ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌

ప్రశ్నలను

ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్యపై మతోన్మాదులు సోషల్ మీడియాలో దుర్మార్గమైన దాడులకు పాల్పడుతున్నారు. పర్సనల్ మెసేజ్ లు పెట్టి బెదిరిస్తున్నారు. రేప్ చేస్తామని, హత్య చేస్తామని హిందుత్వవాదులు హూంకరిస్తున్నారు. సంధ్య కుటుంభ సభ్యులను కూడా చంపుతామంటూ బెధిరిస్తున్నారు. హేతువాది బాబు గోగినేనిపై కేసు, కత్తి మహేష్ పై నగర బహిష్కరణను ఖండించడమే ఆమె చేసిన తప్పు. రామాయణ, మహాభారతాల్లోని పాత్రల తీరుపై ఆమె ప్రశ్నించడం మతోన్మాదులకు నచ్చలేదు. ప్రశ్నలకు జవాబు చెప్పలేని అఙానులకు దాడులు చేయడం తప్ప ఇంకేం చేయగలరు ? హిందూ పరిరక్షకుల‍ వేశం కట్టి కత్తులు పట్టి కదం తొక్కుతున్నారు. తమ మత రక్షణకు హత్యలు, రేప్ లు మినహా మరో దారి లేదని వాళ్ళు నమ్ముతున్నారా ? అసలు వాళ్ళలో ఎవరైనా రామాయణ, మహాభారతాలు చదివారా అన్నది అనుమానమే !
మతాన్ని నిలబెట్టడమంటే దళితులపై, ముస్లింలపై, ఆదివాసులపై, మహిళలపై దాడులు చేయాడ‌మేనా ? అంబేడ్కర్ రాసిన‌ ఈ దేశ రాజ్యాంగాన్ని నాశనం చేసి, ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి తొక్కి మధ్యయుగాల అరాచక రోజుల్లోకి తీసుకెళ్ళడానికి చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ప్రజా కార్యకర్త సంధ్య‌పై దాడి. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించి సంధ్యకు మద్దతుగా నిలబడదాం

సంధ్యపై దుర్మార్గమైన దాడిని ఖండిస్తూ విజయ భండారు అనే సామాజిక కార్యకర్త తన ఫేస్బుక్ టైమ్ లైన్ పై చేసిన పోస్ట్ యదాతథంగా ఇస్తున్నాం.
సంధ్యను బాగా దగ్గరగా చూస్తున్న దానిని..ఆమె భావాలను పంచుకుంటున్న దానిని..గత వారం రోజులుగా ఆమెపై హిందూ ఫాసిస్టులు చేస్తున్న ఉన్మాద ట్రోలింగ్స్ చూస్తుంటే..పిచ్చెక్కిన
కోతిమూకలు తమ పైశాచిక హావభావాలతో పెట్రేగిపోతున్న విధానం అత్యంత ప్రమాదకరంగా ఉంది....
సామాజిక మార్పుకోసం పైసా వంతు కూడా సేవ చేయలేని పుంఖాను పుంఖాల వీర విరాట్టుల్లారా!..మీ భాషను ఒక్కసారి పరిశీలించుకోండి! మీ మురికి కంపుకొట్టే నోళ్లను మనిషితనంతో కాస్త కడుక్కోండి... ఎందుకంటే...మీ చెత్త వాగుళ్లకు, మీ భయంకర విన్యాసాలకు సంధ్య చిరునవ్వే సమాధానం...కాబట్టీ!
ఆడవాళ్లకు సంధ్య అంటే ఏంటో తెల్సు....సంధ్య వాయిస్ ఏంటో మానవీయంగా ఆలోచించే ప్రతివారికీ తెలియ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఊకదంపుడు పురాణాల కన్నా ఆమె చరిత్ర చాలా గొప్పది. ముల్లును ముల్లుతో తీసే మనుషులున్న ప్రపంచంలో తన నోటితో ముల్లును తీసి ఎదుటివాళ్లకు చిన్న నొప్పిని కూడా ఇవ్వలేని ఆమెను అవమానించటం, భయపెట్టాలని చూడటం కేవలం మీ అవివేకం మాత్రమే! మూసినీళ్లను తలపించే మీ మాటలు.. ఆమెను,ఆమె ఆశయాలను భగ్నం చేయలేవని తెలుసుకోండి..! మీరు ఉలిక్కిపడుతూ తడుముకుంటున్న మీ భుజాలను సీదా చేసుకోండి!..ఎందుకంటే ఆమె ఒక వ్యక్తి కాదు శక్తి అని తెలుసుకోండి..మీ పిచ్చి వాగుళ్లు కట్టిపెట్టి మీ పురాణపురుషులు చెప్పిన నీతులను సమర్థిస్తున్న మీరు స్త్రీలను ఎలా గౌరవించాలో ముందు నేర్చుకోండి..ఆ తర్వాత దేశాన్ని..మీ మహాగ్రంధాలను రక్షించుకుందురుగానీ.... సమాజ పరిణామక్రమంలో మార్పులను ఆహ్వానించలేని మీరు సాంకేతిక సాధనాలైన ఇంటర్నెట్ లో fb, whatsup లు ఉపయోగించి మీరు వాడుతున్న అన్ పార్లమెంటరి భాషను వాడటంలో మాత్రం సిద్ధహస్తులైనందుకు (స్త్రీలుగా) మీ అమ్మలుగా,
అక్కలుగా, చెల్లెళ్లుగా, సహచరులుగా, స్నేహితులుగా వేదన పడుతున్నాం..!
మీరు ఏ వాదాన్నైతే తలమీదకు ఎక్కించుకొని అమానుషంగా మాట్లాడుతున్నారో..అలాంటి వారి అక్కలు,చెల్లెళ్ళు,బిడ్డలు అమ్మలుగా వారికి కుటుంబపర సమస్యలు వచ్చినప్పుడు..మీరు ఆదర్శంగా తీసుకొని నెత్తినపెట్టుకుంటున్న పురాణ పురుషుల కథలు చెప్పి నోరు మూయిస్తారా? లేక మీ..మీ.. కుటుంబ స్త్రీలకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను,చట్టాలను,పోలీసులను, కోర్టులను ఆశ్రయించ
కుండా న్యాయస్థానాలను వెతుక్కోకుండా, ఎలాంటి పోరాటాలు చేయకుండా అనాగరికంగా జీవించమని చెబుతారా?ప్రశ్నించటం ప్రతి ఒక్కరి జన్మహక్కు.
అన్యాయం, అక్రమం,
అమానుషం ఎక్కడ జరిగినా..మీరనే ఏ వాదంలో కనిపించినా, వినిపించినా మౌనంగా ఉండటానికి...
అందరిలో ప్రవహించేది..ఎర్రటి రక్తమే..!..ప్రశ్నలను నిషేధించాలనుకోవటం, చంపాలనుకోవటం అవివేకం...సమస్త ప్రజలు మిమ్మల్ని గమనించడం లేదని పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతున్న చందంగా ఆలోచించకండి..సంధ్య pow ఒంటరి కాదూ సమూహం, ఆమె ఒక సంస్థ అని తెలుసుకోండి.. సమూహం కట్టలు తెంచుకున్న రోజు..తాలు,చెత్తను ఊడ్చివేస్తుందని మరువకండి..మీ అనాకరిక స్పందనలను...మీకే వదిలేస్తున్నాం..ఇప్పటికైనా సంధ్య pow కు కొండంత బలం ఆమె చేసిన, చేస్తున్న పోరాటాలు,ఉద్యమాలు తమకోసమే అని ప్రజలకు తెల్సు. సమాజం కూడా దాన్ని గుర్తిస్తుందని మీకూ తెల్సు. ఆమెను వ్యకిగా కాక శక్తిగా సమాజం ఆహ్వానిస్తుందని ఇప్పటికైనా తెలుసుకోండి!

Keywords : pow, sandhya, katti mahesh, babu gogineni, rss, bjp, cheddi gang
(2024-04-24 20:13:16)



No. of visitors : 3210

Suggested Posts


ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?

ఈ నెల 2న దళితులు నిర్వహించిన భారత్ బంద్ లో జరిగిన సంఘటనలపై కూడా చెడ్డీ గ్యాంగ్ ఫేక్ న్యూస్ ప్రచారం మొదలు పెట్టింది. ఓ పోలీసును దళితులు కొట్టి చంపారని చెబుతూ దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై విషం చిమ్ముతూ ప్రచారం మొదలుపెట్టారు.

మురికి వాడల్లో ఆహారం పంచుతున్న ముస్లిం యువకులపై దాడి...తీవ్ర గాయాలు

ప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక‌ ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది.

ఆ న్యాయమూర్తిని హత్య చేసిందెవరు ?

మరణవార్త చెప్పిన ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తే మూడు రోజుల తర్వాత లోయా మొబైల్‌ ఫోన్‌ తెచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఆ ఫోన్‌లో డాటా అంతా చెరిపేయబడి ఉంది. ఆయనను బలవంతపెట్టి నాగపూర్‌కు తీసుకువెళ్లిన సహన్యాయమూర్తులు మృతదేహంతోనూ రాలేదు, అంత్యక్రియలకూ ...

సాదువుల హత్య కేసు:101 మంది అరెస్ట్‌... ఒక్క ముస్లిం కూడా లేడు

సాదువుల హత్య కేసులో ఇప్పటివరకు 101 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. వారంతా హిందువులేనని, అందులో ముస్లింలు ఒక్కరు కూడా లేరని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్ముఖ్‌ బుధవారం తెలిపారు.

తలలు నరకడానికి శిక్షణ ప్రారంభం !

యోగీ ఆధిత్యానాథ్ నాయకత్వంలో ఆయోధ్యలో రామ మందిరం నిర్నిస్తామని, దానికి ఎవరైనా అడ్డొస్తే తలలు నరికి వేస్తామని మూడు రోజుల కింద ప్రకటించిన ఆయన అందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దూల్ పేటలో సాయుధ శిక్షణ ప్రారంభించాడు....

51 University VCs Attend RSS Workshop on Making Education More Indian

Over 721 academicians and experts including 51 Vice Chancellors of various central and state universities attended a two-day workshop organised by the RSS over the weekend hosted in the national capital....

దేశానికి రానున్నవి చీకటిరోజులు

భారతదేశంలో హిందువులలోనూ ముస్లింలలోనూ అత్యధికులు మతతత్వానికి గురైనవాళ్లేనని నా అభిప్రాయం. నా చిన్నతనంలో నా హిందూ బంధువులూ మిత్రులూ చాల మంది ముస్లింల మీద విషం కక్కుతుండడం నేను చూశాను. కాకపోతే వాళ్లు అలా మాట్లాడుతున్నప్పుడు పక్కన ముస్లిం లేకుండా చూసే జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ఒక ముస్లింను కొట్టి చంపేశారంటే చాలమంది హిందువులకు అది పట్టడమే లేదు. బహుశా కొందరు

వాహనాలను తనిఖీ చేసిన ఆరెస్సెస్ కార్యకర్తలను విమర్షించినందుకు ప్రొఫెసర్ ను తొలగించిన యూనివర్సిటీ

తెలంగాణ రాష్ట్రం యాదగిరి భువనగిరిజిల్లాలో హైదరాబాద్ వరంగల్ హైవేపై ఖాకీ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని చేతిలో లాఠీలు పట్టుకున్న‌ ఆరెస్సెస్ కార్యకర్తలు రోడ్డుపై వెళ్తున్న‌ వాహనాలను ఆపి చెక్ చేసిన ఘటనపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది.

సావర్కర్ పుట్టినరోజున స్కూలు పిల్లలకు కత్తులు పంచిన హిందూ మహాసభ‌ !

ʹరాజకీయాలను హిందూమయం చేయడం హిందువులను సాయుధలను చేయడం సావర్కర్ కల మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం ద్వారా సావర్కర్ కల లోని మొదటి భాగాన్నిమోడీ పూర్తి చేశాడు. రేండోది మేము చేస్తున్నాంʹʹ

జై శ్రీరాం అనలేదని అన్సారీని కొట్టి చంపినవాళ్ళే మరో వ్యక్తిని రైల్లో నుండి తోసేశారు.

దక్షిణ 24 పరగణా లోని కానింగ్ నుండి హుబ్లీకి రేల్లో వెళ్తున్న 26 ఏండ్ల హఫీజ్ మహ్మద్ షారూఖ్ హల్దర్ అనే యువకుడిపై ఓ మూక డాడి చేసి దారుణంగా కొట్టింది. హఫీజ్ ప్రయాణిస్తున్న రైలులో కొందరు జై శ్రీరాం నినాదాలిస్తూ ఇతన్ని చూసి వెక్కిరించడం ప్రారంభించారు. చివరకు శృతి మించి హఫీజ్ ను కూడా జై శ్రీరాం అనే నినాదాలివ్వాలని బలవంతం చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రశ్నలను