ప్రజలపై యుద్ధం : పాఠశాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
దండకారణ్యంలో ప్రజలపై కొనసాగిస్తున్న ప్రభుత్వపు ఫాసిస్టు దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించండి!!
విద్యవేత్తలారా! మేధావుల్లారా!
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది అర్ధ సైనిక-పోలీసు బలగాలను మోహరించి ప్రజలపై ఫాసిస్టు దమనకాండను కొనసాగిస్తున్నాయి. బస్తర్ ఐ.జీ. వివేకనంద్ మాటల్లో చెప్పాలంటే బస్తర్ సంబాగ్లోని 7 జిల్లాల్లో 2017లో 1235 మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్ నిర్వహించినట్లు ప్రకటించాడు. అంటే సగటున ప్రతిరోజు ప్రజలపై దాడులు, అరెస్టులు, మహిళలపై అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. వాటిలో ప్రజల ఆస్థులను లూటీ చేయడం, ప్రజల సహకారంతో జనతన సర్కార్ల ఆద్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, ఆశ్రమాలలను లక్ష్యం చేసుకొని దాడులు చేస్తున్నారు. 2017లో పశ్చిమ బస్తర్ బీజాపూర్ జిల్లాలోని గంగలూర్, చెర్పాల్, మిర్థూర్ ఠాన పరిధి గ్రామాలపై నిరంతరం దాడులు చేస్తున్నారు.
జనవరి 5నుండి 9 వరకు పిడియా, తుమ్నార్, హండ్రీ, ఇర్మగుండ, డల్లి, పరల్నార్, కావడి, మద్దువెండి, గంపూర్, కర్క, ఈరిల్, పుంబాడ్, బుర్గిల్ గ్రామాలపై దాడులు చేశారు. జనతన సర్కార్ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలలను, ఆశ్రమాన్ని కాల్చి బూడిదచేశారు. విద్యార్థుల చలిబట్టలు, బ్లాక్బోర్డు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్లు పూర్తిగా మంటల్లో వేసారు. పోలీసుల భయంతో ప్రజలతో పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్న చిన్న పిల్లలను కూడ వదలకుండా అడవిలో వేటాడి కాల్పులు జరిపారు. జనవరి 6న తమ పశువులను వెతకడానికి వెళ్తున్న పిల్లలపై కర్కత్ గ్రామంలో పోలీసులు కాల్పులు జరపడంతో 13సం||ల మడ్కం సోంబారు అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. 12 సం||రాల బాలుడు మడ్కం బోటి తీవ్రమైన గాయాలయి గ్రామం వరకు పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటనను ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మరణించాడని మీడియాలో ప్రచారం చేశారు.
నేడు మోడీ-రమన్సింగ్ ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాన్ని ʹసమాధాన్ʹ వ్యూహంతో 2022 వరకు నిర్మూలించే లక్ష్యంతో ప్రజలపై ఫాసిస్టు నిర్బంధాన్ని, పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఆదివాసుల ఉన్నతికోసం పాటు పడుతున్నామని ప్రతిరోజు ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం చేసుకుంటున్నది. కానీ ప్రజలు తమ రక్తమాంసాలతో కష్టించి నిర్మించుకున్న పాఠశాలలను, ఆశ్రమాలను కాల్చి బూడిదచేసి ఆదివాసి పిల్లలను విద్యనుండి దూరం చేస్తుంది. మావోయిస్టులు పాఠశాలలను, ధ్వంసం చేస్తున్నారని ప్రధాన మీడియాలో గగ్గోలు పెడుతూ బూటకపు ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని అణచడానికి ప్రజలు నిర్వహిస్తున్న పాఠశాలలను, ఆశ్రమాలను ధ్వంసం చేస్తుంది. కార్పోరేట్ సంస్థలకు విద్య, వైద్య సంస్థలను అప్పజెప్పి సాధారణ పేద ప్రజానీకానికి ముఖ్యంగా ఆదివాసీ, దళిత, కార్మికవర్గ ప్రజల పిల్లలను విద్య నుండి దూరం చేస్తున్నది. బీజాపూర్ జిల్లాలో రేషనలైజేషన్ పేరుతో 75 పాఠశాలలను మూసివేసి మావోయిస్టుల ప్రభావం పేరుతో అనేక గ్రామాలలో పాఠశాలలు, ఆశ్రమాలను మూసివేసి క్యాంపు, పోలీసు స్టేషన్ల వద్ద పోటాకాబిన్లను ఏర్పరిచింది. ఈ పోటాక్యాబిన్లలో ఒక్కొక్కదాంట్లో 500 మంది విద్యార్థులను కోళ్ళు, మేకల మంద లాగా వేశారు. ఇక్కడ కనీస వసతులు మరుగుదొడ్లు లేవు. ఆలు, పప్పు లాంటి నీళ్ల కూర పిల్లలకు వడ్డిస్తారు. 500 మంది విద్యార్థులకు కేవలం నల్గురు టీచర్స్ ఉన్నారు. వీరంతా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కారు. కొందరు అనుద్దేశక్ గురుజీలు (స్కూల్ విడిచిన పిల్లలను మళ్లీ స్కూలుకు తీసుకొచ్చేందుకు నియమించబడిన గురూజీలు) వీరికి వేతనం నెలకు 2,500 రూ||ల వరకు వుంటుంది. వీరికి ఎలాంటి టీచర్ ట్రైనింగ్ కూడ లేదు. వీరు ఈ పోటాక్యాబిన్ల విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. చాల నామమాత్రమైన చాల తక్కువ క్వాలిటి గల విద్యను ఆదివాసీ పిల్లలకు ఫాసిస్టు రమన్సింగ్ ప్రభుత్వం అందిస్తుంది. మరోవైపు రమన్సింగ్ ప్రభుత్వపు కావలి కుక్కలైన పోలీసు అధికారులు బస్తర్ జిల్లాలో నక్సలైట్ల భయంతో గ్రామం విడిచిన పిల్లలకు విద్యను అందిస్తున్నామని- బస్తర్ జిల్లా ఆరీఫ్షేక్ అమెరికాలోని ఫిలడెల్సియాలో అంతర్జాతీయ పురస్కారం అందుకున్నాడు.
మావోయిస్టుల హింసలో వేలది మంది పిల్లలు స్కూల్ విడిచారని బూటకపు ప్రచారం చేస్తూ, మావోయిస్టు ప్రభావిత పిల్లల భవిష్యత్తు బంగారు బాటలాగా చక్కదిద్దుతామని నిష్టా, ఆస్థా, ʹప్రయాస్ʹ పేరుతో మూడు రకాల స్లూళ్లను రమన్సింగ్ ప్రభుత్వం నడుపుతున్నది. వాటిలో సంఘ్ భావజాలాన్ని చిన్నారుల మెదళ్లలో చొప్పిస్తున్నారు. వీరిలో కొందరికి ప్రొఫెషనల్ కోర్సుల అవకాశం కల్పించి వారిని అందరికి రోల్మోడల్గా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.
సామాన్య పేద ప్రజల, ఆదివాసీ పిల్లలను విద్య నుండి దూరం చేసే బీజేపీ ప్రభుత్వపు చర్యలను వ్యతిరేకించండి. విద్యా వ్యవస్థను కార్పోరేట్ సంస్థలకు, మత సంస్థలకు అప్పజెప్పి, నామమాత్రమైన విద్యను కూడ పేద ప్రజలకు అందకుండా మావోయిస్టు ఉద్యమాన్ని అణిచే పేరుతో, ప్రజలు ప్రత్యామ్నాయంగా నిర్వహిస్తున్న జనతన సర్కార్ పాఠశాలలను, ఆశ్రమాన్ని కాల్చడం, ధ్వంసం చేసే ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఆదివాసుల శ్రేయోభిలాషులు ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనతన సర్కార్ ద్వార పేద ప్రజలకు అందిస్తున్న ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థకు సహాయ, సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము.
విప్లవాభివందనాలతో
పూనెం కమ్లూ
అధ్యక్షులు, డివిజన్ క్రాంతికారి జనతన సర్కార్ కమిటీ
పశ్చిమ బస్తర్ డివిజన్- బీజాపూర్ జిల్లా (ఛత్తీస్గఢ్)
Keywords : dandakaranyam, chattis garh, police, janathana sarkar, schools
(2024-04-15 06:57:36)
No. of visitors : 1163
Suggested Posts
| శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావువరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు.... |
| అది ఎన్కౌంటర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజనిర్థారణ బృందంహిడ్మే ఒంటిపై దుస్తులను తొలగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోశారు. ఆ తరువాత చాతీపై, కడుపులో తూటాల వర్షం కురిపించారు. మృతదేహాన్ని సుక్మా పట్టణానికి తరలించారు. 14వ తేది విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... |
| శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి.... |
| రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు... |
| చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్నప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా |
| ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను..... |
| నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపునేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం.... |
| జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ (వీడియో) మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్బరీ వేడుకలు ప్రపంచానికి ఇప్పడు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదంతొక్కారు. |
| ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుగొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో... |