include 'men';
?>
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
మారదు. లోకం మారదు. లోకం తీరు మారదు. సుప్రీంకోర్టు దళితుడు అనే పదం వాడొద్దు అనే తీర్పు ఇస్తుంది. కాని దళితులపై అనరాని మాటలు అనడం మాత్రం ఆగదు. ఆ ఒక్క మాట అనకపోతేనేం.. అగ్రకులస్థులు చేయాల్సిన దారుణాలన్నీ చేస్తున్నారు. ఉన్మాదులుగా ప్రవర్తిస్తూ దళితులపై దమనకాండ కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.
ఒక దళితుడు నీలం రంగు తలపాగా ధరించడం పెద్ద నేరంగా మారింది. అందుకు అగ్రవర్ణ ఉన్మాదులు వేసిన శిక్ష చర్మం వొలిచేయడం. అవును వారు అతనికి వేసిన శిక్ష తల చర్మాన్ని ఒలిచేయడం. వినడానికే ఎంతో గగుర్పాటును కలిగిస్తున్న ఈ చర్య నిజంగా ఒక దళితుడిపై జరిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లాలో చోటు చేసుకుంది. కులం వివక్ష ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.
శివ్పురిలోని మొహోబా గ్రామం, ఎస్సీ వర్గానికి చెందిన బీఎస్పీ నేత సర్దార్ సింగ్ జాదవ్ ఎప్పుడూ తన తలపై నీలం రంగు తలపాగా చుట్టుకుంటాడు. ఈ నెల 3న సర్దార్ సింగ్ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు గుజ్జర్ యువకులు పిలిచారు. నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి వెళ్ళాడు సర్దార్ సింగ్ జాదవ్. అక్కడికి వెళ్ళగానే నిందితులు ముగ్గురూ జాదవ్ను అసభ్య పదజాలంతో ధూషించడం మొదలు పెట్టారు.
అనంతరం నిందితులు జాదవ్పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. తీవ్ర రక్త స్రావమైన సర్దార్ జాదవ్ గాయాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇంకా నిందితులను, పోలీసులు అరెస్ట్ చేయలేదు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్ను గ్వాలియర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జాదవ్ రోజూ నీలం రంగు తలపాగా ధరించడాన్ని ముగ్గురు నిందితులు సహించక పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్ గౌతమ్ ఆరోపించారు.
Keywords : మధ్యప్రదేశ్, శివ్పురి, దళితుడు, తల ఒలిచివేత, skin, head, madhyapradesh, shivpuri
(2024-03-15 09:23:33)
No. of visitors : 821
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..