పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
(విప్లవ రచయితల సంఘం ప్రకటన పూర్తి పాఠం)
గన్నవరం సమీపంలో బలవంతంగా అదుపులోకి తీసుకొన్న పృథ్వీ, హైదరాబాద్ వర్సిటీ స్కాలర్ చందన్ ను వెంటనే కోర్టులో హాజరు పెట్టాలి
కృష్ణాజిల్లా విరసం సభ్యుడు, లా చివరి సంవత్సరం విద్యార్థి అంకాళ్ల పృథ్వీరాజ్ ఈ నెల 28వ తేదీ, బుధవారం మధ్నాహ్నం విజయవాడలోని గన్నవరంలోని కేసరపల్లి గ్రామంలో మరో యువకుడితో కలిపి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
నల్ల క్వాలీస్లో వచ్చిన కొంతమంది.. ఇద్దరు యువకులను కొట్టి, బలవంతంగా వాహనంలోకి తోసి తీసుకెళ్లడం స్థానికులు గమనించారు. ఆ సమయంలో అటుగా బైకు పై వచ్చిన ఓ వ్యక్తి.. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్లో తెలియజేశాడు. దీనిపై స్థానిక పోలీసులు గత రెండు రోజులుగా సంఘటనాస్థలానికి సమీప ఇళ్లవారిని ఆరా తీస్తున్నారు. సాధారణంగా ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక విభాగాల పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లు సమాచారం ఇవ్వకుండానే అరెస్టులు, కిడ్నాప్లు చేస్తుంటారు. ఆ వ్యక్తి ఫిర్యాదును బట్టి చూసినా, స్థానిక పోలీసుల హడావుడిని బట్టి చూసినా, ఆ రోజు కిడ్నాప్ అయిన ఇద్దరిలో ఒకరు పృథ్వీరాజ్ అని నిర్ధారణ అవుతోంది. కేసరపల్లిలో పృథ్వీరాజ్ ఉంటున్న ఇంటికి అతి సమీపంలోనే ఈ ఘటన జరగడం, ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది. పృధ్వీతోపాటు ఉన్న మరో యువకుడు సెంట్రల్ వర్సిటీ స్కాలర్ చందన్ అని తెలుస్తోంది. పృథ్వీరాజ్ విజయవాడ సిద్దార్థ లా కాలేజీలో చేరడానికి ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివారు. వర్సిటీలో ఆయనకు చందనతో పరిచయం ఉంది. బుధవారం కిడ్నాప్ అయిన సమయానికి చందనను పృథ్వీరాజ్ కలవాల్సి ఉంది. వారిద్దరూ కలుసుకొని, పృథ్వీరాజ్ ఇంటికి వెళుతుండగా, వారిని బ్లాక్ క్వాలీస్లో వెంబడించి వచ్చిన స్పెషల్ పోలీసులు, అదుపులోకి తీసుకొన్నారు. ఆ ఘటన తరువాత పృథ్వీరాజ్ కనిపించలేదు. కుటుంబ సభ్యులకుగానీ, స్నేహితులకు గానీ, విరసం సభ్యులకు గానీ ఆయన సమాచారం లేకుండా పోయింది. పృథ్వీరాజ్ మార్క్సిస్టు అధ్యయన శీలి. సమాజాన్ని తాత్వికంగా ఉన్నతీకరించాలనే ఆకాంక్షతో విరసంలో చేరి పని చేస్తున్నారు. కారల్ మార్క్ 200వ జయంతి వేడుకల సందర్భంగా ఇటీవలే ఆయన ʹమార్క్సిజం అజేయంʹ పేరిట తన వ్యాసాలను పుస్తకంగా తీసుకొచ్చారు.
ప్రజా సంఘాల్లో పని చేస్తున్న కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించిన చరిత్ర ఏపీ, తెలంగాణ పోలీసులకు ఉంది. దానివల్ల పృథ్వీరాజ్, చందన్ల ప్రాణాలకు తక్షణం ముప్పు పొంచి ఉంది. పైగా గతంలో ఒక కేసులో పృథ్వీరాజ్ అరెస్టయి, బెయిల్ మీద ఉన్నారు. ఠంచనుగా విచారణకు హాజరవుతున్న ఆయన నుంచి ఏదైనా సమాచారం అవసరం అని పోలీసులు అనుకొంటే, నేరుగా కలుసుకొనే వీలుంది. ఆయన చదువుకుంటున్న కాలేజీలోనో, ఇంటి దగ్గరో కలిసి తమకు కావాల్సిన వివరాలు తీసుకోవచ్చు. అదంతా వదిలేసి, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా, అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడాన్ని
విప్లవ రచయితల సంఘం తీవ్రంగా గర్తి స్తోంది. పృథ్వీరాజ్, చందన్లను వెంటనే కోర్టులో హాజరు పెట్టాలని రెండు రాష్ట్రాల పోలీసులను డిమాండ్ చేస్తోంది.
కన్వీనర్,
విప్లవ రచయితల సంఘం, కృష్ణాజిల్లా
అరసవిల్లి కృష్ణ
రివేరా (కార్యవర్గ సభ్యుడు)
మరో వైపు పృథ్వీరాజ్, చందన్ లను పోలీసులు కిడ్నాప్ చేయడాన్ని పౌరహక్కులసంఘం, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తీవ్రంగా ఖండించాయి. వారిద్దరిని తక్షణం విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బండి దుర్గా ప్రసాద్ లు డిమాండ్ చేశారు.
Keywords : virasam, vijayawada, police, kidnap, pruthvi, chandan
(2024-03-24 10:49:46)
No. of visitors : 1357
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |