పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
తెలంగాణ విద్యార్థి వేదిక (TVV) ప్రెస్ నోట్ పూర్తి పాఠం
విద్య అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. విద్య చదువుకున్న వ్యక్తికి ఉపాధిని మాత్రమే కాకుండా, ఈ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధముగా ఒక సామాజిక దృక్పథం కూడా ఇవ్వలని,విద్య పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే సరుకుగా ఉండకూడదని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతున్నది.
కానీ దేశంలోను,రాష్ట్రంలోను,ప్రయివేటుకరణం,విధానాలను ప్రభుత్వలు అమలు చేయడం ప్రారంభమైన తరువాత విద్యా రంగంలో కూడా రోజురోజుకూ ప్రైవేటుకరణ పెరిగిపోతు వస్తున్నది,పాఠశాలలను,కళాశాలలను, విశ్వవిద్యాలయాలు అవసరమైన సంఖ్యలో స్థాపించాకపోవడము,ఉన్నవాటిని,సరిగా నిర్వహించాకపోవడము వలన చివరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెరిగిపోతు వచ్చాయి.
నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేటు పాఠశాలల్లోనేవిద్యార్థులు సంఖ్యా ఎక్కువగా ఉంది.కళాశాల విద్యలో ఈ స్థితి ఎప్పుడో వచ్చింది.ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును టిఆర్ ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదీపచేసింది.
విద్య ఈ రకంగా ఒక వ్యాపార సరుకుగా మరకూడదని కేజీ నుండి పీజీ విద్యను
ప్రభుత్వమే ఉచితంగా అందించాలని ఆ విద్య నాణ్యమైన విధముగా ఉండాలని, దళితులు, ఆదివాసులు,ముస్లింలు,స్ర్తిలు మొదలైన వెనుకబడిన వర్గాల వారందరికీ విద్య సమానమైన అవకాశాలతో అందుబాటులో ఉండాలి,అందుకోసం పాఠశాల స్థాయిలో స్వీడన్,ప్రాన్స్,బ్రిటన్,దేశాల్లో మాదిరిగా కామన్ స్కూల్ విద్యావిధానం ఉండాలని, కళాశాల స్థాయిలో కామన్ విద్యా విధానం ఉండాలని టివివి డిమాండ్ చేస్తుంది..
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఅరెఎస్ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మ్యానిఫెస్టోలో కామన్ స్కూల్ నా కల అని ప్రకటించి నేడు దానిని గాలి కి వదిలేశాడు, కార్పొరేట్ కు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు. కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని మరచి, వివిధ సామాజిక వర్గాలకు కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపింస్తూ దాన్ని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యలో భాగమని చెపుతున్నాడు..మార్చి15 నుండి 26 వరకు గ్రామంలో పదవ తరగతి పరిక్ష కేంద్రాలలో వివిద ప్రాంతలలో రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైత్యనా, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థల్ని రద్దు చేయాలని టివివి ప్రచారయాత్ర నిర్యాహించింది, ఇదే డిమాండ్ తో మార్చి 27 న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడించడం జరిగింది .నేడు మళ్ళీ అదే నినాదంతో టీవివి 01 మే నుండి 10 వరకు ఒకే చదువుకై పల్లె బాట తో ప్రజల వద్దకు వెళ్ళింది.
తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) పల్లె బాట కార్యక్రమం నల్గొండ జిల్లా శాలిగౌరారం(ఊట్కూరు గ్రాముము)లో మొదలు పెట్టి
,షౌలగూడెం,మాధవరం, ఇటుకులపాడు, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి,మశిరెడ్డి పల్లె,ఈటూరు, ఫణిగిరి,పస్తలా,పసూనూర్,తుంగతుర్తి, కరివిరాల కొత్తగూడెం, సంగెము, వెంకేపల్లి, చిల్పకుంట్ల, నూతనకల్, ఇస్తాలపురము,రామన్నగూడెం, ఎపురు, ఇట్లా వివిధ గ్రామాల్లో పర్యటించి
సూర్యాపేటను చేరుకుంటుంది. ఉచిత విద్య పోరాటం లో భాగము కావాలి అని ప్రజలను చైత్యనము చేయడము జరిగింది.
ఇట్లా ప్రతి గ్రామంలోకి వెళ్లి పల్లెల్లో ఉన్న ప్రజలను కలిసి, ప్రవేటు విద్యా సంస్థలు తీరు వాటికి సహకారం గా ఉన్న ప్రభుత్వల తీరును ప్రజలకు వివరించడం జరిగుతుంది. ఇంకా మరి ఎన్నో గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది .
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షులు మద్దిలేటి, ఉపాధ్యక్షులు అందీప్,రాష్ట్ర నాయకులు గోపినాథ్ ,గుండాల సందీప్, కరికే మహేష్,పెరల గోపి,బలరాం,భరత్, నవీన్,అనిల్,నాగరాజు,గణేష్,అరుణ్, అనిల్,ప్రవీణ్,రాజు,మోతీరాం, అశోక్,రెహమాన్ తదితరులు పాల్గొన్నారు..
డిమాండ్స్
----------------------------------------
#కామన్ స్కూల్ విద్యా,విధానాన్ని అమలు చేయాలి.
#MLA, ఎంపీ,ప్రజాప్రతినిధుల,పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగస్థూల పిల్లలుందరిని ప్రభుత్వ స్కూల్లోనే చడవించాలి అనే చట్టము తీసుకురావాలి.
#అనుమతి లేని స్కూళ్లను రద్దు చేయాలి,కొత్తగా ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి ఇవ్వకూడదు.
#శ్రీ చైత్యనా, నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
#విద్యార్థులు చనిపోవడానికి ప్రత్యక్ష కారకులైన శ్రీ చైత్యనా, నారాయణలపై హత్యానేరం 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి.
#విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.
#విద్యాసంస్థల్లో,విశ్వవిద్యాలయాల్లో కులము పేరుతొ జరిగే వ్యవస్థీకృత హత్యలు ప్రభుత్వం పూర్తిగా నియంత్రించాలి.
- తెలంగాణ విద్యార్ధి వేదిక (TVV)
Keywords : tvv, telangana, students
(2024-03-18 15:28:41)
No. of visitors : 1992
Suggested Posts
| నలమాస కృష్ణ, మద్దిలేటిల అరెస్టు చట్టబద్దం కాదు - హైకోర్టుతెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థి మద్దిలేటిల అరెస్టు చట్టబద్దంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం పై పోలీసులను, ట్రయల్ కోర్టుల న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా మందలించింది. |
| ఓయూ విద్యార్థి భరత్ అక్రమ అరెస్ట్...విడుదల కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలుతెలంగాణ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చత్తీస్ గడ్ పోలీసులకు అప్పగించిన తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భరత్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా |
| పోలీస్ కమిషనర్ ప్రకటనపై కేసీఆర్ స్పందించాలి : ప్రజా సంఘాలు రాష్ట్రంలో ప్రతి పక్షాలు అమ్ముడు పోయాయని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, అందుకే ఆ పాత్రను ప్రజా సంఘాలు పోషిస్తున్నాయని అన్నారు. విప్లవ రచయితల సంఘంపై 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిషేధం విధిస్తే, ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేసీఆర్ తప్పుబట్టాడని గుర్తు చేశారు. |
| Condemn arrest and onslaught on TVV and others activists - SFSSFS strongly condemns the premeditated arrest of Telangana Vidyarthi Vedika (TVV), Chaitanya Mahila Secretary (CMS), Student March and other progressive and democratic organizationsʹ activists. The Nallakunta police has raided TVV President Maddiletiʹs house for his alleged link with banned maoist party. Gadwal police arrested two TVV members Naganna a |
| కేసీఆర్ ఓ నియంత : విరసం కార్యదర్శి పాణి ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల సమస్యలపై ప్రశ్నించడం పాలకులకు కంటగింపవుతోంది.. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పాలకులు రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజల పక్షం వహించి ప్రశ్నిస్తున్న బుద్ధిజీవులపై దాడులు, అక్రమ కేసులు, అరెస్టుల పరంపరలోనే జగన్ అరెస్టు జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ దోరణిని ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండిం |
| నలమాస కృష్ణ, మద్దిలేటి అరెస్ట్...అక్రమం అంటున్న ప్రజా సంఘాలుగద్వాల పోలీసులు ఇవ్వాళ్ళ పొద్దున హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంపై దాడి చేసి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను అరెస్టు చేశారు. |
| తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?శాతవాహన యూనివర్సిటీలో బీజేపీకి చెందిన బిజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగానే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులు వెంటనే విచారణ జరిపి అక్కడి గొడవలకు కారణమెవరో తెలుసుకోవాలని వారు డిమాండ్ చేశారు. |
| ప్రజాసంఘాల నేతలను కోర్టులో హజరుపరచకపోవడంపై హైకోర్టు ఆగ్రహం - రేపటిలోగా హాజరు పరచాలని ఆదేశంపోలీసులు అరెస్టు చేసిన ప్రజా సంఘాల నేతలను శుక్రవారం ఉదయంలోగా కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆదేశించారు. |