తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?
(వీక్షణం జూన్, 2018 సంచికలో ప్రచురించబడిన సంపాదకీయ వ్యాఖ్య)
ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలా లెక్కాపత్రం లేకుండా వచ్చి పడుతున్న నిధులు ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి, అక్రమాలు, అడ్డదారులు, దొంగతనాలు, బందిపోట్లు సాధారణమే. ఆ నిధుల గురించి లేని భగవంతుడు ఎలాగూ మాట్లాడడు. ఆ నిధుల కైంకర్యం గురించి మాట్లాడితే కళ్లుపోయేంత అపచారమని భక్తులు కళ్లు మూసుకుంటారు. ఇక దోచుకున్నవాడికి దోచుకున్నంత. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతున్నదో, నిర్ణయాధికార స్థానాలలో ఉన్న ఎవరెవరు ఎంత భోంచేశారో బహుశా ఎప్పటికీ బైటపడకపోవచ్చు. కాని తోడుదొంగల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇటువంటి రహస్యాల్లో అరకొర అయినా మూసిన పిడికిట్లో నుంచి జారి బైటపడతాయి. అలా పురోహితుల మధ్య ఘర్షణ, ఒక పురోహితుడి పట్ల మితిమీరిన ఆదరణ, మరొక పురోహితుడి పట్ల నిరాదరణ తిరుమల ఆస్తుల కందిరీగ తుట్టెను కదిల్చాయి. ఎప్పుడో మైసూరు మహారాజా వేంకటేశ్వర స్వామికి ఇచ్చిన వజ్రం లాంటిదే ఇటీవల జెనీవాలో వేలం పాటలో కనబడిందని ఒక ప్రధాన అర్చకుడు బాంబు పేల్చాడు. మొత్తం రాజకీయ పక్షాలు, ఆస్తిక శిఖామణులు, భక్తులు రెండు వర్గాలుగా మారి ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఇన్నాళ్లూ దాచిన రహస్యాలలో కొన్ని అయినా బైటికి వస్తున్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇద్దరు దొంగలు కొట్లాడుకుంటుంటే అందరి దొంగతనమూ తెలిసిన సమాజానికి బాగుంటుంది. అయితే ఇంత వివాదంలో కూడ ఇది దైవభక్తికి సంబంధించిన విషయం కాబట్టి అసలు సమస్యలు, అసలు ప్రశ్నలు వెలికి రావడం లేదు. ఇంతకీ తిరుమలలో తరతరాలుగా పోగుబడ్డ ఆస్తులు ప్రభుత్వానివా, అధికారులవా, అర్చకులవా, ప్రభుత్వాధినేతలో అధికారులో అర్చకులో ఆ ఆస్తులను స్వయంగా వాడుకోవడానికో, దేశాలు దాటించడానికో అధికారం ఉందా అనే ప్రశ్నలు రావడం లేదు. తిరుమలలో పోగుబడిన ఆస్తులలో అత్యధిక భాగం పేద, మధ్యతరగతి ప్రజలు మూఢభక్తితో, నమ్మకంతో హుండీలో వేసిన చెమటా నెత్తురూ అని, దానిలో కొంతభాగం సంపన్నులు వేసినది కూడ ఉంటే అది కూడ వారి అక్రమార్జనలో ఒక భాగమే అయి ఉంటుందని గుర్తించవలసి ఉంది. అది ప్రజల సంపద. నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కూడ కాదు గనుక ఆ ఆస్తులను ఆక్రమించడానికి ప్రభుత్వానికీ, దాని అధికారులకూ అధికారం లేదు. అర్చకులు కేవలం అక్కడ పూజాదికాలు నిర్వర్తించే ఉద్యోగులు గనుక, జీత భత్యాలు పొందుతున్నారు గనుక ఆ ఆస్తుల మీద వారికీ అధికారం లేదు. ఆ ఆస్తులు న్యాయంగా ప్రజలకు చెందాలి. పంపిణీ చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనుకుంటే, కనీసం ఆ ఆస్తులను ప్రజల విద్యా, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల కొరకు ఖర్చుపెట్టాలి.
Keywords : ttd, tirumala thirupathi devasthanam, andhrapradesh
(2022-06-27 09:45:28)
No. of visitors : 1124
Suggested Posts
| లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా రేపు ఏపీ బంద్ - మావోయిస్టు నేత గణేష్ పిలుపువిశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో లేటరైట్, బాక్సైట్ అక్రమ మైనింగ్ లకు నిరసనగా సిపిఐ (మావోయిస్ట్) ఆగస్టు 10 న రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు,సమాజంలోని అన్ని వర్గాల |
| మన్యంలో నెత్తురు పారిస్తున్న జగన్ సర్కార్వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో తీవ్రమైన అణచివేత చర్యలకు పరాకాష్టగా సెప్టెంబర్ 22, ఆదివారం మధ్యాహ్నం విశాఖ ఏజెన్సీలో ఒక బూటకపు ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇప్పటికీ ఈ ఘటన గురించి పోలీసులు వాస్తవాలు చెప్పడం లేదు. |
| నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...సీతామాతను అపహరించి చెరబట్టాడని రావణుని ద్వేషిస్తున్నాం. ద్రౌపదీమాతను వస్త్రాపహరణ యత్నించిన కారకులనూ, ప్రేరకులు అయిన దుర్యోధనాదులను దూషిస్తాం. ఎందుకూ? వీరిలో ఎవరితోనూ, ఈ అమానుష ఘటనలతోనూ మనకు ఎట్లాంటి సంబంధం లేదే |
| గౌస్ పోలీసు దెబ్బలకు చనిపోలేదట...బైటికెందుకొచ్చావ్ అని అడగంగనే చనిపోయాడట !
గుంటూరు జిల్లాలో మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వచ్చిన ఓ యువకుడిని పోలీసులు లాఠీలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. |
| విశాఖ గ్యాస్ లీక్ అంశంపై 20 ప్రశ్నలు సంధించిన వృద్దురాలిపై కేసులు
12 మంది ప్రాణాలను బలితీసుకున్న ఎల్జీ పాలిమర్స్ ను వదిలేసి.. కేవలం ఫేస్ బుక్ లో ఆ దుర్ఘటనపై పోస్టుల పెట్టిన వారిని మాత్రం కేసులతో భయపెడుతోంది ఏపీ ప్రభుత్వం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపై |
| డేటా చౌర్యంలో దోషులెవరు ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇది గత నెలలో ఎన్నికల సంఘం అధికారిక లెక్కల అంచనా. అయితే ఫామ్ (6) ద్వారా ఎన్నికల
నోటిఫికేషన్ (మార్చ్ 18 - 25 వరకు నామినేషన్ల స్వీకరణ) లోపుగా సమర్పించుకునే వారు ఓటర్లుగా నమోదు కావడానికి మార్చి 15 వరకు గడవు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎన్నికల సంఘం మార్చి 10 వరకు ప్రకటించింది. |
| రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభప్రమాద వశాత్తు మరణించిన మావోయిస్టు నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ ఎలియాస్ రవి, ఎలియాస్ జైలాల్ సంస్మరణ సభ ఆదివారం నాడు జరగనుంది. ఆయన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం |
| రాజును మించిన రాజభక్తి: మోడీ పై భక్తి ని నిరూపించుకోవడానికి జగన్ తహ తహ
కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. దేశంలో కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు లేవు, అత్యవసరమైన ఆక్సీజన్ లేదు. రెమిడెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లో లక్షరూపాయల దాకా పలుకుతోంది. |
| జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తీవ్రతరం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఉద్యోగులను నిట్టనిలువునా ముంచివేసే మోసపూరిత పీఆర్సీ ఫిట్ మెంట్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు,జాబ్ క్యాలండర్ కోసం నిరుద్యోగులు, జీతాల పెంపు, రెగ్యులరైజేషన్ కోసం సచివాలయ ఉద్యోగులు, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని సెక్షన్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలకు ఏఓబీ ఎస్ జడ్ సీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది |
| అనంతపురంలో పోలీసుల దాష్టీకం - విద్యార్థులపై లాఠీచార్జ్అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థను ఎయిడెడ్ విద్యాసంస్థగానే కొనసాగించాలని కోరుతూ సోమవారం నాడు శాంతియుతంగా ఆందోళన దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. కళాశాల క్యాంపస్లోకి చొరబడి మరీ దాడి చేశారు. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..