శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ

పిల్ల‌ల్ని కాలేజీకి పంపేది చ‌దుకోవ‌డానికా? చ‌ంపుకోవ‌డానికా? కార్పోరేట్ కాలేజీల్లో చ‌దువుకునే విద్యార్థుల్ని చూస్తే... ఈ సందేహం క‌ల‌గ‌క మాన‌దు. విద్య‌ను వ్యాపారంగా మార్చిన కార్పోరేట్ కాలేజీలు లాభాల కోసం విద్యార్థులను ర్యాంకుల రేసులో నిల‌బెడుతున్నాయి. కోళ్లఫాంల్లాంటి ఇరుకైన గ‌దుల్లో వేలాది మందిని కుక్కి రాత్రిం బ‌వ‌ళ్లూ బ‌ట్టీ ప‌ట్టిస్తున్నాయి. ర్యాంకు రాక‌పోతే జీవితం వృథా అనే భావ‌న‌ను పెంచుతూ... విద్యార్థుల‌పై తీవ్ర ఒత్తిడిని పెంచేస్తున్నాయి. మ‌రోవైపు... త‌ల్లిదండ్రుల నుంచి ల‌క్ష‌ల్లో ఫీజ‌లు గుంజుతున్నాయి. మీ పిల్ల‌లు భాగా చ‌ద‌వాలంటే.. మా కాలేజీలో చ‌ద‌వాల్సిందే అనే అర్భాట‌పు ప్ర‌చారాల‌తో విద్యార్థుల‌ను చేర్చుకునే క‌ళాశాల‌లు ఫీజుల పేరుతో విద్యార్థుల‌ను తీవ్ర వేద‌న‌కు గురిచేస్తున్నాయి. ఫీజు చెల్లించ‌లేద‌ని ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కానివ్వ‌క‌పోవ‌డం, ప్రాక్టిక‌ల్స్‌లో మార్కులు త‌గ్గిస్తామ‌న‌డం, హాల్ టికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డం, చివ‌ర‌కు ఉత్తీర్ణులైనా స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డం ఇలా... నానా ర‌కాలు విద్యార్థుల‌ను తీవ్ర మాన‌సిక క్షోభ‌కు గురిచేస్తూ ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా వ్యాపారాన్ని న‌డుపుతున్న సంస్థ‌ల్లో శ్రీ చైత‌న్య‌, నారాయ‌ణ కాలేజీలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి.

త‌మ పిల్ల‌లు ఉన్న‌త చ‌దువులు చ‌దివి, గొప్ప వాళ్లు కావాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటారు. అది... అంద‌రికీ నాణ్య‌మైన విద్య అందిన‌ప్పుడే సాధ్య‌మ‌వుతుంది. కానీ, కునారిల్లున్న ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ త‌ల్లిదండ్రుల‌ న‌మ్మ‌కాన్ని పొంద‌లేక‌పోతోంది. ఫ‌లితంగా కార్పోరేట్ విద్యా సంస్థ‌లు విద్య‌ను మార్కెట్‌లో స‌రుకుగా మార్చివేశాయి. గ‌ల్లీ గ‌ల్లీకి పుట్ట‌గొడుగుల్లా కార్పోరేట్ సంస్థ‌లు వెలిశాయి. శ్రీచైత‌న్య‌, నారాయ‌ణ క‌ళాశాల‌లు వంద‌లాది బ్రాంచ్‌ల‌ను నిర్వ‌హిస్తూ.. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల జీవితాల‌తో ఆడుకుంటున్నాయి.

ఎంసెట్‌, ఐఐఐటీ, జేఈఈ లాంటి కోర్సుల పేరుతో ల‌క్ష‌ల రూపాయ‌ల ఫీజులు గుంజుతున్నాయి. స‌రైన వ‌స‌తులు లేని ఇరుకు గ‌దుల్లో విద్యార్థులను కుక్కి, నిద్రాహారాలు లేకుండా పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టిస్తున్నాయి. ఈ రెండు సంస్థ‌లే యేటా వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేస్తున్నాయి. ర్యాంకులు, ఫీజుల పేరుతో విద్యార్థుల‌ను వేధిస్తున్న కార్పోరేట్ కాలేజీలు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ప్ర‌తి సంవ‌త్స‌రం నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య క‌ళాశాల‌ల్లోని ప్ర‌తి బ్రాంచ్‌లో క‌నీసం ఒక్క విద్యార్థి అయినా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. ఇవి ఆత్మ‌హ‌త్య‌లు కావ‌ని, ఆ విద్యా సంస్థ‌లు చేస్తున్న హ‌త్య‌ల‌ని తెలంగాణ విద్యార్థి వేదిక ఆరోపిస్తోంది. కార్పోరేట్ కాలేజీల‌కు వ్య‌తిరేకంగా ఆరంభించిన ఉద్య‌మంలో భాగంగా... గురువారం తెలంగాణ వ్యాప్తంగా ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద టీవీవీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌చారం నిర్వ‌హించారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని కార్పోరేట్ కాలేజీల్లో చేర్పించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Keywords : sri chethanya, narayana, collage,permission, cancel, protest,education,fee, fight,telangana,kcr,ktr
(2024-04-01 10:02:51)



No. of visitors : 1611

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


శ్రీ