కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
భూ పోరాటం చేస్తున్న కోలుకొండ దళితుల పై బ్రాహ్మణీయ ఫాసిస్టు తెలంగాణా ప్రభుత్వ యంత్రాంగం పెట్టిన కేసుల్ని ఎత్తి వేయాలి!
దళితులకు 3 ఎకరాల హామీని తెలంగాణా ప్రభుత్వం నిలబెట్టుకోవాలి!
వరంగల్ జిల్లా కోలుకొండ జాగీర్దారు రాణీ వెంకట జానకమ్మ భూముల్లో వెట్టి చేసిన 167 దళిత కుటుంబాలు, తమకు అట్టి భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తు 25 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. 2014 లో అధికారంలోకి రావడానికి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి హామీని గుర్తుచేస్తూ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసుకున్నారు. అయినప్పటికీ బ్రాహ్మణీయ ఫాసిస్టు తెలంగాణా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు.
దాంతో గత 13 వ తేదీన గ్రామంలోని దళిత కటుంబాలు, నిరాహారదీక్షా శిబిరం నుండి ర్యాలీగా వెళ్లి 197 సర్వేనెంబర్ తో ఉన్న 40 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని దేవరుప్పుల పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం నరేందర్ రెడ్డి 447, 427 r/w IPC ప్రకారం ఇల్లందుల శ్రీనివాస్ పై ఏడేళ్ల శిక్షార్హమైన కేసు నమోదు చేసి సమన్లు జారీ చేశారు. అతనితో పాటు నిరాహారదీక్షా శిబిరంలో ఉన్న 10 మంది మహిళలు, 5 గురు యువకులపై కోలుకొండ వీయార్వో ప్రవీణ్ రెడ్డి నివేదిక, దేవరుప్పుల తహశీల్దార్ ఫిర్యాదు ననుసరించి, దేవరుప్పుల పోలీసులు కేసులను మోపి భయోత్పాతానికిి గురి చేస్తున్నారు. దళితులు స్వాధీనం చేసుకున్న భూమిని చదును చేస్తున్న కిరాయి ట్రాక్టర్ డ్రైవర్ లకు ఫోను చేసి ʹదళితులకు సహకరిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామనిʹ పోలీసులు, తహశీల్దార్ బైరి వీరస్వామి బెదిరిస్తున్నారు.ఇది గర్హనీయం. అప్రజాస్వామికం.
అట్లాగే, గతంలో కబ్జా కోరల్లోంచి గ్రామంలోని రామసముద్రం చెరువును కాపాడాలని దేవరుప్పుల తహశీల్దార్ కు విజ్ఞప్తి చేయడానికి వెళ్లి వస్తున్న శ్రీనివాస్ ను కులం పేరుతో (ʹమాదిగ లంజకొడుకʹ అని) తిట్టిన వీయార్వో ప్రవీణ్ రెడ్డి పై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పై ఎటువంటి చర్య తీసుకోని పోలీసులు, ఇప్పుడు అదే వీఆర్వో నివేదిక ఆధారంగా ఇల్లందుల శ్రీనివాస్ పై కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్య. ఈ మొత్తం గొలుసు కట్టు చర్యలలో కోలుకొండ దళితులను అణిచివేస్తు, అన్యాయానికి గురి చేస్తున్నటువంటి నయా పెత్తందారీ రాజకీయ నాయకత్వం, అవినీతి పోలీసు అధికారులతో మిలాఖతైన బాధ్యతా రహిత రెవిన్యూ అధికారుల చర్యలను విప్లవ రచయితల సంఘం ఖండిస్తోంది.
ఇల్లెందుల శ్రీనివాస్ పై పెట్టిన ఐపీసీ 447, 427 కేసులను ఎత్తివేయాలి. మాచర్ల సాయిలు, గనుపాక పర్శరాములు, సామల నరేశ్, చింత సోమయ్యలతో పాటు 10 మంది మహిళలు తదితర కోలుకొండ దళితులపై నంబరు లేని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే చర్యలను దేవరుప్పుల పో లీసులు మానుకోవాలి. పాత జాగీర్దారు భూముల్లో, రాజకీయ అండతో పాగా వేసిన స్థానికేతర రియల్టర్లు గంజి జనార్దన్ రెడ్డి, ఎదిరి శ్రీలతా రెడ్డి, పొట్లపల్లి గంగాధర రావు, పొట్లపల్లి చలపతిరావు, యామగాని నాగయ్య తదితరుల కబ్జాను తొలగించి, ఆ భూములను 167 వెట్టి కార్మిక దళితులకు పంపిణీ చేయాలి.
పెత్తందారీ రాజకీయ నాయకత్వం, అవినీతి రెవిన్యూ అధికారుల ఆసరాతో చింతకింది కృష్ణమూర్తి బినామీ గా ఉన్న పోలీసు ఉన్నతాధికారి, తదితరుల కబ్జాను తొలగించి, రామసముద్రం చెరువును కాపాడడం ద్వారా కోలుకొండ సబ్బండ వర్ణాల ప్రజల జీవనాధారాన్ని పరిరక్షించాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు 3 ఎకరాల భూమి ని పంపిణీ చేయడం ద్వారా ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం తన ఎన్నికల హామీని నెరవేర్చుకోవాలని విప్లవ రచయితల సంఘం డిమాండ్ చేస్తోంది.
పాణి, కార్యదర్శి
కాశీం, వరలక్ష్మి, బాసిత్, జగన్, గీతాంజలి, ఉదయభాను, ఇక్బాల్, రాంకీ ( కార్యవర్గ సభ్యులు)
వరవరరావు, కళ్యాణరావు (సీనియర్ సభ్యులు)
Keywords : warangal, dalits, virasam, land struggle
(2024-03-26 19:24:29)
No. of visitors : 1266
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |