ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
మీడియాలో ఫేక్ న్యూస్ పెరిగిపోయిందని, అటువంటి వాటిని అరికట్టడం కోసం అటువంటి న్యూస్ రాసిన వారి అక్రిడిటేషన్ కార్డులు రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ సర్కులర్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఫేక్ న్యూస్ పై దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంది. ఆ సర్కులర్ ప్రధాని జోక్యంతో నిలుపదల చేసినప్పటికీ ఆ కత్తి మీడియాపై ఎప్పుడూ వేళాడుతూనే ఉంటుంది.
అయితే అసలు ఏది ఫేక్ న్యూస్ అనేది అతి పెద్ద చర్చ. ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని రాయడము. ప్రజలను విపరీతంగా దోచుకున్న ఓ రాజకీయనాయకుడు చాలా గొప్పవాడని రాయడం. రాజకీయ నాయకులు చెప్పే అబద్దాలను యదాతథంగా ప్రచురించడం, ప్రసారం చేయడం. తమను తాము రక్షించుకోవడానికి పోలీసులు చెప్పే అబద్దపు కథలను తామ వర్షన్ గా రాయడం...ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటిని ఫేక్ న్యూస్ అనొచ్చా అనకూడదా ?
సరే ఇక ఇప్పుడు బీజేపీ చెబుతున్న ఫేక్ న్యూస్ విషయానికొద్దాం. వాళ్ళు చెబుతున్న ఫేక్ న్యూస్ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వస్తోంది. అవి ఎక్కువగా సంఘీలు నడుపుతున్న వెబ్ సైట్లలో నే వస్తున్నది. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది కూడా సంఘ్ పరివారమే. కొన్ని ఉదహరణలు చూద్దాం.
వారం క్రితమే (గత గురువారం) ʹపోస్ట్కార్డ్ న్యూస్ʹ సహ వ్యవస్థాపకుడు మహేశ్ విక్రమ్ హెగ్డేను నకిలీ వార్తల ప్రచురణ, ప్రచారం నేరారోపణల కింద బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ ʹరిలీజ్ మహేశ్ హెగ్డేʹ హాష్ ట్యాగ్తో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మొదలుకొని సామాన్య బీజేపీ కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగించారు.
మార్చి 18వ తేదీన ఓ జైన సన్యాసిని.. ముస్లిం యువకుడు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడని, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ పోస్ట్కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. తన ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఎల్లప్పుడు పోస్ట్కార్డ్ న్యూస్ తప్పుడు వార్తలపై ఓ కన్నేసి ఉంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ వెబ్సైట్ ʹఅల్ట్ న్యూస్ʹ జర్నలిస్టులు రంగంలోకి దిగి బెంగుళూరు పోలీసుల నుంచి వాస్తవాలను సేకరించారు.
సదరు సన్యాసిపై ఎవరూ దాడి చేయలేదని, రోడ్డు దాటుతుండగా చిన్న ప్రమాదమై స్వల్ప గాయమైందని పోలీసులు చెప్పడంతోపాటు ఆ జైన సన్యాసి కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారుం చేస్తున్నారన్నది సులభంగానే అర్థం అవుతుంది. పోస్ట్కార్డ్ న్యూస్లో ఒక్కటి కాదు, పదులు కాదు, పాతిక సంఖ్యల్లో నకిలీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనేమో వీటిని బీజేపీ, ఆరెస్సెస్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తున్నారు.
మచ్చుకు పోస్ట్కార్డ్ న్యూస్లో మరికొన్ని నకిలీ వార్తలు
2016, ఆగస్టు నెలలో: సీనియర్ జర్నలిస్ట్ బార్కా దత్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ జకీర్ రషీద్ భట్ అలియాస్ జకీర్ మూసాతోని టూవీలర్పై వెనక తగులుకునేలా కూర్చొని వెళుతున్న దశ్యం అంటూ పోస్ట్కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. ట్విటర్లో పుట్టిన ఈ వార్తను పోస్ట్కార్డ్ ప్రచారం చేయగా, దాన్ని హిందూత్వ శక్తులు వైరల్ చేశాయి. అల్లర్లు కొనసాగుతున్న కశ్మీర్లో తాను న్యూస్ కవరేజ్కి వెళ్లినప్పుడు కారు చెడిపోయిందని, కర్ఫ్యూ కారణంగా తాను కారు మరమ్మతు చేయించుకోలేక ఓ టూ వీలర్ బాటసారిని లిఫ్ట్ అడిగి గమ్యస్థానానికి చేరుకున్నానంటూ బార్కా దత్ వివరణ ఇచ్చారు.టూవీలర్ నడుపుతున్న వ్యక్తికి టెర్రరిస్ట్ కమాండర్కు దగ్గరి పోలికలు ఉన్నాయని పోస్ట్కార్డ్ న్యూస్ వాదించింది. కనిపిస్తే కాల్చిచంపే ఉత్తర్వులు ఉన్నాయని తెలిసి, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు కమాండర్ కర్ఫ్యూ సమయంలో, విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్న సమయంలో టూ వీలర్పై ఎలా తిరుగుతాడని ʹఆల్ట్ న్యూస్ʹ నిలదీసింది.
2017, మే నెల: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలోనే మరో పాకిస్తాన్గా మారిపోనుంది. ఆ పుణ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కట్టుకోవచ్చు. ఎందుకంటే, ముస్లింల కోసం ఆమె త్వరలోనే ప్రత్యేక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టబోతున్నారు. ముస్లింలను మంచి చేసుకోవడం కోసం ఆమె రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వార్తలో కూడా నిజం లేదని ఆల్ట్ న్యూస్ తేల్చింది.
2018, ఫిబ్రవరి 5: తమిళనాడులోని కొన్ని క్రైస్తవ బృందాలు మధురైలోని కలియార్ కోవిల్, శివగామి ఆలయాల్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ తమదని డిమాండ్ చేశాయని, క్రైస్తవ మిషనరీలు ఆ హిందూ దేవాలయాలను చర్చిలుగా మార్చేందుకు కుట్ర పన్నాయని ʹపోస్ట్కార్డ్ న్యూస్ʹ ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వార్తను ప్రచురించింది. ఇలాంటి నకిలీ వార్తలను పట్టుకునే మరో వెబ్సైట్ ʹబూమ్లివ్ʹ స్థానిక పోలీసు అధికారులతోని, స్థానిక జర్నలిస్టులతోని మాట్లాడి వాస్తవాలను బయట పెట్టింది. క్రైస్తవ బృందాలు ఆ ఆలయాల సమీపం నుంచి వెళ్లాయని, ఆలయాల లోపలికి ఎవరు వెళ్లలేదని, ప్రతి ఏట సంప్రదాయంగా జరిగే ఊరేగింపు అదని తేలింది. హిందుత్వ శక్తులు, ప్రధాని మోదీకి అనుకూలంగా ట్వీట్లు కూడా పెట్టే మహేశ్ విక్రమ్ హెగ్డే ఎలాంటి జర్నలిస్టో సులభంగానే గ్రహించవచ్చు.
ఇక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేయడానికి చెడ్డీ గ్యాంగ్ పెఅద్ద నేత్ వర్క్ నే ఏర్పాటు చెసుకుంది. కేంధ్ర మంత్రులు, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా లాంటి వారే నకిలీ వార్తలను, ఫొటోలను ప్రచారం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఏడాది క్రితం మత ఘర్షణలు జరిగినప్పుడు ʹబెంగాల్లో పట్టపగలు ఓ హిందూ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లిం యువకులుʹ అన్న కాప్షన్తో మరాఠీ చిత్రంలోని ఓ సన్నివేశం ఫొటోతో సోషల్ మీడియాలో అమిత్ మాలవీయ ప్రచారం చేశారు. గతేడాదే జార్ఖండ్లో నకిలీ వార్తల కారణంగా రెండు వేర్వేరు సంఘటల్లో ఏడుగురు అమాయకులు మరణించారు. అపరిచితులు పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ ʹవాట్సాప్ʹలో తప్పుడు ప్రచారం జరగడంతో అమాయకులను అనుమానించి జనమే కొట్టి చంపారు.
ఇక ఇప్పుడు తాజాగా ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీస్ చట్టం నీరుగార్చడానికి నిరసనగా ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.
ʹకట్టర్ హిందూ భగ్వా రాజ్ʹ ʹఏక్ నామ్ హిందుస్తాన్ʹఅనే పేజీల్లోపోస్ట్ చేసిన ఈ పోస్ట్ లు లక్షలాదిగా షేర్లయినాయి. ఆ తర్వాత అనేక హిందుత్వ పేజెస్ లో గ్రూపుల్లో ప్రచారం చేశారు. నిజానికి ఆ ఫోటో ఇప్పటిది కాదు. జూన్ 2017 లో ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ని జాగృతి అనే ఆస్పత్రిలో 16 ఏండ్ల విద్యార్హిని రేప్ జరిగింది. అప్పుడు జరిగిన ఆందోళనలు తీవ్ర రూపందాల్చి. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య యుద్దమే జరిగింది. ఆ సమయంలో మీడియాలో వచ్చిన ఫోటోను పోస్ట్ చేసి దళితులపై విషం చిమ్మడం మొదలు పెట్టారు. మన దగ్గర కూడా సోషల్ మీడియాలో చెడ్డీ గ్యాంగ్ తమ శక్తి మేర ఈ ప్రచారం చేశారు.
జూన్ 2017 నాటి అసలు వార్తను ఈ లింక్ లో చదవండి https://www.inuth.com/india/heres-why-uttar-pradesh-cops-were-brutally-assaulted-by-an-angry-mob-in-kanpur/
నిజానికి ప్రస్తుతం దొంగలే.. దొంగ, దొంగ అని అరుస్తున్నారు. వాళ్ళ దొంగతనాన్ని కప్పి పెట్టడానికి మీడియా మీద సోషల్ మీడియా మీద కన్నర్రచేస్తున్నారు. ఇది ఒక్క బీజేపీనే కాదు పాలకులందరూ చేస్తున్నపనే.
Keywords : ake news, dalit, police, rss, bjp, cheddi gang
(2024-03-17 13:45:27)
No. of visitors : 2603
Suggested Posts
| ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్కను హత్య చేస్తారట ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు. |
| మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలుప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది. |
| ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ? మరణవార్త చెప్పిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్ ఫోన్ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ... |
| సాదువుల హత్య కేసు:101 మంది అరెస్ట్... ఒక్క ముస్లిం కూడా లేడు సాదువుల హత్య కేసులో ఇప్పటివరకు 101 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. వారంతా హిందువులేనని, అందులో ముస్లింలు ఒక్కరు కూడా లేరని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం తెలిపారు. |
| తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు.... |
| 51 University VCs Attend RSS Workshop on Making Education More IndianOver 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital.... |
| దేశానికి రానున్నవి చీకటిరోజులుభారతదేశంలో హిందువులలోనూ ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లేనని నా అభిప్రాయం. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేను చూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లిం లేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు |
| వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ
తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరిజిల్లాలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఖాకీ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో లాఠీలు పట్టుకున్న ఆరెస్సెస్ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి చెక్ చేసిన ఘటనపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. |
| సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ !ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ |
| జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు. దక్షిణ 24 పరగణా లోని కానింగ్ నుండి హుబ్లీకి రేల్లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న రైలులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు. |