ్లు, బిస్కట్‌ ప్యాకెట్లు, పండ్లు, ఫలహారాలు, పొంగలి పొట్లాలను పంచిపెట్టారు. ఈ సామాజిక కార్యక్రమంలో తర తమ భేదం లేకుండా వ్యక్తులు, నివాసితుల సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.
కొన్ని చోట్ల సిక్కులు, ముస్లింలు ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం రొట్టెలు, పప్పును పంచి పెట్టగా, బైకుల్లా జంక్షన్‌ వద్ద ముస్లింలు బిస్కట్లు, ఖర్జూరాలు, వాటర్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఓ చోట ఓ సంస్థకు చెందిన కార్యకర్తలు రైతులకు చెప్పుల జోళ్లను కూడా పంచి పెట్టారని ముంబై మిర్రర్‌ తెలియజేసింది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి ప్రజలే.
నగరంలోని ఆజాద్‌ మైదాన్‌కు చేరుకున్న దాదాపు 50 వేల మంది రైతులుకు సోమవారం ఉదయం పలు ఎన్జీవో సంఘాలు అల్పాహారాన్ని పంచిపెట్టాయి. తమ‌ పట్ల ముంబై వాసులు చూపిన ఆదరణను తామెన్నటికీ మరువలేమని, తాము ట్రక్కులో వెంట తీసుకొచ్చుకున్న ఆహార దినుసులు ఆదివారం వరకు సరిపోతాయో, లేదో అని ఆందోళన చెందామని, అయితే మార్గమధ్యంలో ప్రజలు ఆహార పొట్లాలు, మంచి నీళ్లు అందించడం వల్ల తమ వద్ద ఇంకా నాలుగు రోజుల వరకు సరిపోయే స్టాక్‌ మిగిలిందని అఖిల భారత కిసాన్‌ సభ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ గుజార్‌ తెలిపారు.
వృద్ధాప్యం కారణంగా వడలు కంగి, ఒంట్లో సత్తువ నశించినా ఆశయ సాధన కోసం 180 కిలోమీటర్లు కాలి నడకన వచ్చిన రైతుల స్ఫూర్తియే స్థానిక ముంబై వాసులను కదిలించింది. ఉడతా భక్తిగా తమవంతు సహాయాన్ని అందించారు. 180 కిలోమీటర్లు సాగిన యాత్రలో ఎక్కడా విధ్వంసానికి అవకాశం ఇవ్వకుండా క్రమశిక్షణ పాటించిన రైతులు ముంబై నగరానికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు స్పందించిన తీరు కూడా అద్భుతం. ఆదివారం అర్ధరాత్రి సోమయ్య మైదానానికి చేరకున్న రైతులు ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో విధాన భవన్‌ను ముట్టడించాల్సి ఉంది.
అలా చేస్తే ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభించిపోయి టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకుని ఆజాద్‌ మైదాన్‌కు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. సోమయ్య మైదాన్‌ నుంచి ఆజాద్‌ మైదాన్‌కు మధ్యన దూరం 18 కిలోమీటర్లు. అలసి సొలిసి కదిలేందుకు మొండికేస్తున్న దేహాలకు కాస్త విశ్రాంతినిద్దామనుకుంటున్న తరుణంలో రైతులు మళ్లీ అర్ధరాత్రి రెండు గంటలకు బయల్దేరాల్సి వచ్చింది

Keywords : maharashtra, farmers, mumbai, bjp, fadnaves
(2024-04-16 09:37:11)



No. of visitors : 3456

Suggested Posts


stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur

We, the undersigned students, faculty, alumni and others from IIT Kharagpur are shocked with the threat of imminent arrest of our ex-colleague, Prof. Anand Teltumbde. This comes in the aftermath of rejection of the appeal he filed at the Supreme Court regarding the baseless FIR lodged against him by the Pune police under the pretext of the Bhima-Koregaon

ఎన్‌కౌంటర్‌ జరిగింది మహారాష్ట్రలో కాదు...సంఘటనా స్థలం నుండి ఓ జర్నలిస్టు ప్రత్యక్ష కథనం

రెండు రోజుల క్రితం బుల్లెట్ల ధాటికి కంపించిన అడవిలో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. చెట్లపై బుల్లెట్ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ భారీ బుల్లెట్ల వర్షం కురిసిందని నేలపై పడ్డ చెట్ల పెచ్చులు చెబుతున్నాయి.

దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

మహారాష్ట్రలో ʹఎన్ కౌంటర్ʹ - 13 మంది మావోయిస్టులు మృతి !

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కోట్మి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించారు.

మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ముంబై