కుట్ర సిద్దాంతం పెద్ద కుట్ర...రేపు విజయవాడలో సభ‌

కుట్ర

*మోడీ హత్యాయత్న కధనం పేరిట విప్లవ మేధావుల అరెస్టులపై విజయవాడలో న్యూడెమోక్రసీ పార్టీ సభ* !

(31-8-2018 ఉదయం 10 గంటలకి VIJ ప్రెస్ క్లబ్ లో)
ప్రియమైన పౌరులారా, నాజీ పార్టీ నేతృత్వంలో మూక స్వామ్యం బలపడిన ఫలితంగా హిండెన్ బర్గ్ స్థానంలో హిట్లరే జర్మన్ ఛాన్సలర్ గా ఎన్నికవ్వడం తెలిసిందే! నాటి ప్రపంచ చరిత్ర గమనంలో అదో విధ్వంసకరమైన అడుగు! హిట్లర్ ఛాన్సలర్ గా ఎన్నికయిన వెంటనే మొట్ట మొదటి పెద్ద వ్యూహాత్మక రాజకీయ కుట్ర పార్లమెంటు భవనాన్ని దగ్ధం చేయడమే! జర్మన్ రాజ్యాంగాన్ని, దాని సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థని మట్టు బెట్టకుండా నాజీయిజాన్ని (ఫాసిజం) అమలు చేయడం ఆచరణ లో అసాధ్యం! ఈ నిప్పు వంటి నిజం హిట్లర్ మూకకి తెలుసు! దానికి ఆర్ధిక వెన్నుదన్నుగా నిలిచిన ద్రవ్య పెట్టుబడిదారీ వర్గానికి మరింత బాగా తెలుసు. అందుకే వాటికి ప్రతీక (సింబల్) ఐన రీచ్ స్టాగ్ (పార్లమెంటు) భవనం వాస్తవానికి నాజీయిజానికి గిట్టని శత్రువు అవుతుంది. అట్టి తన శత్రుప్రతీక ఐన పార్లమెంటు భవనాన్ని అర్ధరాత్రి చాటు గా తన నాజీ మూకలతో తానే తగలపెట్టించి, తన ప్రత్యర్థి రాజకీయశక్తుల అణచివేత కి నాటి హిట్లర్ సర్కారు వ్యూహం పన్నింది. నిజానికి తగలబఢ్ఢ పార్లమెంటు భవనం ప్రాణం లేనిది. నాటికి ఎంతో కొంత ప్రాణం ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మరణ శాసనం రాయడం హిట్లర్ సర్కారు లక్ష్యం. ఒక వైపు అట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకి కార్యస్థానమైన నిర్జీవ పార్లమెంటు భవనాన్ని తగలపెట్టించి, మరోవైపు దానికీ, అది కేంద్రంగా సాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకూ తాను కాపలా దారున్ని అయినట్లూ హిట్లర్ సర్కార్ హిపోక్రటిక్ గా కార్పొరేట్ మీడియా సాయంతో భారీ ప్రచారం చేయించుకున్నది. కమ్మునిస్టులు(యూదులు కూడా) దాన్ని తగలబెట్టితే తాను దాని పరిరక్షకుడిని ఆన్నట్లుగా జర్మన్ జాతిలో చిత్రించుకున్నది. ఈవిధంగా ఒకవైపు పార్లమెంటు భవనం దగ్ధం చేశారనే కుట్ర కేసుల్లో తన రాజకీయ ప్రత్యర్థులని ఇరికించి, శత్రు శేషం లేని స్థితిని సృష్టించ జూసింది. మరోవైపు జర్మన్ జాతీయుల్లో తన వ్యక్తిగత రాజకీయ పేరు ప్రతిష్టలను పెంచుకోజూసింది. ఆనాడు ఈ విధంగా అధికారాన్ని జర్మన్ లో నాజీయిజం స్థిరపరుచుకో గలిగింది. అది తర్వాత ప్రపంచానికే పెద్ద రాజకీయ శాపంగా మారింది. ఇది చెరిగిపోని గత విషాదకర, విధ్వంసకర ప్రపంచ చరిత్ర! నేడు భారతదేశ చరిత్ర గమనం కూడా అదే బాటలో సాగుతున్నది. అదే దిశలో నేటి మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. ఇవి ఆ స్థాయికి ఇంకా చేరక పోవచ్చు. వీటిని వాటితో పోల్చే స్థాయి కాక పోవచ్చు. కానీ ఏ దిశలో ఈ పయనం సాగుతున్నదనేది ముఖ్యం! హిట్లరు సర్కారు తాను చంపదలిచిన పార్లమెంటరీ వ్యవస్థకి కార్యస్థానమైన నిర్జీవ భవనాన్ని తగల బెట్టించి ప్రత్యర్థులపై కుట్ర కేసు పెట్టింది. కానీ మోడీ సర్కారు ఏకంగా తమ ప్రధాన మంత్రి(మోడీ)ని చంపే పధకం పన్నినట్లు ప్రత్యర్థులపై కుట్ర కేసును మోపింది. దేశంలో వివిధ రాష్ట్రాలకి చెందిన అనేక మంది విప్లవ మేధావులని అందులో ఇరికించారు. మన తెలుగుసీమ నుండి ఏడున్నర పదుల వయసు దాటిన వృద్ద విప్లవ కవి వరవరరావుని కూడా ఆ కుట్ర కేసులో ఇరికించింది. ఇది కేవలం ప్రజాతంత్ర, విప్లవ మేధావులకు పరిమితమైన నిర్బంధ కాండ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది భిన్నత్వం, బహుళత్వం, వైవిధ్య భరిత సామాజిక, రాజకీయ వ్యవస్థపై వ్యవస్తీకృత దాడి! ఇది ఇప్పటికే గత నాలుగేళ్ళ మోడీ పాలన రుచి చూపించింది. ఆ చేదు అనుభవాల వెలుగులో రేపటి ఎన్నికలలో దేశ ప్రజలలో ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితులని అధిగమించే పెద్ద కుట్ర ఇది.
ఇప్పుడు మౌనం కూడా నేరమే! దుష్టులకు దూరంగా ఉండాలన్న నైతిక సూత్రాలు ఆచరణలో దుష్టత్వానికే బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు కూడా గొంతు విప్పకపోతే సమాజ మనుగడకి ముప్పుతప్పదు అన్ని వర్గాలని అంతం చేసే వరకు మౌనం వహించిన చివరి జర్మన్ పౌరులకీ చరిత్రలో ఏ గతి పట్టిందో ఓ జర్మన్ కవి చెప్పినవాక్యాలు తెలిసిందే! అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే మనం గొంతు విప్పుదాం. "జీనా హైతో మర్నా సీకో-కదం కదం పర్ లడ్ నా సీకో" (బ్రతకాలంటే చావడం నేర్చుకో- అడుగడుగునా పోరాటం నేర్చుకో) అనే పోరాట నినాద స్పూర్తితో అడుగులు వేద్దాం!
వరవరరావు తదితర విప్లవ మేధావులని, ప్రజాతంత్ర మేధావులని కుట్ర కేసుల్లో ఇరికిస్తున్న RSS సర్కారు ఫాసిస్టు విధానానికి నిరసనగా విజయవాడలో CPI ML న్యూ డెమోక్రసి పార్టీ AP రాష్ట్ర కమిటీ 31-8-2018 న సభ నిర్వహిస్తున్నది. VIJ ప్రెస్ క్లబ్ లో ఉదయం 10గంటలకి జరిగే ఈ సభకి హాజరు కావల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

వై. సాంబశివరావు, పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి,
29-8-2018; విజయవాడ

Keywords : maoists, prime minister, varavararao, arrests, police, new democracy
(2024-03-09 05:33:37)



No. of visitors : 1257

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కుట్ర