ప్రశ్నించడమే ఈ విద్యార్థిని చేసిన నేరమైంది..!

ప్రశ్నించడమే

ప్రశ్నించే గొంతుకను నొక్కేయడమే రాజ్యం చేసే పని. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వాన్ని నిలదీయడమే అతి పెద్ద నేరం. ఉద్యమాలను నడిపించే వారిపై ద్రోహులుగా చిత్రీకరించి కటకటాల పాలు చేయడం ఏనాటి నుంచో ఉన్నదే. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ అదే జరుగుతోంది.

పదుల ప్రాణాలు కోల్పోయినా బెదరకుండా తమకు నష్టం చేస్తున్న స్టెరిలైట్ కంపెనీని మూయించిన ఘనత తమిళనాడు ప్రజల సొంతం. ఇప్పుడు అలాంటి ఉపద్రవమే మరొకటి పుట్టుకొని వచ్చింది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పేరుతో వేల ఎకరాల సాగు భూమి, ఇండ్లు, గ్రామాలను నాశనం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దపడ్డాయి. చెన్నై నుంచి సేలం వరకు నిర్మించి 277 కిలోమీటర్ల రహదారి కోసం ఆరు జిల్లాల్లోని ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి భూమిని నమ్మి బతుకుతున్న రైతులు తమ హక్కును కోల్పోబోతున్నారు. పచ్చని తూర్పు కనుమలు తమ అందాన్ని కోల్పోవడమే కాక సహజత్వానికి దూరం కాబోతున్నాయి. ఇన్ని నష్టాలు ఉన్నా ప్రభుత్వం ఆ ఎక్స్‌ప్రెస్ వే కోసం పనులు వేగవంతం చేయడంతో స్థానికులు ఉద్యమిస్తున్నారు.

చెన్నై-సేలం గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను వ్యతిరేకిస్తూ గత జనవరి నుంచి స్థానికులు, హక్కుల కార్యకర్తలు ఉద్యమం చేస్తున్నారు. అలాంటి వారిలో జర్నలిజం విద్యార్థిని, హక్కుల కార్యకర్త అయిన ఎస్. వలర్మతి ఒకరు. తన మాటలతో ఉద్యమకారుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా.. స్థానికులు, రైతులకు ఈ ప్రాజెక్టు వలన కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రభుత్వం పలు విమర్శలు కూడా చేశారు. గత జనవరిలో వడపలనిలోని ఆర్‌కేవీ స్టుడియో వద్ద ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు రాజద్రోహం కిందకు వస్తాయని.. కొన్ని వర్గాల మధ్య శతృత్వం పెంచేలా మాట్లాడిందంటూ చెన్నై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె రెచ్చగొట్టే ప్రసంగం చేసిందని సెక్షన్ 153 కింద తప్పుడు కేసును బనాయించారు. పోలీసులపై దాడి చేయాలని ఆమె ప్రజలకు చెప్పిందంటూ ఆ కేసులో పేర్కొన్నారు.

సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సంబంధించి జిల్లా అధికారులు ఇటీవల అచంకుట్టపట్టిలో నిర్వహించిన సమావేశాన్ని ప్రజలతో కలసి వలర్మతి బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడే అరెస్టు చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్లలో అరెస్టయిన రెండో వ్యక్తి వలర్మతి. అంతకు మునుపు పర్యవరణ కార్యకర్త పీయుష్ మనూష్ గత జూన్ 18న అరెస్టు చేశారు. అతడి మీద కూడా సెక్షన్ 153ఏ, 505(1)బీ కింద కేసులు నమోదు చేశారు. ఇతని అరెస్టుకు ముందు నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా అరెస్టైనా.. సేలం కోర్టులో బెయిల్ పొందాడు.

ఇలా అభివృద్ది పేరిట పర్యావరణానికి స్వయంగా ప్రభుత్వాలే తూట్లు పొడుస్తుంటే దానిని వ్యతిరేకించడం రాజద్రోహమంటూ కేసులు బనాయించడంపై స్థానికులే కాక పలు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలన నిరసిస్తూ ఇటీవల ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మాహుతి చేసుకోవడానికి జిల్లా అధికారుల ముందు ప్రయత్నించారు. ఇలా ఎన్నో వైపులు నుంచి ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ప్రతిపక్షాలు కానీ నోరు మెదపకపోవడం అన్యాయం.

Keywords : valarmathi, chennai salem expressway, arrested, journalism student, activist, tamilnadu, వలర్మతి, చెన్నై సేలం ఎక్స్‌ప్రెస్ వే, అరెస్టు, జర్నలిజం స్టుడెంట్, కార్యకర్త, తమిళనాడు
(2024-03-19 00:17:58)



No. of visitors : 1332

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రశ్నించడమే