include 'men';
?>
ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం
భారత విప్లవ నేత చారు మజుందార్ వర్ధంతి రోజైన జూలై 28 నుండి ఆగస్ట్ 3వ తేదీవరకు సీపీఐ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అమరుల సంస్మరణ వారాన్ని ప్రజలు విప్లవోత్సాహంతో జరుపుకుంటున్నారు.
ఏవోబీలో అమరుల సంస్మరణ వారోత్సవాలు విజయ వంతంగా జరుగుతున్నాయి. వారోత్సవాలతో మారుమూల గ్రామాల్లో మావోయిస్టు నేతలు, దళసభ్యులు అమరవీరుల స్తూపాల వద్ద ఎర్ర జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. సమీప గ్రామాల గిరిజనుల సమక్షంలో అమరవీరులకు ఘనం గా నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ముంచంగిపుట్టు మండలం మారుమూల గ్రామాలకు సమీపంలోని ఒడిశా ప్రాంతంలో పలుచోట్ల రెండు రోజుల నుంచి మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రెండో రోజైన ఆదివారం ఏవోబీలో కామైడ్స్ లత, జ్యోతి, శాంతి, లక్ష్మణ్ పేరుతో అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించిన మావోయిస్టు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వేలాదిమంది ప్రజలతో బహిరంగ సభను నిర్వ హించారు. సుమారు 80మందికి పైగా మావోయిస్టులు ఈ సభ లో పాల్గొన్నట్టు సమాచారం. వారోత్సవాలకు సమీపంలోని ఒడిశా, విశాఖ ఏజెన్సీకి చెందిన గిరిజనులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమరవీరులకు నివాళులు, జోహర్లు అర్పిస్తు మావోయిస్టు దళ సభ్యులు పలు గీతాలు ఆల పించినట్టు తెలుస్తోంది. అలాగే ఒడిశాలోని కటాప్ ఏరియాలోని పలు చోట్ల కూడా అమరవీరుల స్తూపాలను మావోయిస్టులు అవిష్కరించారు. ఏవోబీలో మావోయిస్టులు అధికంగా సంచ రిస్తూ, అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుండ డంతో పోలీసు యంత్రాంగం హైఎలర్ట్ ప్రకటించింది.ఒడిశా పోలీసులతో కలసి, ఉమ్మడిగా కూంబింగ్ చేపట్టింది. పోలీసు పార్టీలు అధికంగా అడవిలో జల్లెడ పడుతున్నప్పటికీ ప్రజలు ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహిస్తూ అమరుల ఆశయాలను ఎత్తిపడుతున్నారు. తొలిరోజైన శనివారంనాడు కూడా పాడేరు ప్రాంతంలో అమరవీరుల సంస్మర ణ వారోత్సవాలను నిర్వహించి స్థూపాలను ఆవిష్కరించారు. భారీ బహిరంగ సభ నిర్వహించి పోలీసులకు సవాల్ విసిరారు. ఏవోబీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో తొలిరోజు నిర్వహించిన అమరవీరుల సంస్మరణ వారోత్స వాలకు సంబంధించిన ఫొటోలు శనివారం రాత్రి పాడేరులోని పత్రిక కార్యాలయాలకు అందాయి. సీలేరు ప్రాంతంలోఊరూరా ఎర్రటి బ్యానర్లు కట్టి, స్థూపా లకు ఎరుపురంగు పూసి చనిపోయిన వారి పేర్లను రాసి పేరు పేరున నివాళి అర్పించారు. ఏవోబీ సరిహద్దు కటాప్ ఏరియా లో మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించారు. వంద లాది మంది గిరిజనులు పాల్గొన్నారు. రామ్గూడ ఎన్కౌంటర్లో మరణించిన కామేడ్ లత, జ్యోతి, శాంతి, లక్ష్మణ్ ల స్మ్రుత్యర్దం స్తూపాలు ఆవిశ్కరించారు. ఈ వారోత్సవాలు అగ్రనే తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఒరిస్సా లోని రాయగడ జిల్లా నైమ గిరి పర్వతశ్రేణుల్లో మావోయిస్టుల బ్యానర్లు, వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రజల గురించి ప్రాణాలు ఇచ్చిన అమరుల బాటలో నడిచి సమసమాజాన్ని నిర్మిస్తామని మావోయిస్టులు నినదించారు.
రాయగడ జిల్లాలో మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించు కుని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, చంద్రపుర్ సమితుల్లోని మారుమూల గ్రామాల్లో ఈ మూడు రోజులుగా అనేక సభలు జరిగాయి ప్రతి గ్రామంలో వందలాది మంది ప్రజలు సభలకు ముందు ర్యాలీలు నిర్వహించారు.
Keywords : maoists, martyrs, aob, police
(2024-03-11 18:21:10)
No. of visitors : 2686
Suggested Posts
| రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలుఈ దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను ధారబోసిన అమరులను సంస్మరించుకుంటూ రేపటి(జూలై 28) నుండి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల సంస్మరణ వారాన్ని ఈ దేశ పీడిత ప్రజానీకం నిర్వహించుకుంటోంది. సీపీఐ మావోయిస్టు పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ వారం రోజులపాటు బహిరంగ సభలు, సమావేశాలు జరుగుతాయి. |
| Martyrs Week: Maoists organise Huge meeting in MalkangiriDespite of tight security by security forces in the tribal-dominated region, the rebels successfully organised camps at a few places today to observe the Maoists martyrsʹ week. |
| అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులువిశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని అటవీ ప్రాంతంలో బుధ వారం అమరవీరుల వారోత్స వాలను వేలాదిమంది ఆదివాసులు భారీ ఎత్తున జరుపుకున్నారు. ఎత్తయిన కొండపై నిర్మించిన 30 అడుగుల అమరల స్తూపాన్ని ఈ సందర్భంగా సీపీఐ మావో యిస్టు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..