include 'men';
?>
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
ఈ రోజుల్లో మానవ సంబంధాలంటే కేవలం ఆర్థిక సంబంధాలే అన్నట్లుగా మారిపోయాయి రోజులు. కన్న తల్లిదండ్రులను కూడా మనీ మెషీన్లుగా చూస్తున్నారు. ప్రపంచమంతా ఫాదర్స్ డేను జరుపుకుంటూ తండ్రి ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పుకున్న రోజు ఆస్తి కోసం వృద్దులైన తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటి వేసిన సంఘటన చోటు చేసుకోవడం విచారకరం. రాత్రనకా పగలనకా కాయాకష్టం చేసి పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబ పెద్ద చివరికి సొంత గూడు లేకుండా రోడ్లపాలయ్యాడు. కూతురు పెండ్లి చేసి కుమారులకు ఇండ్ల కట్టించి.. పొలాలు సంసాదించి పెట్టిన ఆ తండ్రి చివరికి రోడ్లపై కూర్చోవలసిన దుస్థితి ఎదురైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామానికి చెందిన వీరమల్లు, కళమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరమల్లు కల్లుగీత వృత్తిపై, భార్య కూలినాలి చేసి కష్టపడి ఏడు ఎకరాల భూమి సంపాదించారు. ఆ భూమిలో రెండున్నర ఎకరాలు కళమ్మ పేరుతో, రెండు ఎకరాల పొలం చిన్న కొడుకు శ్రీనివాస్ పేరుతో, మరో రెండున్నర ఎకరాలు పెద్దకొడుకు వెంకటేశ్వర్లు పేరుతో పహాణీలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేశారు. ఈ క్రమంలో చిన్న కూతురుకు కట్నంతోపాటు పసుపు కుంకుమల కింద ఎకరం పొలం రాసిచ్చారు. మరో ఎకరం తమ కోసం ఉంచుకొని మిగిలిన ఐదు ఎకరాలను చెరి సగం రాసిచ్చారు.
అయితే చిన్న కొడుకు శ్రీనివాస్ తన పేరిట ఉన్న రెండు ఎకరాల పొలాన్ని ఇటీవల సాదాబైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. దీంతో ఈ వయసులో మేమెలా బతకాలి, మీ చెల్లెలి పరిస్థితేంటని ప్రశ్నించారు. అయితే అమ్మ పేరుతో ఉన్నది మీరే దున్నుకోమని చెప్పారు. కాని ఇటీవల ఆ చెల్కను ఇద్దరు కొడుకులు కలసి దున్నుకుంటుండగా తల్లి దండ్రులు ప్రశ్నించారు. చెల్క కూడా మీరే తీసుకుంటే మేం ఎట్లా బతకాలని వారిద్దరినీ అడ్డుకున్న తండ్రిపై కొడుకులు ఇద్దరూ దాడి చేశారు. ఇంకో సారి పొలం పేరెత్తితే చంపుతామని బెదిరించారు.
దీంతో వీరమల్లు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దీంతో కొడుకులిద్దరినీ తీసుకొని రమ్మని ఎస్సై దీపక్ కానిస్టేబుల్ను గ్రామానికి పంపారు. అయితే కానిస్టేబుల్ ముందే ఇద్దరు కోడళ్లు అత్తమామలను దుర్భాషలాడుతూ ఇంట్లోంచి గెంటేసి తాళం వేసుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో గ్రామంలోని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుని ఆదివారం సర్పంచ్, ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంటి తాళం తీయకపోగా చంపుతామని కొడుకులు బెదిరించడంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వీరమల్లు, కళమ్మ మాట్లాడుతూ ʹకనీ పెంచి పెద్ద చేసినం.. పెళ్లిళ్లు చేసి చెరో ఇళ్లు కట్టించడంతో పాటు ఉన్న భూమి పంచి ఇచ్చినం.. మేమూ ఇల్లు కట్టుకుని వాళ్లమీద ఆధారపడకుండా బతుకుతున్నం. ఉన్న భూమి తీసుకొని చంపుతామని బెదిరిస్తున్నరు.. కొడుకుల నుంచి రక్షణ కల్పించి మా భూమి మాకు ఇప్పించాలిʹ అని వేడుకున్నారు.
కాయాకష్టం చేసి పిల్లలను పెంచి.. పెద్ద చేసి.. వారికి పెండ్లిళ్లు కూడా చేసిన తల్లిదండ్రులు చివరకు రోడ్డు పాలవడం ఆ గ్రామంలోని ప్రతీ ఒక్కరినీ కలచి వేసింది. కేవలం ఆస్తి కోసం మానవత్వాన్ని మరచి తల్లదండ్రులను రోడ్డు పాలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి పోలీసులైనా వీరికి న్యాయం చేస్తారా..? లేదా కొడుకులకే వత్తాసు పలుకుతారా అనేది చూడాలి.
Keywords : human values, financial relations, warangal, sangem, property, మానవ సంబంధాలు, ఆర్థిక బంధాలు, వరంగల్, సంగెం
(2024-03-08 21:13:44)
No. of visitors : 1236
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..