భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం

భీమాకోరేగాఁవ్

భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం అనే నినాదంతో ʹఅప్రజాస్వామిక చట్టాలకు హక్కుల కార్యకర్తలపై నిర్బంధానికి నిరసనగా ప్రచార ఉద్యమంʹ ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం పూర్తి పాఠం...

జూన్ 6న ఢిల్లీ, ముంబై, నాగపూర్లలో ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసి భీమాకోరేగాంవ్ కుట్ర కేసు పేరుతో యుఎపిఎ కింద పోలీసు కస్టడీలో, జైల్లో పెట్టి, అంతకన్నా ఎక్కువగా కార్పోరేటు ఛానల్స్ లో సంచలనాత్మకమైన నిందారోపణలు చేస్తున్నప్పటి నుంచీ దేశవ్యాప్తంగా వీరి పట్ల ప్రజా సంఘాల నుంచి, ప్రజాస్వామ్య వాదుల నుంచి, ప్రజల నుంచి సంఘీభావం వెల్లువత్తుతున్నది. వ్యక్తులుగా న్యాయవాది సురేంద్ర గాట్లింగ్ (అఖిల భారత ప్రజాన్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి) ప్రొఫెసర్ షోమాసేన్ (నాగపూర్ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్, జెండర్ అధ్యయనాల శాఖాధిపతి, మహిళా హక్కుల కార్యకర్త, (డబ్ల్యు ఎస్ఎస్) మ హేశ్ రావత్ (విస్థాపన్ విరోధి మంచ్ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు) సుధీర్ ధాప్లే (రిపబ్లికన్ ప్యాంథర్స్ నాయకుడు, ʹవిద్రోహిʹ పత్రికా సంపాదకుడు) రోనావిల్సన్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నిర్వాహక కార్యదర్శి)ల నిర్బంధాన్ని, వారిపై తప్పుడు ఆరోపణలపై ప్రజలు వీళ్లు పని చేస్తున్న కార్యక్షేత్రాల దృష్ట్యా దళితులు, ఆదివాసులు, ముస్లిం మైనారిటీలు, సాంస్కృతిక కార్యకర్తలు, మహిళలు, రాజకీయ ఖైదీలు - మొత్తంగా శ్రమజీవులు, పీడుతులైన విశాల ప్రజారాశులను నిర్బంధంగా చూస్తున్నారు.

ఇటువంటి ప్రజారాశులు - ముఖ్యంగా నయీపీష్వాయీ వివక్షకు, దాడికి గురవుతున్న దళితులు, ఆదివాసులు, ముస్లింలు, బడుగు వర్గాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఎల్గార్ పరిషత్ 2017 డిసెంబర్ 31న దళిత అమరుల ద్విశత స్మృతి సంవత్సరం సందర్భంగా పూనే శనివార వాడలో లక్ష మందికి పైగా సంఘటితమైనపుడు జనవరి 1న ఆర్ఎస్ఎస్ శక్తులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బోటే ప్రేరేపణతో చేసిన దౌర్జన్యంలో దళితులే మరణించారు. దళితులే గాయపడినారు. ఈ ఇద్దరిపై నేరారోపణ జరిగి, సుప్రీంకోర్టు దాకా ముందస్తు బెయిల్ నిరాకరింపబడినా వారు బలాదూర్గా తిరుగుతున్నారు. ఎందుకంటే ఈ ముఠా నాయకుడు శంభాజీ భిడేను దేశ ప్రధాని నరేంద్రమోడీ ʹగురూజీʹగా సమ్మానిస్తాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆయనకు ʹపద్మశ్రీ ఇప్పించాలని చూసాడు. మక్కా మసీదు బాంబు పేలుడులో ముస్లిం పేదలే మరణించి, ఆ సందర్భంగా గుమికూడిన జనంపై పోలీసు కాల్పుల్లో ముస్లిం పేదలే మరణించి, మొదట అనుమానితులుగా ముస్లిం యువకులే అరెస్టయినట్లుగా ఈ హింసకు, దౌర్జన్యానికి కారకులంటూ రిలయన్స్ కంపెనీ అండర్ గ్రౌండ్ కేబుల్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలు, ముంబైలో దశాబ్దాలుగా ఉంటున్న తెలంగాణ దళిత, బడుగు వర్గాల యువకులను ఎనిమిది మందిని యాంటీ టెర్రరిస్టు స్యాడ్ జనవరి 14వ తేదీననే యుఎపిఎ కింద అరెస్టు చేసింది. మహారాష్ట్ర గుజరాత్ మధ్యన ప్రభుత్వం తల పెట్టిన గోల్డెన్ కారిడార్లు వ్యతిరేకించడానికి ప్రవేశించిన మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ఈ భీమాకోరేగాఁవ్ ప్రదర్శనలో హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఎటిఎస్ ఈ సందర్భంగా నిర్బంధంలోకి తీసుకొని గురి చేసిన చిత్రహింసలు భరించలేక సుప్రసిద్ధ రచయిత మచ్చ ప్రభాకర్ జనవరి నెలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏప్రిల్ నెలలో ఢిల్లీలో రోనా విల్సన్ ఇంటిపై, నాగపూర్లో సురేంద్ర గాట్లింగ్ ఇంటిపై మహారాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలు దాడిచేసి వాళ్ళ ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, పుస్తకాలు అన్నీ ఎత్తుకుపోయారు. 2018 జూన్ 6న ఏకంగా ఢిల్లీ, ముంబై, నాగపూర్లలో ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి భీమా కోరేగాఁవ్ సంఘటనతో ముడి పెడుతూ పూనేలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పద్నాలుగా రోజులు పోలీసు కస్టడీకి తీసుకొని ఎరవాడ జైలుకు పంపించారు. పోలీసు కస్టడీలోనే గుండెపోటు వచ్చి సురేంద్ర గాట్లింగ్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రాఫ్ కూడ చేయించాల్సి వచ్చింది. జూన్ నెలలోనే పదవీ విరమణ చేయవలసి ఉన్న ప్రొఫెసర్ షోమా సేన్ ఆర్డోరైటిస్తో, అనారోగ్యంతో పధ్నాలుగు రోజులు పోలీసు కస్టడీలో గడపాల్సి వచ్చింది. అరెస్టు నాటి నుంచి రిపబ్లిక్ ఛానెల్, టైమ్స్ నౌ వంటి కార్పొరేట్ ఛానల్ వీళ్లపై, ఎల్గార్ పరిషత్లో, ఐపిఎల్, సిఆర్పిపి వంటి సంస్థల్లో ఉన్న వారిపై పెద్ద ఎత్తున మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నది. ప్రకాశ్ అంబేడ్కర్, ఆనంద్ తెల్తుంబ్లే, గౌతమ్ నావ్లఖా, సుధా భరద్వాజ్ మొదలు ప్రముఖ హక్కుల కార్యకర్తలపై, ప్రజాస్వామ్యవాదులు, మేధావుల పై మావోయిస్టు పార్టీ సంబంధాలు, కశ్మీర్ వేర్పాటువాదుల సంబంధాలు ఆరోపిస్తూ విష ప్రచారం చేస్తున్నవి. గతంలో వినాయక్ సేన్తో మొదలై ప్రొ.జి.ఎన్.సాయిబాబా అతని సహచరుల నిర్బంధం, యావజ్జీవ శిక్షతో అర్బన్ మావోయిస్టులనే ఆరోపణ రాజ్య నిర్బంధ వ్యూహమైంది.

మార్చ్ 20న ఎస్.సిఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరు గార్చిన తర్వాత భీమాకోరేగాఁవ్ కుట్రకేసు వలయం దేశవ్యాప్తమైంది. ఏప్రిల్ 2 భారత్ బంద్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పదమూడు మంది పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. వందలాది మంది అరెస్టయ్యారు. అప్పటికే ఏడాది పైగా ఉత్తర ప్రదేశ్లో దళితభీమ్ సేన నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, అతని సహచరులు ఏడాదిపైగా జైళ్లలో మగ్గుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విరసం సభ్యుడు, న్యాయశాస్త్ర విద్యార్థి అంకాల పృథ్వీరాజ్, కేంద్ర విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి చందన్ మిశ్రాలను రోహిత్ వేముల స్మృతిబద్ద హత్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కక్షతో ఈ నేపథ్యంలోనే మర్చ్ నెలాఖరులో విజయవాడలో అరెస్టు చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ పొదిలి అప్పారావును హత్య చేయడానికి మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసారని యుఎపిఎ, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే సెక్షన్, ఆంధ్రప్రదేశ్ ప్రజాభద్రతా చట్టం, నేరపూరిత కుట్ర (120బి)వంటి సెక్షన్లు పెట్టి హైకోర్టులో కూడా బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక విద్యార్థి సంఘాల పై తెలంగాణ ప్రజాస్వామిక ఫోరం ఏర్పడినప్పటి నుంచీ కొనసాగుతున్న నిర్బంధం, రాజ్యహింసలో భాగంగా జూన్ 5న వరంగల్ లో డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (డిఎస్యు) రాష్ట్ర అధ్యక్షుడు భద్రి ఇంట్లో అతనితో పాటు మరో ఇద్దరు డిఎస్యు విద్యార్థులు రంజిత్, సుధీర్లను అరెస్ట్ చేసారు. ఆ ఇద్దరినీ మావోయిస్టు పార్టీలో చేర్చడానికి తీసుకుపోతున్నాడని చిత్రహింసలు పెట్టి ముగ్గురిని కూడ యుఎపిఎ తదితర పైన పేర్కొన్న సెక్షన్ల కింద ఖమ్మం జైల్లో పెట్టారు. భద్రీ ఇచ్చిన ఒప్పుకోలు వాజ్ఞ్మూలం అని కల్పించి పత్రికా రచయిత, టిడిఎఫ్ కన్వీనర్ బండి దుర్గాప్రసాద్ ను నెల రోజుల క్రితం అరెస్టు చేసి అదే కేసులో అదే జైల్లో పెట్టి, వాళ్ల అభ్యర్థనపై కాకుండా నేరస్తులను శిక్షించినట్లుగా వరంగల్ జైలుకు బదిలీ చేసి ఒంటరి సెల్స్లో బంధించారు. విచారణలో ఉన్న ఖైదీల విషయంలో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేక చర్య. తెలంగాణ విద్యార్థి సంఘం(టివిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోట శ్రీనివాస్ పై కూడా కాగజ్నగర్ పోలీసు స్టేషన్లో ఇటివంటి నేరారోపణల కత్తియే వేళ్లాడుతున్నది. వీళ్లంతా దళిత, బడుగు వర్గాలకు చెందిన వాళ్లు.

పోడుభూములకు పట్టాలివ్వాలనీ, వనరుల విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకులను, దళనేతలను యుఎపివ, పబ్లిక్ సెక్యురిటి యాక్ట్ల కింద అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇండ్లలో నుంచి ఎత్తుకుని పోయి ఆయుధాలు కలిగి ఉన్నారని కేసులు పెడుతున్నారు.
ఆదివాసులపై మావోయిస్టులని దాడులు, లైంగిక అత్యాచారాలు, ఎన్ కౌంటర్ హత్యలు, గృహదహనాలు, విస్థాపనల పరాకాష్ఠ ఏప్రిల్ 22 నుంచి 24 దాకా మహారాష్ట్ర గడ్చిరోలిలో సాగిన మారణకాండ అందులో అమరులైన నలభైమంది, నలభై మంది మిస్సింగ్ మైనర్లు, స్త్రీలు - అందరూ ఆదివాసులే. ఈ మారణకాండతో ఆగకుండా ఫారెస్ట్ గెస్ట్హౌజ్లో సి-60 కమాండోలు, సిఆర్పిఎఫ్ బలగాలు మృత్యు హేల నృత్యాలు చేసాయి.
ఈ మారణకాండ లాయిడ్స్, జిందాల్, ఎస్సార్ వంటి కార్పోరేట్ కంపెనీల స్వార్థ ప్రయోజనం కోసమేనని నిజనిర్ధారణ చేసినందుకే, సిడిఆర్ఓ బృందానికి సహకరించిన సుధీర్గాట్లింగ్, మహేశ్ రౌత్లపై కక్ష పెట్టుకున్నది రాజ్యం.

బుర్జాన్వనీ ఎన్ కౌంటర్ హత్య కాలం నుంచి కశ్మీర్లో భారత సైన్యం అమలు చేస్తున్న రాజ్యహింస గురించి నిజనిర్ధారణకు వెళ్లిన ఐపిఎల్ బృందానికి నాయకత్వం వహించినందుకు కూడా రాజ్యానికి సురేంద్ర గాట్లింగ్ పై కక్షగా ఉంది.
ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో ముస్లింల విషయంలో ʹఎన్ కౌంటర్ʹ హత్యలనేవి సర్వసాధారణమై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు కూడా ఇవ్వాల్సి వచ్చింది. మైనారిటీలకు న్యాయ సహాయం చేసినందుకు రిహాయ్ మంచ్ నాయకుడు రాజీవ్ యాదవను చంపుతామని బెదిరించారు.
లౌకిక, ప్రజాస్వామిక వాదులకు హిందుత్వవాదుల నుంచి ఈ బెదిరింపులు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో భౌతిక హత్యలకు దారితీసిన ఉదంతాలు మనకు తెలుసు.

నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే (మహారాష్ట్ర) కల్బుర్గి, గౌరీలంకేశ్ల హంతకుల ఆలస్యమైన అరెస్టు సందర్భంగా బయటపడిన హిట్ లిస్ట్లలో గిరీశ్ కర్నాడ్, ప్రకాశ్ రాజ్, భగవాన్ వంటి పదహారు మంది ప్రఖ్యాత కళాకారులు, రచయితలు, మేధావులు, హేతువాదులుండడం ఒక వైపు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఛాన్సలర్లు కావడం మరొకవైపు చూస్తున్నాం. ఉన్నత విద్య కాశాయీకరణ, కార్పోరేటీకరణ యూజీసీని రద్దు చేయడంతో పరాకాష్టకు చేరింది.

గడ్చిరోలీ మారణకాండ అడవిలో జరిగితే తుత్తుకుడి మారణకాండ సముద్ర తీరాన జరిగింది. వేదాంత కాపర్ కంపెనీ క్యాన్సరుత్పత్తి, కాలుష్యానికి వ్యతిరేకంగా తమిళనాడు సముద్ర తీరాన చిరకాలంగా సాగుతున్న ప్రతిఘటనపై ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులు సభ్య ప్రపంచాన్ని విశ్రాంతి పరచినవి. పదమూడు మంది ప్రదర్శనకారులు మరణించారు. కార్యకర్తలు, వాళ్లకు న్యాయసహాయం చేసిన వంచినాథన్, న్యాయవాదులు యుఎపిఎ కింద జైళ్ల పాలయ్యారు. అడవిలో ఆదివాసులు, సముద్ర తీరాన పల్లెకారులు, మత్స్యకారులు ఈ విధ్వంస, హింసలకు బలవుతున్నారు.

ఝార్ఖండ్లో ఏభై ప్రజాసంఘాలతో ఏర్పడిన మజూర్ సంఘటన్ సమితిని నిషేధించి, మధుబన్ (ప్రసిద్ద జైన క్షేత్రం పార్శ్వనాథ్) ధన్ బాద్, గిర్డి, రాంచీలతో కార్మిక సంఘాల కార్యాలయాలు సీల్ చేసి పద్దెనిమిది మంది కార్యకర్తలను అరెస్టు చేసారు. అందులో ఎంఎస్ఎస్ అధ్యక్షుడు బచ్చాసింగ్ మాత్రమే కాదు విస్థాపన్ విరోధీ మంచ్ ప్రధాన కార్యదర్శి దామోర్ తూరి కూడ ఉన్నాడు.

బెంగాల్లో భూమి కోసం పోరాడుతున్న భంగార్ రైతులను మొదలు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ వరకు ప్రజలపై పలు రకాల రాజ్యహింస కొనసాగుతున్నది.
అడవులు, సముద్ర తీరాలు, గ్రామాలు మొదలు క్యాంపస్ల వరకు పోలీసు బులెట్లు, బాష్ప వాయు ప్రయోగాలు, అక్రమ అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి.

ఈ అన్ని సందర్భాల్లోనూ యుఎపిఎ, ఎన్ఎస్ఎ, పిఎస్ వంటి అప్రజాస్వామిక చట్టాలను ప్రయోగిస్తున్నారు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలోనైతే సైనిక బలగాలకిచ్చిన ప్రత్యేక అధికారాల చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇటువంటి అత్యంత దారుణమైన భీబత్సవాతావరణంలో నిర్బంధాన్ని, రాజ్యహింసను ప్రతిఘ‌టించడానికి విశాల ప్రజారాశులు, వివిధ రంగాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులు సంఘటితమై అవిశ్రాంత ఉద్యమం నిర్వహించడమొక్కటే మార్గం.
ఈ బాధ్యతను, కర్తవ్యాన్ని స్వీకరించి దేశంలోని ప్రముఖ ప్రజాస్వామ్యవాదులు, విశ్రాంత న్యాయమూర్తులు, మేధావులు, కళాకారులు రాజ్యహింసకు, అప్రజాస్వామిక చట్టాల ప్రయోగానికి, హక్కుల కార్యకర్తల అరెస్టులకు నిరసనగా ఆగస్ట్ 3 శు క్రవారం రోజు ʹచలో పార్లమెంట్ʹ (చలో ఢిల్లీ) పిలుపు ఇస్తున్నారు. ఇది ఒక అఖిల భారత ఉద్యమ కార్యక్రమం. వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి.

డిమాండులు
1. భీమా కోరేగావ్ శౌర్య దిన ప్రేరణ అభియాన్ రోజు(జనవరి 1, 2018), హింసా దౌర్జన్యాలను రెచ్చగొట్టిన మనోహర్ ʹశంభాజీʹ భీడే, మిలింద్ ఎక్బోటేలను వెంటనే అరెస్టు చేసి విచారించి శిక్షించాలి.
2. సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్, మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్లను వెంటనే విడుదల చేయాలి.
3. 2018 జనవరిలోనే భీమా కోరేగావ్ కేసులో యుఎపిఎ కింద జైల్లో పెట్టిన రిలయన్స్ కేబుల్ వర్కర్స్ యూనియన్ కార్యకర్తలైన‌ ఎనిమిది మంది తెలుగు యువకులను (ముంబైలో స్థిరపడిన తెలంగాణకు చెందిన వాళ్లు) వెంటనే విడుదల చేయాలి.
4. అంకాల పృథ్వీరాజ్ (న్యాయ శాస్త్ర విద్యార్థి, విజయవాడ), చందన్ మిశ్రా (పరిశోధక విద్యార్థి, కేంద్రీయ విశ్వవిద్యాలయం)లను వెంటనే విడుదల చేయాలి.
5. తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బండి దుర్గా ప్రసాద్ (జర్నలిస్ట్)ను, డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బద్రి, అతని సహచరులు రంజిత్, సుధీర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ కోట శ్రీనివాస్ పై కాగజ్ నగర్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. పౌర హక్కుల సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్ చంద్రను వెంటనే విడుదల చేయాలి.
6. సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నాయకులను పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని బేషరతుగా విడుదల చేయాలి.
7. భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ ( రావణ్)తోపాటు ఏడాదికి పైగా యూఎపిఏ, ఎన్ ఎస్ ఏ కింద ఇతర కేసుల్లో ఉత్తరప్రదేశ్ జైల్లో పెట్టిన అతని సహచరులు భీం ఆర్మీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.

8. సుప్రీంకోర్టు ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ ఇచ్చిన తీర్పును నిరసిస్తూ 2018 ఏప్రిల్ 2న నిర్వహించిన ʹభారత్ బంద్ʹలో పోలీసు కాల్పుల్లో అమరులైన దళితుల హత్యకు కారకులైన పోలీసు అధికారులపై హత్యా నేరాన్ని నమోదు చేసి, విచారణ చేసి శిక్షించాలి. ఆ సందర్భంగా అరెస్టయిన వాళ్లందరిని వెంటనే విడుదల చేయాలి.
9. తూతుకుడిలో వేదాంత కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన ప్రజలపై కాల్పులు జరిపి పదముగ్గురిని చంపిన పోలీసు అధికారులపై హత్యానేరం మోపి విచారించి శిక్షించాలి. ఆ సందర్భంలో అడ్వకేట్ ఎస్ వంచినాథన్ ను అతనితోపాటు అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి.
10. భంగార్ భూపోరాటం (బెంగాల్)లో యుఎపిఎ కింద అరెస్టు చేసిన ఉద్యమ కార్యకర్తలు అలిక్ చక్రవర్తి, కుశాల్ దేబ్ నాథ్, శర్మిష్ట చౌదరి, రతుల్ బెనర్జీ, ప్రదీప్ సింగ్ ఠాకూర్ మొదలగు ఎందరో గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలి.
11. మజ్దూర్ సంఘటన సమితి (ఎంఎస్ఎస్) అధ్యక్షుడు బచ్చా సింగ్తోపాటు యుఎపిఎ కింద అరెస్టయిన కార్యకర్తలను,విస్తాపన్ విరోధి మంచ్ ప్రధాన కార్యదర్శి దామోదర్ తురిని వెంటనే విడుదల చేయాలి. ఎంఎస్ఎస్ (ఝార్ఖండ్)పై నిషేధాన్ని | ఎత్తివేయాలి.
12. కర్ణాటకలో, ఇతర చోట్ల ప్రజామేధావుల హత్యకు కుట్ర చేసిన హిందుత్వవాదులను వెంటనే విచారించి శిక్షించాలి..
13. ఏప్రిల్ 22-24 గడిచిరోలి ఆదివాసి ప్రజలపై మారణకాండ, మిస్సింగ్ సంఘటనలపై సుప్రీం కోర్టు (సిట్టింగ్ లేదావిశ్రాంత) న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలి, ఈ హత్యాకాండకు బాధ్యులైన పోలీసు అధికారులపై హత్యా నేరం నమోదు చేసి వారిని సస్పెండ్ చేసి విచారణ నిర్వహించాలి.

‍అప్రజాస్వామిక చట్టాలకు హక్కుల కార్యకర్తలపై నిర్బంధానికి నిరసనగా ప్రచార ఉద్యమం
ప్రచురణ కర్తలు : ప్రొఫెసర్ హరగోపాల్, భల్లా రవీంద్రనాథ్ ( సీఆర్పిపి) వి. సంధ్య( టీడీఎఫ్), దుడ్డు ప్రభాకర్ ( భీమా కోరేగాం పోరాట సంఘీభావ కమిటి, ఆంధ్రప్రదేశ్)

Keywords : bheema koregav, maharashtra, nagpur, delhi, maoists, police, uapa
(2024-03-29 20:50:30)



No. of visitors : 2209

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


భీమాకోరేగాఁవ్