ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !
అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. నిజం చెప్పాలంటే ఈ దేశం వాళ్ళను హత్య చేసింది. మతి స్థిమితం లేని అమ్మ... కుటుంభ పోషణకు పని వెతుక్కుంటూ వెళ్ళిన తండ్రి... కడుపు నింపుకోవడానికి మంచి నీళ్ళు తప్ప మరేమీ లేక ఎవ్వరి కాళ్ళు పట్టుకున్నా కరగని మనసులు చివరికి ఆ చిన్నారుల ప్రాణాలు తీసేశాయి. ఎనిమిదేళ్ళ మాన్సి, నాలుగేళ్ళ శిఖ, రెండేళ్ళ పారుల్ ఈ దేశం ముఖం పై కాండ్రించి ఉమ్మేసి వెళ్ళి పోయారు.
దేశంలోనే రెండవ ధనిక నగరం. ఈ దేశ రాజధాని ఢిల్లీలోని మండావలి అనే ఓ మురికి వాడలోని గుడిసెలో జీవించేవాళ్ళు మంగల్ సింగ్, అతని మతిస్థిమితం లేని బీనా, వాళ్ళ ముగ్గురు కూతుర్లు.. మంగల్ సింగ్ రిక్షా తొక్కి రోజూ వచ్చే వంద రూపాయలతో తన కుటుంభాన్ని పోషించేవాడు. ఈ మధ్య వచ్చిన పెద్ద వర్షాలకు వాళ్ళ గుడిసె కూలిపోయింది. రిక్షాను దొంగలెత్తుకపోయారు. దాంతో వాళ్ళు వారం రోజుల కింద తలాబ్ చౌక్ లోని ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. దగ్గర్లో చేయడానికి పనేమీ లేక పని వెతుక్కుంటూ వెళ్ళి పోయాడు మంగల్ సింగ్. ఇంట్లో తినడానికి తిండిలేక రెండు రోజులు ఇంట్లోనే ఉన్న ఆ చిన్నారులు వాళ్ళ అమ్మ మంచి నీళ్ళు తాగి బతికారు. ఇక ఆకలికి తట్టుకోలేని ముగ్గురు చిన్నారులు రోడ్డెక్కి ఇంత తిండి పెట్టించమని కనపడినవారినల్లా బతిమిలాడారు. ఆ తర్వాత అడుక్కునే శక్తి కూడా లేక ఓ మూలకు పడిపోయి చనిపోయారు. వాళ్ళను చూసి చుట్టు పక్కల వాళ్ళు ఆస్పత్రికి తీసుకెళ్ళగా అప్పటికి 18 గంటలక్రితమే ఆ చిన్నారులు చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అసలే పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులు వారం రోజులు ఆహారం లేకపోవడంతో చనిపోయారని డాక్టర్లు తేల్చారు. చిన్నారుల కడుపు, బ్లాడర్, జీర్ణాశయ వ్యవస్థలు ఖాళీగా ఉన్నాయని పోస్ట్మార్టమ్ నివేదికలో వెల్లడైందని ఎల్బీఎస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమితా సక్సేనా చెప్పారు.
ఇక ఈ చిన్నారులు ఉమ్మేసిన ఉమ్మిని నిస్సిగ్గుగా తుడుచుకున్న రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో బిజీ అయిపోయారు. వాళ్ళ మరణాలకు మీరే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ మీద, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ ప్రజల పట్ల ఆయా పార్టీల నిబద్దతను బయటపెట్టుకున్నాయి.
ఇక మనం అన్ని వార్త లాగే దీన్ని కూడా చదివి భారమైన ఓ నిట్టూర్పు విడిచి... మళ్ళీ రేపటి వార్తల కోసం ఎదురు చూద్దామా... లేదంటే...
లక్షల కోట్ల ఆస్థులున్న కొన్ని కుటుంభాలు ఒకవైపు.... ప్రభుత్వ గోదాముల్లో ముగ్గి పోతున్న లక్ష క్విటాళ్ళ ధాన్యం ఒక వైపు... ఆకలితో, అప్పులతో ఆత్మహత్యలతో, ఆకలితో చనిపోతున్న లక్షలాది పేదలు మరొక వైపు... ఈ పరిస్థితికి కారణమైన ఈ పాలకులపై పోరాడటానికి సిద్దమవడమా ..... తేల్చుకోవాల్సిన సమయమిది.
Keywords : delhi, Three sisters, Mandawali, died, starvation,
(2022-06-27 09:45:17)
No. of visitors : 2303
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రిʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని..... |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..