గోరక్షణపై సుప్రిం హెచ్చరికలను ఇప్పటికైనా పట్టించుకునే వాళ్లు ఉంటారా..?

గోరక్షణపై

గోవు.. గోమాత పేరిటా గత కొన్నాళ్లుగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన గోవును తీసుకెళ్తున్న వాళ్లను కూడా పట్టుకొని దారుణంగా చంపేసిన ఘటనలు దేశంలో చోటు చేసుకున్నాయి. గోవుకు అపారమైన ఘనతలు ఆపాదిస్తూ... గోవుకు హానితలపెట్టడమే ఘోరమైన నేరమంటూ ఎంతో మందిని అకారణంగా బలితీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గోరక్షణ పేరిట చేసిన చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎంతో మంది హిందూ మతోన్మాదులు దళితులు, ముస్లింలపై దాడులు చేశారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఈ చట్టంపై మరో సారి వివరణ ఇచ్చింది. గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. గోరక్షణతో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక గతేడాది నవంబర్‌లోనే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ అ‍త్యున్నత న్యాయస్థానం.. ఈ హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని అప్పట్లో ఆదేశించింది. ఓ సీనియర్‌ పోలీసు అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కూడా తేల్చిచెప్పింది.

సుప్రీం ఈ చట్టానికి సంబంధించి గతంలోనే ఎన్నో హెచ్చరికలు చేసింది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన చూపించలేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాక.. పలు చోట్లు వర్గాలు, మతాల వారీగా విడిపోయి ఘర్షణలకు దిగారు. గోరక్షణ తీర్పుకు రాజస్తాన్, హర్యానా, యూపీ రాష్ట్రాలు కట్టుబడి లేవని.. గాంధీ మనుమడు తుషార్ గాంధీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇది లా అండ్‌ ఆర్డర్‌ విషయమని, ప్రతి రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాలని హెచ్చరించింది. గోరక్షణ పేరుతో దాడులు చేయడం హింసను ప్రేరిపించడమేనని, ఇది క్రైమ్‌ అని పిటిషనర్‌ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని, ఈ విషయంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

దేశ సర్వతోముఖ న్యాయస్థానం అందించిన తీర్పుపై ఇప్పటికీ సరైన చర్యలు చేపట్టని రాష్ట్రాలు అన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. కావాలనే దళిత, మైనార్టీ వర్గాలను ఈ వివాదంలోనికి లాగి ఘర్షణలు సృష్టిస్తున్నా.. ప్రభుత్వాలకు చీమకుట్టనట్లైనా లేదు. మరి ఇకనైనా సుప్రీం తీర్పును పాటిస్తాయో లేదు కాలమే నిర్ణయించాలి.

Keywords : గోరక్షణ, చట్టం, సుప్రీం కోర్టు, gourakshak, supreme court, verdict
(2024-04-24 20:17:42)



No. of visitors : 714

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


గోరక్షణపై