భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భూస్వామ్య

అరవింద్‌జీ.
భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని. నక్సల్బరీ పోరాటపు తొలి వెల్లువ వెనెకంజ వేసాక, ఎనభయ్యవ దశకంలో బీహార్‌లో విప్లవోద్యమాన్ని పునర్నిర్మించడంలో అత్యంత కీలకమైన భూమిక నిర్వహించిన భూమిపుత్రుడు. భారతదేశంలోని మూడు ప్రధాన విప్లవ స్రవంతుల్లోని సిపిఐ (ఎం.ఎల్‌) పీపుల్స్‌వార్‌, సిపిఐ (ఎం.ఎల్‌) పార్టీ యూనిట్‌ల ఐక్యత లో కీలక భూమిక నిర్వహించి ఆ తదుపరి ఐక్య విప్లవ పార్టీ సిపిఐ (మావోయిస్టు) ఆవిర్భావంలోనూ ముఖ్య పాత్రను పోషించిన నాయకుడు. భారత విప్లవోద్యమానికి అవసరమైన గెరిల్లా యుద్ధ ఎత్తుగడలను అభివృద్ధి చేయడంలోనూ, వాటిని ఆచరణలో సానబెట్టడంలోనూ ఆరితేరిన ఎర్రసైన్యపు కమాండర్‌, కేంద్ర సైనిక కమిషన్‌ సభ్యుడు, కేంద్రకమిటీ సభ్యుడు.

మార్చి 21 న కా|| అరవింద్‌ అనారోగ్యంతో మరణించారు. గత పదేళ్ళుగా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటూ, మరీ ముఖ్యంగా గత రెండేళ్ళుగా పట్టుమని 100 మీటర్లైనా నడవలేని స్థితిలో ఉండి కూడా తాను అత్యంతగా ప్రేమించే ప్రజల మధ్య, గెరిల్లా సైనికుల మధ్యనే జీవిస్తూ వారికి అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తూ వారి మధ్యనే ఝార్ఖండ్‌లోని, లాతేహార్‌ జిల్లాలోని బుఢా పహాడ్‌పై అసువులు బాసాడు.

కా|| అరవింద్‌ అసలుపేరు దేవ్‌కుమార్‌ సింగ్‌. జహానాబాద్‌ లోని సకల్‌్‌చక్‌ గ్రామం. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. పాట్నా యూనివర్సిటీలో బి.ఎస్సీ. చేసాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో బీహార్‌లో డెబ్భయ్యవ దశకంలో జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వంలో జరిగిన విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. (నిజానికి అది జెపి నిర్మించిన ఉద్యమం కాదు, విద్యార్థులు స్వతస్ఫూర్తిగా ఉద్యమాన్ని నిర్మించి సీనియర్‌ నాయకునిగా జెపిని నాయకత్వం వహించడానికి పిలిచారని కా|| అరవింద్‌ అభిప్రాయం)

జెపి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళలో లాలూ, నితీష్‌ లాంటివారు ఆ తరువాతి కాలంలో పాలక వర్గ పార్టీల నేతలుగా ఎదిగితే, కా|| దేవ్‌కుమార్‌ సింగ్‌ వంటి కొందరు పీడిత వర్గ ప్రయోజనాల వైపు, సామ్యవాద రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. స్వయం ఉపాధి కోసం ఒక హోటల్‌ పెట్టుకున్న కా|| దేవ్‌కుమార్‌సింగ్‌ వద్దకు, 1970 లలో నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి ఎమర్జెన్సీ తరువాత విడుదలైన కొందరు బెంగాలీ విప్లవకారులు వచ్చారు. కొన్నాళ్ళ పాటు దేవ్‌కుమార్‌ సింగ్‌ హోటల్‌ వాళ్ళ రాజకీయాలకు అడ్డాగా మారింది. వారితో పెరిగిన పరిచయం కా|| దేవ్‌కుమార్‌ను నక్సలైటు రాజకీయాల వైపు ఆకర్షితుణ్ణి చేసింది. ఆ బెంగాలీ విప్లవకారులు అప్పటికే సిపిఐ (ఎం.ఎల్‌) పార్టీ యూనిటీని ఏర్పరచి నక్సల్బరీ నాటి అతివాద పంథా నుండి బయటపడి ప్రజా పంథాలో ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు. విశాల ప్రాతిపదికన రైతు కూలీ ఉద్యమాన్నీ, రైతుకూలీ సంఘాన్నీ ఏర్పరచడానికి పూనుకున్నారు. అట్లా ఆవిర్భవించిందే మజ్దూర్‌ కిసాన్‌ సంగ్రాం సమితి (ఎంకెఎస్‌ఎస్‌). విశాల ప్రాతిపదికన ఏర్పరచాలనుకున్నారు కాబట్టి (ఎంకెఎస్‌ఎస్‌ కు నాయకులుగా) డా||వినయన్‌, జంగ్‌బహదూర్‌ సింగ్‌ వంటి వారిని నాయకులుగా ఉండమని ఆహ్వానించారు. డా|| వినయన్‌ కూడా జెపి ఉద్యమాన్నుండి నాయకునిగా ఎదిగినవాడు. వీరు బహిరంగ ప్రజాసంఘ నాయకులు కాగా, కింది స్థాయిలో గ్రామ గ్రామాన ఎంకెఎస్‌ఎస్‌ ను నిర్మాణం చేసి పటిష్ఠ పరిచింది కా|| దేవ్‌కుమార్‌ వంటి వారు. అప్పటికే కా||దేవ్‌కుమార్‌ పూర్తి కాలపు విప్లవకారుడిగా మారాడు. ఎంకెఎస్‌ఎస్‌ నాయకత్వంలో జహానాబాద్‌, గయా జిల్లాల్లో భూస్వామ్య వ్యతిరేక ప్రజా ప్రభంజనం ఎగిసింది. భూమిహార్‌, రాజ్‌పుత్‌, కుర్మీ, బ్రాహ్మణ భూస్వాముల భూస్వామ్య దోపిడీకీ, దాష్టీకానికీ వ్యతిరేకంగా ముసహర్‌, చమార్‌ వంటి దళిత కులాల వ్యవసాయ కూలీలు తమ ఆత్మగౌరవం కోసం, కూలీ రేట్ల పెంపుదల కోసం, అన్ని రకాల వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, భూస్వాముల అత్యాచారాలకు వ్యతిరేకంగా, దున్నే వారికే భూమిపై హక్కును సాధించడం కోసం ఒక్కటయ్యారు. పోరుబాట పట్టారు. ఎంకెఎస్‌ఎస్‌ నాయకత్వంలో, కా||దేవ్‌కుమార్‌ వంటి విప్లవకారుల నాయకత్వంలో ధర్నాలు, ప్రదర్శనలు, భూఆక్రమణలు, భూస్వాముల కచహరీల (గడీల) కూల్చివేతలు ఒక ఉద్యమంలా కొనసాగాయి. వీటన్నింటినీ భూస్వాములూ, భూమిహార్‌, కుర్మీ కులాల ధనిక రైతులూ, భూస్వాములూ సహిస్తూ పోలేదు. అన్ని రకాలా ప్రతిఘటించారు. రాజ్య యంత్రాంగ సహాయంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంతో ఆగకుండా, తమ అంగబలం, అర్థబలం, కుల బలంతో ప్రైవేటు సేనలను ఏర్పరచుకొని దాడులు చేసారు. ఆ దాడులను ప్రతిఘటించడం కోసం కా|| దేవ్‌కుమార్‌ తదితర విప్లవకారుల నాయకత్వంలో దళిత, పీడిత, తాడిత శ్రామికులు సాయుధ దళాలను ఏర్పరచుకున్నారు. దళాలను సాయుధం చేయడం కోసం భూస్వాములపై దాడులు చేసి, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో కా|| దేవ్‌కుమార్‌ మిలిటెంట్‌ నాయకత్వం వహించాడు. పోలీసుల నుండి ఆయుధాలను మొదటిసారిగా లాక్కునే సైనిక చర్యలో కూడా ముందు నిలిచింది కా|| దేవ్‌కుమార్‌/అరవింద్‌.

ఎంకెఎస్‌ఎస్‌ నాయకత్వంలో విస్తృతంగా ప్రజలను సమీకరించి మిలిటెంట్‌ పోరాటాలను నడుపుతూ, వేలాది మందితో దొరల గడీలపై దాడులు చేసి, ధ్వంసం చేయడంతో పాటు, సాయుధ దళాలతో భూమిసేనపై దాడులు చేయడం ద్వారా వందలాది గ్రామాల్లో భూస్వాములను ప్రజా కోర్టుల్లో ప్రజల ముందు లొంగిపోయేలా చేసి భూస్వామ్యం పై గట్టి దెబ్బ తీయడంలో కా|| దేవ్‌కుమార్‌ది అగ్రగామి పాత్ర. వెనకబడిన కులానికి చెందిన కూర్మీల భూమి సేనను ఓడించడంలో కీలక పాత్ర వహించిన కా|| దేవ్‌కుమార్‌ది కూడా యాదృచ్చికంగా కూర్మీ కులమే. గయా, ఔరంగాబాద్‌ పోరాటాలుగా ప్రసిద్ధికెక్కి పెరుగుతున్న ఈ విప్లవోద్యమంపై దాడి చేయడానికి జగన్నాథ్‌ మిశ్రా ప్రభుత్వం ఆర్వాల్‌లో జలియన్‌వాలాబాగ్‌ను తలపిస్తూ స్కూల్‌ను చుట్టుముట్టి అందులో సమావేశం జరుపుకుంటున్న రైతు కూలీలపై కాల్పులు జరిపితే 23 మంది చనిపోయారు. దీనికి వ్యతిరేకంగా ఇచ్చిన ʹʹఅసెంబ్లీ ఘెరావ్‌ʹʹ పిలుపు నందుకొని దాదాపు యాభైవేల మంది రాష్ట్ర రాజధాని పాట్నా వైపు కదులుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు జరిపి అడ్డుకోవడమే కాక ఎంకెఎస్‌ఎస్‌ను నిషేధించింది. నక్సలైటు పార్టీల కంటే కూడా ముందు అధికారికంగా నిషేధాన్ని ఎదుర్కొన్న తొలి సంస్థ ఎంకెఎస్‌ఎస్‌. ఇటువంటి సమయంలో ఎంకెఎస్‌ఎస్‌ నాయకులైన వినయన్‌ వంటి వారి నాయకత్వం గుండెలు జారి ఎంకెఎస్‌ఎస్‌ను నక్సలైటు పార్టీ నడిపిస్తున్నదనీ, దాని మిలిటెంట్‌, అతివాద పోరాటం వల్లనే నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వస్తున్నదనీ ఆరోపిస్తూ ఎంకెఎస్‌ఎసను ఒక మితవాద, లీగలిస్ట్‌ సంస్థగా మార్చే ప్రయత్నం చేసింది. అప్పటికి బహిరంగంగా ఉన్న ప్రధాన నాయకత్వమంతా కమ్యూనిష్టేతర నాయకత్వమే కావడంతో వారి వైఖరి విప్లవ శ్రేణుల్లో కొంత గందరగోళానికి దారితీసింది.అటువంటి సమయంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే విస్తృతంగా గ్రామాలను పర్యటించి, పీడిత వర్గాలను దృఢంగా విప్లవ పంథా వైపు నిలబెట్టడంలో కా||దేవ్‌కుమార్‌ కృషి అనితర సాధ్యమైనది.

ఈ క్రమంలో మొదట కుర్మీలు ఏర్పరచిన భూమిసేనను ఓడించాక, రాజపుత్‌లు బ్రహ్మర్షి సేనను ఏర్పరచారు. యాదవులు లోరిక్‌ సేనను ఏర్పరుచుకున్నారు. పలామూ, గయా, చత్రా జిల్లాల్లో ముస్లిం భూస్వాములు సన్‌లైట్‌ సేనను ఏర్పరుచుకున్నారు. వీటన్నింటినీ పార్టీ యూనిటీ, ఎంసిసిల నాయకత్వంలో విజయవంతంగా శ్రామికవర్గాల ప్రజలు ఓడించారు. ఆ సమయంలో పార్టీ యూనిటీకి సైనిక నాయకత్వం అందించిన వారిలో కా||అరవింద్‌ ప్రముఖుడు.

ఈ సేనలన్నింటినీ మించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ బలంతో, అధికార యంత్రాంగపు దన్నుతో ఏర్పడింది రణవీర్‌ సేన. మొదట భోజ్‌పూర్‌ ప్రాంతంలో ఏర్పడిన రణబీర్‌ సేన అక్కడ విప్లవ ప్రజానీకంపై దాడులను చేసినపుడు, సిసిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నుండి ఏటువంటి సాయుధ ప్రతిఘటనను ఎదుర్కోలేదు. దానితో అక్కడ క్రమంగా బలం పుంజుకుని సోన్‌ నది దాటి పాట్నా, జహానాబాద్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లో కూడా విప్లవోద్యమంపై దాడులకు పూనుకొని లక్ష్మణ్‌పూర్‌, బాధే వంటి గ్రామాలపై దాడులు చేసి, పనిపిల్లతో సహా అరవై మందినీ, నలభై మందినీ అత్యంత అమానవీయంగా హత్య చేసింది. ఈ భూమిహార్ల సేనకు బీహార్‌లోని అధికార యంత్రాంగంపై పట్టు కలిగిన భూమిహార్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులే కాక, ఎంఎల్‌ఏ లు ఎంపిలు (అ)న్యాయమూర్తులు కూడా మద్దతుగా నిలిచారు. ఈ రణవీర్‌ సేనపై ఎన్నో దాడులకు విజయవంతంగా పథక రచన చేసి అమలు పరిచింది కా||అరవింద్‌ నాయకత్వంలోనే.

భూస్వామ్య వ్యతిరేక పోరాటం క్రమంగా రాజ్య ప్రత్యక్ష జోక్యం, అణచివేతల కారణంగా రాజ్య వ్యతిరేక పోరాటంగా, గెరిల్లా యుద్ధంగా పరిణమించింది. ప్రభుత్వ బలగాలను సాయుధంగా ప్రతిఘటించకుండా, ప్రతిఘటనలో భాగంగా ఆత్మరక్షణా దాడులు చేపట్టకుండా విప్లవోద్యమం నిలదొక్కుకోవడం అసాధ్యం. ఇటువంటి కీలక మలుపులోనే లిబరేషన్‌ వంటి ఎన్నో నక్సలైటు పార్టీలు వెనుకడుగు వేసి పార్లమెంటరీ పంథాలోనో, మితవాదంలోనో, రివిజనిజంలోనో కూరుకుపోయాయి. కీలకమైన ఈ మలుపులో సాయుధ పోరాటంలో సరైన పంథాను చేపట్టిన పార్టీలు పీపుల్స్‌వార్‌, పార్టీ యూనిటీ, ఎంసిసిలు.

ఈ పంథాను చేపట్టిన పార్టీ యూనిటీని గెరిల్లా యుద్ధంలో ముందుండి నడిపి, నాయకత్వం వహించిన వాడు కా|| అరవింద్‌. 95-97లో ఈ విషయంలపై పార్టీ యూనిటీలో జరిగిన అంతర్గత రాజీకయ పోరాటంలో సరైన పంథాను చేపట్టి బీహార్‌, ఝార్ఖండ్‌లలో గెరిల్లాయుద్ధాన్ని నిర్మించడంలోనూ, ఆ క్రమంలో 1998లో పార్టీ యూనిటీ, పీపుల్స్‌వార్‌ల ఐక్యతకు బలమైన భూమికను ఏర్పరచడంలో కా|| అరవింద్‌ది కీలక పాత్ర.

ఆ తరువాతి కాలంలో, 2006లో భారతదేశంలోనే కాక, ప్రపంచ వ్యాపితంగా విప్లవ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించిన ʹజహానాబాద్‌ జైల్‌ బ్రేక్‌ʹ సైనిక కోణంలో ఒక కోరాపుట్‌ దాడికి, ఒక నయాగఢ్‌ దాడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దాడి. ఎన్నో సైనిక శిబిరాలను (సిఆర్‌పిఎఫ్‌, జిల్లా పోలీసు బలగాల క్యాంపులను) ఏక కాలంలో నిలువరిస్తూ విజయవంతంగా జైలు గోడలను బద్దలు కొట్టి రాజకీయ ఖైదీలను విడుదల చేయడంతో పాటు కొందరు ప్రముఖ రణవీర్‌సేన నాయకులను మట్టుబెట్టిన దాడి అది. దానికి స్థూలంగానూ, సూక్ష్మస్థాయిలోనూ, పథక రచన చేయడమే కాక కా|| అరవింద్‌ స్వయంగా పాల్గొని నాయకత్వం వహించాడు.

2007లో సిపిఐ మావోయిస్టు 9వ (ఐక్యతా) కాంగ్రేసు జరిగిన తరువాత కా||అరవింద్‌ ఆరోగ్యం బాగా క్షీణించింది. మధుమేహంతో పాటు రకరకాల అనారోగ్యాలకు గురయ్యాడు. రోజుకు డజన్ల కొద్దీ మందులు వేససుకోవడమే కాక, రకరకాల ఆహారపు విధినిషేధాలు పాటించవలసిన పరిస్థితి. 2007 నుండి మరీ ముఖ్యంగా 2009 నుండి గ్రీన్‌హంట్‌ దాడి మొదలయ్యాక దినదినమూ పెరుగుతున్న నిర్బంధం మధ్య అంత అనారోగ్యంతో గెరిల్లాజోన్‌లోనే ఉండటమే కాక, నాయకత్వం వహించడమెట్లా అనే సమస్యను కా|| అరవింద్‌ ఎదుక్కొన్నాడు. మరొకవైపు ఎందరో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకుల అరెస్టులూ, కొందరి లొంగుబాట్లూ కారణంగా కా|| అరవింద్‌ పై విపరీతంగా పని ఒత్తిడి పెరిగింది. దాదాపు పదేళ్లపాటు తీవ్రమైన అనారోగ్యం మధ్యనే పిఎల్‌జిఏ సైనికుల, ప్రజల మద్దతుతో నిప్పులు చెరిగే నిర్బంధం మధ్యనే వేలాది సిఆర్‌పిఎఫ్‌ బలగాల చుట్టివేతను ఎదుర్కుంటూనే కార్యక్షేత్రంలోనే తుదికంటా ఉన్నాడు. చివరి నాలగైదు ఏళ్ళ పాటు ఆయన మకాం వేసి ఉన్న లాతేహార్‌, గుమ్లా అడవుల్లో అతన్ని మట్టుబెట్టడం కోసం ప్రత్యేకమైన ఆపరేషన్లనెన్నింటినో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు కలిపి నిర్వహించాయి. అయినా దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆ బలగాలే దెబ్బతిని వెనుతిరగాల్సి వచ్చిందే తప్ప కా||అరవింద్‌ దగ్గరిలోకి కూడా వెళ్ళలేక పోయాయి. అత్యంత అనారోగ్యంతో ఉండి నడవలేని పరిస్థితిలో కొన్ని ఏళ్ళు ప్రయాణాలకై గుర్రాన్ని వాడి, ఆ తరువాత అది కూడా సాధ్యం కాక, తమ నాయకుణ్ణి పి.ఎల్‌.జి.ఏ. సైనికులు మోసుకుని వెళ్ళేవారు. పట్టుమని పది అడుగులు వేయటం కూడా కష్టమైన స్థితిలో కూడా కార్యక్షేత్రంలోనే ఉంటూ తనకు అత్యంత ప్రీతిపాత్రులైన, ప్రజల మధ్య ప్రజా సైనికుల మధ్యే తుదకంటా ఉండాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న ఆదర్శవంతమైన గొప్ప విప్లవకారుడు, ప్రజా నాయకుడు, ప్రజా సైన్య సేనాని కా||దేవ్‌కుమార్‌ (కా||అరవింద్‌).

అతడికి వినమ్రంగా విప్లవ జోహార్లు. అతడి మృత్యువు విప్లవోద్యమానికి తీరని లోటు. కానీ అతడు తన సహచరులందరికీ నేర్పించిన రాజకీయపరమైన పాఠాలూ. సంస్థాపరమైన పాఠాలూ, సైనిక పాఠాలూ మాత్రం ఎన్నటికీ మరువలేనివి. అవి అతడిలాంటి యోధులను తప్పక తయారు చేస్తాయి.

(జైలులో ఉన్న కాలంలో కా||అరవింద్‌ సహచరులైన విప్లవ నాయకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా)
- రవి నర్ల

Keywords : maoists, aravind, bihar, jarkhand,
(2024-04-13 12:25:37)



No. of visitors : 1823

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు

బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో, బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని లుతువా తోలా బాబు రామ్‌దిహ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద కట్టిన గట్టుపైన ఆజ్ఞాత వ్యక్తులు ఒక మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోయారు.

బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?

అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా, మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం.

టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం

బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలోని నూట ఎనిమిది గిరిజన గ్రామాలు ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. గత నెలలో బీహార్ పోలీసులు ఈ ప్రాంతంలోని గిరిజన గ్రామాలపై విరుచుకుపడి గ్రామస్తులను దారుణంగా కొట్టి అనేక మందిని అరెస్టులు చేసినందుకు నిరసనగా, తమ ప్రాంతాన్ని టైగర్ రిజర్వుడు ఫారెస్టుగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, మ

ఊరు మునుగుతుంది ఇసుక తవ్వకండి అన్నందుకు... లాఠీచార్జ్, టియర్ గ్యాస్,సంకెళ్ళు, జైలు....

ఇసుక తవ్వకాలు జరిపితే వర్షాకాలంలో తమ గ్రామం మునిగిపోతుందని, తవ్వకాలు జరపొద్దన్నందుకు అనేక మంది మహిళలు, పురుషలు, పిల్లలు, వృద్దుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భూస్వామ్య