include 'men';
?>
దళితులకు కటింగ్ చేశాడని.. బార్బర్ను చితకబాదిన అగ్రకుల ఉన్మాదులు..!
ప్రతీ రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అగ్రకుల అహంకారంతో.. తామే గొప్ప అనే భావదారిద్ర్యంలో ఉండే వ్యక్తులు ఇలాంటి దాడులకు తెగబడుతూ దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేవలం దళితులనే కాదు.. వారితో స్నేహం చేసినా, వారికి సహాయం చేసినా చంపేస్తామంటూ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మెహ్సానా జిల్లా సత్లాస్నా తాలూకా పరిధిలోని ఉమ్రేఛా గ్రామంలో జిగర్ అనే యువకుడు బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 1800 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు దళితులు. వీరి ఎక్కువగా జిగర్కు చెందిన బార్బర్ షాపులోనే కటింగ్ చేయించుకునే వాళ్లు. అంతే కాకుండా ఖాళీ సమయాల్లో కూడా జిగర్ షాపు వద్ద యువకులు చేరి సరదాగా సాయంకాలాలు గడిపేవారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం అగ్రకులానికి చెందిన గోవింద్ చౌదరి, నాన్జీ చౌదరీ, రాజేష్ చౌదరి, వసంత్ చౌదరి అనే నలుగురు వ్యక్తులు జిగర్ వద్దకు వచ్చి.. దళితులకు కటింగ్ చేయవద్దని.. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆ అగ్రవర్ణ యువకుల మాటలను జిగర్ పట్టించుకోలేదు. ఎప్పట్లాగే దళితులకు కూడా కటింగ్ చేస్తున్నాడు. అయితే తాము హెచ్చరించినా దళితులతో స్నేహం మానుకోవట్లేదని ఆగ్రహించిన ఆ నలుగురు సోమవారం నాడు జిగర్ను తీవ్రంగా కొట్టారు. మా మాటలే లెక్క చేయవా అంటూ దూర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ ఘటనపై జిగర్ తల్లి జసీబెన్ భగవాన్దాస్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.
జిగర్పై నలుగురు వ్యక్తులు దాడి చేసిన మాట వాస్తవమేనని సత్లాస్నా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రతిలాక్ మక్వానా దృవీకరించారు. దళిత యువకులు బార్బర్ షాపులోనికి వెళ్లడం చూసి ఈ నలుగురు జిగర్పై దాడి చేశారని ఎస్ఐ రతిలాల్ చెప్పారు. గతంలో ఆ నలుగురు హెచ్చరించిన మాట కూడా వాస్తవమే అన్నారు.
అయితే అగ్రకులానికి చెందిన వాళ్లు మాకు ఆ బార్బర్ షాపునకు వెళ్లొద్దని ఏనాడు హెచ్చరించలేదని దళితులు అంటున్నారు. కులాల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చోటు చేసుకోకపోయినా ఈ మధ్య మాత్రం అలాంటి ఘటనలు నమోదు అవుతున్నాయి. ఇదే ప్రాంతంలో 13 ఏండల్ దళిత బాలుడు అగ్రవర్ణాలు ధరించే సాంప్రదాయ చెప్పులు ధరించాడని ఐదుగురు వ్యక్తులు ఆ బాలుడిపై దాడి చేశారు.
ఇలాంటి ఘటనలు దళితుల సాంఘీక అభివృద్ది కూడా అగ్రకులాల వారికి కంటగింపుగా మారిందనే విషయం స్పష్టం అవుతోంది. అంతే కాకుండా దళితులతో ఇతర కులస్థులు కలవడం కూడా అగ్రవర్ణాల వారికి పెద్దగా నట్టడం లేదనే విషయం తెలుస్తోంది.
Source : The Indian Express (https://indianexpress.com/article/india/gujarat-barber-beaten-up-for-cutting-hair-of-dalits-four-booked-5233465/)
Keywords : dalit, barber, attacked, upper caste men, gujarat, umrecha, దళితులు, కటింగ్, బార్బర్, అగ్రకులస్థులు, గుజరాత్, ఉమ్రేఛా
(2024-03-15 06:30:53)
No. of visitors : 939
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..