తిరుమలలో పోగుబడ్డ ఆస్తులెవరివి ?
(వీక్షణం జూన్, 2018 సంచికలో ప్రచురించబడిన సంపాదకీయ వ్యాఖ్య)
ప్రజాస్వామిక పాలనలోనో, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలోనో కాదు, విచిత్రమైన వివాదాలతో వార్తలకెక్కాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టున్నది. భక్తిరసం తెప్పలుగా పారుతున్న తెలుగునాట, ఆపద మొక్కులవాడని, వడ్డికాసులవాడని పేరున్న వేంకటేశ్వర స్వామికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలా లెక్కాపత్రం లేకుండా వచ్చి పడుతున్న నిధులు ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి, అక్రమాలు, అడ్డదారులు, దొంగతనాలు, బందిపోట్లు సాధారణమే. ఆ నిధుల గురించి లేని భగవంతుడు ఎలాగూ మాట్లాడడు. ఆ నిధుల కైంకర్యం గురించి మాట్లాడితే కళ్లుపోయేంత అపచారమని భక్తులు కళ్లు మూసుకుంటారు. ఇక దోచుకున్నవాడికి దోచుకున్నంత. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతున్నదో, నిర్ణయాధికార స్థానాలలో ఉన్న ఎవరెవరు ఎంత భోంచేశారో బహుశా ఎప్పటికీ బైటపడకపోవచ్చు. కాని తోడుదొంగల్లో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇటువంటి రహస్యాల్లో అరకొర అయినా మూసిన పిడికిట్లో నుంచి జారి బైటపడతాయి. అలా పురోహితుల మధ్య ఘర్షణ, ఒక పురోహితుడి పట్ల మితిమీరిన ఆదరణ, మరొక పురోహితుడి పట్ల నిరాదరణ తిరుమల ఆస్తుల కందిరీగ తుట్టెను కదిల్చాయి. ఎప్పుడో మైసూరు మహారాజా వేంకటేశ్వర స్వామికి ఇచ్చిన వజ్రం లాంటిదే ఇటీవల జెనీవాలో వేలం పాటలో కనబడిందని ఒక ప్రధాన అర్చకుడు బాంబు పేల్చాడు. మొత్తం రాజకీయ పక్షాలు, ఆస్తిక శిఖామణులు, భక్తులు రెండు వర్గాలుగా మారి ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఇన్నాళ్లూ దాచిన రహస్యాలలో కొన్ని అయినా బైటికి వస్తున్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇద్దరు దొంగలు కొట్లాడుకుంటుంటే అందరి దొంగతనమూ తెలిసిన సమాజానికి బాగుంటుంది. అయితే ఇంత వివాదంలో కూడ ఇది దైవభక్తికి సంబంధించిన విషయం కాబట్టి అసలు సమస్యలు, అసలు ప్రశ్నలు వెలికి రావడం లేదు. ఇంతకీ తిరుమలలో తరతరాలుగా పోగుబడ్డ ఆస్తులు ప్రభుత్వానివా, అధికారులవా, అర్చకులవా, ప్రభుత్వాధినేతలో అధికారులో అర్చకులో ఆ ఆస్తులను స్వయంగా వాడుకోవడానికో, దేశాలు దాటించడానికో అధికారం ఉందా అనే ప్రశ్నలు రావడం లేదు. తిరుమలలో పోగుబడిన ఆస్తులలో అత్యధిక భాగం పేద, మధ్యతరగతి ప్రజలు మూఢభక్తితో, నమ్మకంతో హుండీలో వేసిన చెమటా నెత్తురూ అని, దానిలో కొంతభాగం సంపన్నులు వేసినది కూడ ఉంటే అది కూడ వారి అక్రమార్జనలో ఒక భాగమే అయి ఉంటుందని గుర్తించవలసి ఉంది. అది ప్రజల సంపద. నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కూడ కాదు గనుక ఆ ఆస్తులను ఆక్రమించడానికి ప్రభుత్వానికీ, దాని అధికారులకూ అధికారం లేదు. అర్చకులు కేవలం అక్కడ పూజాదికాలు నిర్వర్తించే ఉద్యోగులు గనుక, జీత భత్యాలు పొందుతున్నారు గనుక ఆ ఆస్తుల మీద వారికీ అధికారం లేదు. ఆ ఆస్తులు న్యాయంగా ప్రజలకు చెందాలి. పంపిణీ చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనుకుంటే, కనీసం ఆ ఆస్తులను ప్రజల విద్యా, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల కొరకు ఖర్చుపెట్టాలి.
Keywords : ttd, tirumala thirupathi devasthanam, andhrapradesh
(2019-02-17 16:35:40)
No. of visitors : 482
Suggested Posts
0 results
| రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
|
| బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
|
| కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి || |
| కలత నిద్దురలోనూ దండకారణ్యమే |
| బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
|
| చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలి |
| వీవీ, గాడ్లింగ్ లపై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం |
| వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
|
| stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur |
| Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating |
| Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions |
| ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు |
| రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు |
| పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ |
| నల్గొండలో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల |
| COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde! |
| దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు |
| Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh |
| మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్ తెల్తుంబ్డే |
| Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde |
| ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు |
| మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
|
| A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet |
| ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని |
more..