include 'men';
?>
ఏఎంయూలో ఏబీవీపీ వీరంగం - విద్యార్థులపై దాడులు !
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) అట్టుడుకుతున్నది. దశాబ్దాల కాలం నుంచి ఏఎంయూ స్టూడెంట్ యూనియన్ కార్యాలయంలో ఉన్న పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఫొటోపై ఏబీవీపీ తాజాగా వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై వర్సిటీలో దాడులకు తెగబడింది. బుధవారం జరిపిన దాడుల్లో దాదాపు 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తున్నది. వారిని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కళాశాలలో చేర్చారు. మిగిలిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
కాగా, ఏబీవీపీ దాడికి నిరసనగా గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వర్సిటీలో ఉండగానే హిందూత్వ గ్రూపులు ఈ దాడికి తెగబడ్డారు. బుధవారం వర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు, విద్యార్థుల మండలి జీవితకాల సభ్యుత్వం స్వీకరించేందుకు అన్సారీ విచ్చేసారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏబీవీపీ విద్యార్థులు దాడులకు తెగబడ్డారని ఏఎంయూఎస్యూ ఆరోపించింది. ఏఎంయూకు వచ్చిన ఉప రాష్ట్రపతిని లక్ష్యంగా చేసుకొని ఘర్షణలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకొనే వరకూ తమ ఆందోళన ఆగేదిలేదని స్పష్టంచేసింది. దాడులకు తెగబడినవారిపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన జిల్లా యంత్రాంగం, పోలీసులపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఏఎంయూ విద్యార్థి సంఘం నిర్ణయించింది. హింసకు తెగబడిన ఏబీవీపీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలంటూ ఏఎంయూ టీచర్స్ అసోసియేషన్ కూడా జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఉద్దేశపూర్వకంగానే ఏబీవీపీ విద్యార్థులు ఆయుధాలు చేతబూని కళాశాలలో ఉద్రిక్తవాతావరణం సృష్టించారని ఆరోపించింది. ఇదిలావుండగా, ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్లోకి అడుగుపెట్టడం, ఘర్షణల్లో పోలీసుల పాత్రపై దర్యాప్తుకు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.
వర్సిటీలోని జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలంటూ స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ ఇటీవల ఏఎంయూకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఏబీవీపీ ఈ దాడులకు పాల్పడింది.
బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ రాసిన లేఖకు ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వారు మీడియాకు వివరణ ఇచ్చారు. ʹజిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్థాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు జిన్నా కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుడూ ఆ చిత్రపటం గురించి అభ్యంతరం వ్యక్తం చేయలేదుʹ అన్నారు.
Keywords : amu, alighar. bjp. abvp, hindutva, students
(2024-03-19 00:17:41)
No. of visitors : 952
Suggested Posts
| గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు.... |
| బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్ఎస్ఎస్ అసలు రంగు ఆర్ఎస్ఎస్ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది.... |
| బీఫ్ తినడం నేరం కాదు - మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పుగో మాంసంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది... |
| హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావుఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు.... |
| HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మతోన్మాద గుండాల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కారణమైన సుశీల్ కుమార్, బీజేపీ నాయకుడైనా అతని సోదరుడు మరో ముప్పై మందితో కలిసి నిన్నరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారు. గత వారం పది రోజులుగా |
| ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి! |
| ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడూ సరైన అవగాహనను అందిస్తూ, ప్రజల పక్షాన గొంతును వినిపించే లామకాన్, ముగ్గురు ప్రముఖ ఉద్యకారులను ఒకే వేదికమీదికి తీసుకువస్తోంది.
ఆగస్టు 15 సాయంత్రం 7 గంటలకు లామకాన్లో నిర్వహించే..... |
| ముజఫర్ నగర్ బాకీ హై22 రాష్ట్రాలు, 44 పట్టణాలు, 50 ప్రదర్శనలు... ఇది బాహుబలి సినిమా కాదు... మతోన్మాద రాజకీయాల్నినగ్నంగా నిలబెట్టిన డాక్యుమెంటరీ చిత్రం. వర్తమాన చరిత్రకు సాక్ష్యం..... |
| మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు..... |
| వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.ఛత్తీస్గడ్లోని దుర్గ్ జిల్లాలోని జమూల్ నగర్ నిగమ్ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్పూర్ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..